Breaking News Live Telugu Updates: ముగిసిన వైసీపీ విస్తృతసాయి సమావేశం, పార్టీ నేతలకు సీఎం జగన్ దిశానిర్దేశం 

ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.

ABP Desam Last Updated: 13 Feb 2023 06:57 PM
ముగిసిన వైసీపీ విస్తృతసాయి సమావేశం, పార్టీ నేతలకు సీఎం జగన్ దిశానిర్దేశం 

ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్య నేతలతో సీఎం జగన్ భేటీ ముగిసింది. 30 మంది ఎమ్మెల్యేలు ఇంకా గడప గడపకు వెళ్లడంలేదని  సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తంచేశారు. కోడ్ ఉన్న  ప్రాంతంలో గడప గడపకి  బ్రేక్ ఇచ్చి తర్వాత  కొనసాగించాలని నిర్ణయించారు. ఈ నెల 20న జరిగే  మా భవిష్యత్ నువ్వే  జగన్  కార్యక్రమంలో  చురుగ్గా  పాల్గొనాలని ఆదేశించారు. 


 

రాజధానిని చూసి పెట్టుబడులు పెట్టరు- మంత్రి వేణుగోపాల్ 

ఏ రాష్ట్రంలోనైనా రాజధానిని చూసి పెట్టుబడులు పెట్టరు. పరిపాలన చూసి పెట్టుబడులు పెడతారని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు అమరావతే రాజధాని అన్నారు. ఒక రాజధానినే కొనసాగించాలన్న టీడీపీ ప్రభుత్వ నిర్ణయం, ప్రజల అభిప్రాయానికి పూర్తిగా వ్యతిరేకంగా ఉందన్నారు. ఏపీ విభజన చట్టాన్ని అమలు చేయడం కోసం శివరామకృష్ణ కమిషన్​ వేశారు. కానీ ఆ కమిషన్​ చెప్పిన విషయాలను, సూచనలను పట్టించుకోకుండా తనకు కావాల్సిన తీరుగా చంద్రబాబు రాజధానిపై నిర్ణయం తీసుకున్నారని విమర్శించారు. తనకు కావాల్సిన విధంగా కమిషన్ నియమించి, తనకు నచ్చినట్లుగా రాజధాని నిర్మాణం మొదలుపెట్టి.. అందరూ అది ఒప్పుకోవాలని బలవంతం చేయడం సరికాదన్నారు మంత్రి వేణుగోపాల్.

సీఎం కేసీఆర్ కొండగట్టు పర్యటన వాయిదా 

రేపటి సీఎం కేసీఆర్ కొండగట్టు పర్యటన వాయిదా పడింది. ఎల్లుండి కొండగట్టుకు సీఎం కేసీఆర్ వెళ్లనున్నారని తెలుస్తోంది. మంగళవారం రద్దీ దృష్ట్యా భక్తులకు అసౌకర్యం కలుగకుండా పర్యటన వాయిదా వేసుకున్నట్లు సమచారం. 
 

WPL Auction 2023: యువ కెరటం జెమీకి రూ.2.2 కోట్లు.. షెఫాలీ కేక

టీమ్‌ఇండియా యువ కెరటం జెమీమా రోడ్రిగ్స్‌ను రూ.2.2 కోట్లకు దిల్లీ క్యాపిటల్స్‌ తీసుకుంది. ఆస్ట్రేలియా కెప్టెన్ మెగ్‌ లానింగ్‌ను రూ.1.1 కోట్లకు కైవసం చేసుకుంది. డ్యాషింగ్‌ బ్యాటర్‌ షెఫాలీ వర్మను రూ.2 కోట్లు పెట్టి తీసుకుంది. 

WPL Auction 2023: రన్‌ మెషీన్‌ మూనీ గుజరాత్‌కు!

ఆస్ట్రేలియా రన్‌ మెషీన్‌ బెత్‌మూనీని గుజరాత్‌ దక్కించుకుంది. రూ.2 కోట్లకు తీసుకుంది. అమెలియా కెర్‌ను రూ.1 కోటికి ముంబయి దక్కించుకుంది. సోఫియా డాంక్లీని గుజరాత్ రూ.60 లక్షలకు తీసుకుంది.

WPL Auction 2023: యూపీకి తాలి మెగ్‌గ్రాత్‌, ఆర్సీబీకి రేణుక

యువ క్రికెటర్‌ రేణుకా సింగ్‌ను రూ.1.5 కోట్లకు ఆర్సీబీ తీసుకుంది. రూ.1.4 కోట్లకు తాలి మెక్‌గ్రాత్‌ను యూపీ వారియర్స్‌ తీసుకుంది. షబ్నిమ్‌ ఇస్మాయిల్‌ను రూ.కోటికి యూపీ దక్కించుకుంది. 

WPL Auction 2023: ముంబయికి నాట్‌ షివర్‌

ఇంగ్లాండ్‌ క్రికెటర్‌ నటాలియా షివర్‌ను ముంబయి ఇండియన్స్‌ తీసుకుంది. రూ.3.2 కోట్లకు ఆమెను దక్కించుకుంది. దిల్లీ, యూపీ, ఆమె కోసం నువ్వా నేనా అన్నట్టు తలపడ్డాయి.

WPL Auction 2023: దీప్తి శర్మ రికార్డు

టీమ్‌ఇండియా స్పిన్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ దీప్తి శర్మను రూ.2.4 కోట్లతో యూపీ వారియర్స్‌ దక్కించుకుంది. ఆమెకోసం గుజరాత్‌, దిల్లీ, ముంబయి త్రిముఖ పోటీకిదిగాయి. అయితే ఆఖర్లో యూపీ వీరికి షాకిచ్చింది.

WPL Auction 2023: ఎలిస్‌ పెర్రీ ఆర్సీబీకే

ఆస్ట్రేలియా ప్రీమియం ఆల్‌రౌండర్‌ ఎలిస్‌ పెర్రీని ఆర్సీబీ సొంతం చేసుకుంది. రూ.1.7 కోట్లకు ఆమెను దక్కించుకుంది. దిల్లీ క్యాపిటల్స్‌ రూ.కోటి వరకు ఆమెకోసం ప్రయత్నించింది.

WPL Auction 2023: ఆసీస్‌ ఆల్‌రౌండర్‌కు గట్టిపోటీ

ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్‌ యాష్లే గార్డ్‌నర్‌ను గుజరాత్‌ జెయింట్స్‌ దక్కించుకుంది. రూ.3.2 కోట్లకు తీసుకుంది. ఆమె కోసం ముంబయి, యూపీ వారియర్స్‌, గుజరాత్‌ వరుసగా బిడ్లు వేశాయి.

WPL Auction 2023: ముంబయి ఇండియన్స్‌కు హర్మన్‌

టీమ్‌ఇండియా కెప్టెన్ హర్మన్‌ప్రీత్‌ను ముంబయి ఇండియన్స్‌ దక్కించుకుంది. ముందుగా ఆర్సీబీ ఆమెకు బిడ్‌ వేసింది. అయితే రూ.1.80 కోట్లకు ఆమెను ముంబయి సొంతం చేసుకుంది.

WPL Auction 2023: రూ.3.4 కోట్లకు స్మృతి మంధానను దక్కించుకున్న RCB

మహిళల ప్రీమియర్‌ లీగు వేలంలో టీమ్‌ఇండియా ఓపెనర్‌ స్మృతి మంధాన జాక్‌ పాట్‌ కొట్టేసింది. ఆమెను రూ.3.2 కోట్లకు బెంగళూరు దక్కించుకుంది. ముంబయి ఇండియన్స్‌ ఆమెకోసం ఎంతో ప్రయత్నించింది. చివరికి బెంగళూరుకే విజయం లభించింది.

Janagama Collectorate: కలెక్టరేట్ భవనం ఎక్కి దంపతుల ఆత్మహత్యాయత్నం

ఐదేళ్లుగా తిరిగిన భూ సమస్య పరిష్కారం చేయడం లేదంటూ దంపతులు ఆత్మహత్యా యత్ననికి  పాల్పడిన ఘటన  జనగామ కలెక్టరేట్ లో చోటు చేసుకుంది. జనగామ జిల్లా కలెక్టర్ కార్యాలయం పైకి ఎక్కి డీజిల్ పోసుకొని భార్యాభర్తలు నర్సింగరావు, రేవతి లు ఆత్మహత్యకి యత్నించారు. వెంటనే అప్రమత్తమైన కలక్టరేట్ సిబ్బంది పై నుంచి నీళ్లు చల్లి వాళ్ళను కిందికి దింపివేశారు.  జనగామ మండలం పసరమడ్ల గ్రామానికి చెందిన నర్సింగరావు తన నాలుగు ఎకరాల భూమిని వేరే వారికి ఎలాంటి పత్రాలు లేకుండా పట్టాలు చేశారని, ఎన్ని సార్లు అధికారుల చుట్టూ తిరిగిన న్యాయం జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కలెక్టర్ హామీ ఇచ్చినా ఇంతవరకు ఎలాంటి న్యాయం జరగక పోవడంతో ఆత్మహత్యకి యత్నించినట్లు తెలిపారు. గతంలో ఇదే భూ సమస్య పరిష్కారం రెండుసార్లు నర్సింగరావు ఆత్మహత్యకు యత్నించడం గమనార్హం.

Krishna University: కృష్ణా యూనివర్సిటీలో ఉద్రిక్తత

  • కృష్ణా యూనివర్సిటీలో ఉద్రిక్తత

  • భారీగా పోలీసుల మోహరింపు

  • మొన్న కరెంట్ షాక్ కు గురైన విద్యార్థులకు, వెరుగైన వైద్యం అందించాలని, వాళ్లకు పరిహారం ఇవ్వాలంటూ డిమాండ్

  • మచిలీపట్నం క్రిష్ణా యూనివర్సిటీలో విద్యార్థుల ధర్నా

  • విద్యార్థులు యూనివర్సిటీ ముందు బైఠాయింపు

  • ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థిని విద్యార్థులు ఎగ్జామ్ రాయకుండా ధర్నాకు

  • వి వాంట్ జస్టిస్ అంటూ పెద్ద ఎత్తున్న నినాదాలు

  • విద్యార్థులకు అవసరమైన సదుపాయాలు ఏర్పాటు చేయటంలో  కృష్ణా యూనివర్సిటీ విఫలమైందంటూ ఆవేదన

  • హాస్టల్ భవన నిర్మాణంలో జాప్యం చేస్తున్నారంటూ మండిపాటు

  • హాస్టల్ భవన నిర్మాణానికి యూనివర్సిటీ అధికారులకు ముడుపులు చెల్లించలేమంటూ చేతులెత్తేసిన కాంట్రాక్టర్లు

  • మీడియాకు సమాధానం చెప్పని యూనివర్సిటీ వైస్ ఛాన్స్‌లర్

కామారెడ్డి మాస్టర్ ప్లాన్ ఫై హైకోర్టు విచారణ

  • కామారెడ్డి మాస్టర్ ప్లాన్ ఫై హైకోర్టు విచారణ

  • మాస్టర్ ప్లాన్ నిర్ణయాన్ని హోల్డ్ లో పెట్టామని కోర్టుకు తెలిపిన ప్రభుత్వం

  • కోర్టుకు తెలపకుండా మాస్టర్ ప్లాన్ పై ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం

  • సింగిల్ బెంచ్ లో ఉన్న మరో పిటిషన్ ను డివిజన్ బెంచ్ లో ఇంప్లీడ్ చేసిన హైకోర్టు

  • డివిజన్ బెంచ్ లో పార్టీ ఇన్ పర్సన్ గా వాదనలు వినిపించిన కేఏ పాల్

  • తదుపరి విచారణ ఏప్రిల్ 17 కు వాయిదా వేసిన హైకోర్టు

Jaggayyapet News: జగ్గయ్యపేటలో పోలీసులపై ఎమ్మార్పీఎస్ కార్యకర్తల రాళ్లదాడి

జగ్గయ్యపేటలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితి చోటు చేసుకుంది. పోలీసులకు ఎమ్మార్పీఎస్ కార్యకర్తలకు మధ్య ఘర్షణ జరిగింది. ఈ గొడవలో ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు పోలీసులపై రాళ్లదాడి చేయగా, ఓ కానిస్టేబుల్‌కు తలపై బలమైన గాయం కూడా అయింది. అయితే, ఈ ఘటనకు దారి తీసిన కారణాలపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

NTR District News: ఎన్టీఆర్ జిల్లా చౌటపల్లి గ్రామంలో అర్థరాత్రి క్షుద్ర పూజల కలకలం

  • ఎన్టీఆర్ జిల్లా చౌటపల్లి గ్రామంలో అర్థరాత్రి క్షుద్ర పూజల కలకలం

  • తిరువూరు మండలం టేకులపల్లి-చౌటపల్లి గ్రామాల సరిహద్దుల్లో లంకెబిందెలు ఉన్నాయని క్షుద్రపూజలు                            

  • గుప్తనిధుల కోసం వచ్చిన పూజరుల వెంట ఒక చిన్న బాలుడు ఉండటంతో నరబలి ఇవ్వడానికే  తెచ్చారని గ్రామస్తుల ఆగ్రహం

  • గుప్తనిధుల కోసం వచ్చిన ఎనిమిది మంది సభ్యులు

  • బుగ్గపాడు, తిరువూరు, ఏరుకోపాడు, టేకులపల్లి వాసులు

  • మొత్తం 8 మంది గుప్తనిధుల ముఠాలో నలుగురు పరార్

  • మరో నలుగుర్ని పట్టుకుని పోలీసులకు అప్పగించిన గ్రామస్తులు

Kukatpally Fire Accident: కూకట్ పల్లిలో అగ్ని ప్రమాదం, మూడు బస్సుల్లో ఎగసిపడ్డ మంటలు

కూకట్ పల్లిలో అగ్ని ప్రమాదం సంభవించింది. పార్కింగ్ యార్డ్‌లో ఉన్న భారతీ ట్రావెల్స్ కు చెందిన మూడు బస్సులు అగ్నికి ఆహుతి అయ్యాయి. స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం అందించగా, వారు మంటలను అదుపు చేశారు. కానీ, ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

Background

దక్షిణ బంగాళాఖాతంలో, శ్రీలంకకు దిగువన బలమైన మేఘాలు, తేమ గాలులు కేంద్రీక్రుతం అయ్యాయి. వీటివల్ల తెలుగు రాష్ట్రాలపై ఎలాంటి ప్రత్యేక ప్రభావం పడబోదని వాతావరణ నిపుణులు తెలిపారు. ఉత్తర భారతం నుంచి వస్తున్న పొడి గాలుల ప్రభావంతో తెలుగు రాష్ట్రాలు సహా దేశవ్యాప్తంగా వర్షాలు పడే అవకాశం లేదని తెలిపారు. ఉత్తర వాయువ్య దిశ నుంచి వస్తున్న పొడిగాలుల వల్ల పగటి ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయని అంచనా వేశారు. వచ్చే మూడు రోజులు రాత్రి వేళ ఉష్ణోగ్రతలు తగ్గడంతో పాటు పగటిపూట వేడి పెరుగుతుందని అంచనా వేశారు. 


నేడు తెలంగాణలో సగానికిపైగా జిల్లాలకు హైదరాబాద్ వాతావరణ విభాగం ఎల్లో అలర్ట్ అలర్ట్ జారీ చేసింది. ఇక గత కొద్ది రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో పొడి వాతావరణం ఉంటుండగా, అదే కొనసాగుతుందని రెండు రాష్ట్రాల వాతావరణ కేంద్రాల అధికారులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌తో పోల్చుకుంటే తెలంగాణలో చలి తీవ్రత కాస్త ఎక్కువగా ఉండబోతుంది.


కొద్ది రోజులుగా తెలంగాణలో చలి సాధారణంగా ఉండగా, ఇప్పుడు కాస్త పెరిగింది. రాష్ట్రంలో తెలంగాణలోని 7 జిల్లాలకు హైదరాబాద్ వాతావరణ విభాగం ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఎల్లుండి ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. సాధారణంగా 5 నుంచి 10 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందనిపిస్తే వాతావరణ విభాగం ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేస్తుంది. 11 నుంచి 15 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉంటే ఎల్లో అలెర్ట్ జారీ చేస్తుంటారు. రాబోయే ఐదు రోజులకు సంబంధించి తెలంగాణ వాతావరణ విభాగం నమోదు కానున్న ఉష్ణోగ్రతల అంచనాలను వెదర్ బులెటిన్‌లో వివరించింది.


ఎల్లో అలర్ట్ ఈ 20 జిల్లాల్లో
ఆదిలాబాద్, కుమ్రుం భీమ్‌, మంచిర్యాల, నిర్మల్, కామారెడ్డి, సంగారెడ్డి, మెదక్ జిల్లాలు సహా మొత్తం 20 జిల్లాల్లో నేడు చలి ఎక్కువ ఉంటుందని వాతావరణ నిపుణులు చెప్పారు. ఈ మేరకు ఎల్లో అలెర్ట్ జారీ చేశారు. వచ్చే 5 రోజులు రాత్రిపూట చలి పెరుగుతుందని, పగటిపూట ఎండ కూడా పెరుగుతుందని వెదర్ బులెటిన్ లో వివరించారు. తెలంగాణ ప్రాంతంలో ఎలాంటి వర్ష సూచన లేదు.


ఇక మహబూబ్ నగర్‌లో గరిష్ణ ఉష్ణోగ్రత నమోదు అయింది. అక్కడ 36.9 డిగ్రీలు నమోదైనట్టు వాతావరణ విభాగం తెలిపింది. అత్యల్ప ఉష్ణోగ్రత ఆదిలాబాద్‌లో 12.2 డిగ్రీలు నమోదైంది. ఇవాళ అత్యధిక ఉష్ణోగ్రత 34 డిగ్రీల కన్నా ఎక్కువగా ఉంటుందని, అత్యల్పం 15 డిగ్రీలుగా ఉంటుందని అంచనా అధికారులు వేశారు.


‘‘ఆకాశం పాక్షికంగా మేఘాలు పట్టి ఉంటుంది. నగరంలో పొగ మంచు ఉదయం సమయంలో ఏర్పడుతుంది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 34 డిగ్రీలు, 17 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. ఉత్తర దిశ నుంచి గాలులు గాలి వేగం గంటకు 4 నుంచి 6 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది’’ అని వెదర్ బులెటిన్ లో పేర్కొ్న్నారు. నిన్న గరిష్ఠ ఉష్ణోగ్రత 35.4 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 17.9 డిగ్రీలుగా నమోదైంది.


ఏపీలో ఇలా
ఆంధ్రప్రదేశ్‌ వాతావరణ విభాగం తెలిపిన వివరాల మేరకు ఆంధ్రప్రదేశ్, యానాం ప్రాంతాల్లో దిగువ ట్రోపోస్ఫిరిక్ స్థాయిల్లో ఈశాన్య, తూర్పు దిశలలో గాలులు వీస్తున్నాయని వెదర్ బులెటిన్ లో పేర్కొన్నారు.


ఈ వాతావరణ పరిస్థితుల వల్ల ఏపీలోని ఉత్తర కోస్తా ఆంధ్ర, యానాం ప్రాంతాల్లో వచ్చే మూడు రోజులు పొడి వాతావరణమే ఉంటుందని అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటనలో తెలిపింది. దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ లో కూడా పొడి వాతావరణమే ఉండనుంది. రాయలసీమలో వచ్చే మూడు రోజులు పొడి వాతావరణమే ఉండనుంది.


ఇక క్రమంగా ఎండాకాలం
‘‘రాష్ట్రంలో వాతావరణం మళ్లీ మారనుంది. ఇక మెల్లగా చలి కాలం నుంచి ఎండా కాలానికి మారనుంది. సాధారణంగా ఫిబ్రవరి మొదటి రెండు వారాల్లో అంతగా ఎండ ఉండదు, కానీ ఈ సారి మాత్రం వేసవి కాలం కాస్త ముందుగా, మరింత జోరుగా మొదలవ్వనుంది. మరో ఐదు రోజుల వ్యవధిలో ఉష్ణోగ్రతలు 4-5 డిగ్రీలు రాష్ట్ర వ్యాప్తంగా పెరగనుంది. అనంతపురం నుంచి నెల్లూరు మధ్యలో, నెల్లూరు నుంచి శ్రీకాకుళం వరకు ఉష్ణోగ్రతలు ఒక సారిగా వేడికానుంది. ఇప్పుడే 40 డిగ్రీలు రావు కానీ 37 డిగ్రీల వరకు పలు ప్రాంతాల్లో నమోదవ్వనుంది. ముఖ్యంగా విజయవాడ - గుంటూరు ప్రాంతం, అలాగే నంధ్యాల జిల్లాలో రాష్ట్రంలోని మిగిలిన భాగాలకంటే వేడిగా ఉండనుంది. మరోవైపున చలి కూడా ఉంటుంది. రాత్రి వేళల్లో చల్లగా ఉండే వాతావరణం ఉంటుంది.’’ అని ఏపీ వెదర్ మ్యాన్ తెలిపారు.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.