Rohit Sharmas Daughter Samaira Shares Update on Rohit Sharma: తన తండ్రికి కరోనా వచ్చిందని, అందుకే హోటల్‌ గదిలో విశ్రాంతి తీసుకుంటున్నాడని చెబుతోంది చిట్టి సమైరా! పైగా ఒక నెల రోజుల వరకు బయటకు రాడని ముద్దు ముద్దుగా చెబుతోంది. లీసెస్టర్‌ హోటల్లో ఆమె చిలుక పలుకుల వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.


ఐదో టెస్టు, టీ20, వన్డే సిరీసుల కోసం టీమ్‌ఇండియా ఇంగ్లాండ్‌ వచ్చిన సంగతి తెలిసిందే. జులై 1 నుంచి కీలకమైన ఐదో టెస్టు మొదలవుతోంది. ఈ మ్యాచుకు ముందు జట్టుకు ఎదురుదెబ్బ తగిలింది. కెప్టెన్‌ రోహిత్‌ శర్మకు కరోనా సోకింది. రెగ్యులర్‌గా చేసే ర్యాపిడ్‌ టెస్టులో పాజిటివ్‌ రావడంతో అతడిని లీసెస్టర్‌లోని హోటల్‌ గదిలోనే ఐసోలేషన్‌కు పంపించారు.


Also Read: రెండో టీ20 వేదిక ఏంటి? మ్యాచ్‌ ఎన్ని గంటలకు? మార్పులేంటి?


Also Read: ఇంగ్లండ్ టెస్టుకు రోహిత్ స్థానంలో మయాంక్ - కెప్టెన్సీ బాధ్యతలు ఎవరిని వరించేనో!


టెస్టు మ్యాచుకు ఒకరోజు ముందే రోహిత్‌ శర్మ ఐసోలేషన్‌ పూర్తవుతుంది. ముందు జాగ్రత్తగా చర్యగా అతడికి విశ్రాంతి ఇవ్వాలని జట్టు యాజమాన్యం భావించింది. ఐదు రోజుల పోరు కాబట్టి ఆయాసం వచ్చే అవకాశం ఉంటుందని ఆడించడం లేదు. కాగా అసలు పోరుకు ముందు భారత్‌ లీసెస్టర్‌ షైర్‌తో ప్రాక్టీస్‌ మ్యాచ్‌ ఆడిన విషయం తెలిసిందే.


సన్నాహక మ్యాచ్‌ ముగియడంతో ఆటగాళ్లు, కుటుంబ సభ్యులు లీసెస్టర్‌ హోటల్‌ను ఖాళీ చేసే బర్మింగ్‌హామ్‌కు బయల్దేరారు. ఈ క్రమంలోనే సమైరాతో కలిసి రోహిత్‌ శర్మ సతీమణి రితికా సజ్దె బ్యాగులు తీసుకొని బయటకు వచ్చింది. అదే సమయంలో చిన్నారి సమైరాను కొందరు దూరం నుంచే పలకరించారు.


'హాయ్‌ సమి! హౌ ఆర్‌యూ, వేర్‌ ఈజ్‌ యువర్‌ డాడ్‌' అని అడిగారు. అందుకామె 'హీ ఈజ్‌ ఇన్‌ ఏ రూమ్‌. గాట్‌ కొవిడ్‌ పాజిటివ్‌' అని చెప్పింది. ఆ తర్వాత 'హీ నీడ్‌ వన్‌ మంత్‌ రెస్ట్‌' అని చెప్పి బయటకు అడుగులేసింది. ఆమె ముద్దుముద్దుగా మాట్లాడిన వీడియో ఇప్పుడు వైరల్‌ అయింది.