కరోనా కల్లోలం నుంచి బయటపడ్డాం అనుకునే సమయంలో ఒమిక్రాన్ కి భయపడుతూ నూతన ఏడాదిలో అడుగుపెడుతున్న వేళ మరింత భయంకరంగా ఉంటుందంటున్నారు వంగా బాబా.  ఇంతకీ ఈమె ఎవరు.. గతంలో ఆమె చెప్పిన భవిష్యవాణిలో నిజమైన ఘటనలేంటి..


Also Read:  ఆమె చెబితే జరిగిపోతుందంతే.. 2022లో కరోనాని మించిన ప్రాణాంతక వైరస్..
బల్గేరియా పెట్రిచ్‌లో 1911, జనవరి 31న బాబా వంగ జన్మించారు.  12 ఏళ్ల వయసులో ఓ టోర్నడోలో కొట్టుకుపోయి ప్రాణాలతో  బయటపడిన బాబా వగ కళ్లలో ఇసుక పడటంతో చూపు కోల్పోయారు. ఆమె తండ్రి పెంచుతున్న గొర్రెల మంద నుంచి ఓ గొర్రెను దొంగలు ఎత్తుకెళ్ళారు. అప్పుడు వంగా వయసు 16ఏళ్లు.. ఆ సమయంలో ఆగొర్రె ఎక్కడుందో ఆమె ఊహించి చెప్పడం... అదే నిజం కావడంతో అప్పటి నుంచి ఆమె మాటలపై విశ్వాసం పెరిగింది. 30 ఏళ్లనాటికి ఆమె చెప్పినవన్నీ నిజం కావడంతో ‘నోస్ట్రడామస్‌ ఆఫ్‌ ద బాల్కన్స్‌’గా  పిలిచుకునే వారు.


Also Read: 2022 లో ఈ నాలుగు రాశులవారి ఆర్థిక పరిస్థితి ఎలా ఉంటుందంటే...
వాంగ బాబా చెప్పిన వాటిలో జరిగిన ఘటనలు ఇవే..



  • అమెరికాలోని ట్విన్‌ ట్వవర్స్‌ను విమానాలతో కూల్చేస్తారని 1989లోనే వంగా చెప్పారు

  • 2016లో యూరప్‌ పై ముస్లింలు దాడి.. ఇది యుద్ధానికి దారి తీసి చాలా మంది మృత్యువాత పడతారని 996కు ముందే వాంగ జోస్యం చెప్పారు.

  • సిరియాలో ‘గ్రేట్‌ ఇస్లామిక్‌ వార్‌’ మొదలై 2043 నాటికి రోమ్‌పై పూర్తి ఆధిపత్యం సాధిస్తుందన్నారు

  • 2018 నాటికి అమెరికాను వెనక్కి నెట్టి చైనా శక్తివంతమైన దేశంగా అవతరిస్తుందని కూడా చెప్పారు

  • అమెరికా అధ్యక్షుడు కెన్నడీ, భారత ప్రధానులు ఇందిర, రాజీవ్‌ హత్యల గురించి ప్రస్తావన

  • ఓ పెద్ద అల తీరాన్ని కమ్మేస్తుంది. గ్రామాలు, ప్రజలు జలసమాధి అవుతారని 2004లో థాయిలాండ్ తీరంలో సునామీ గురించి జోస్యం చెప్పిన వంగా

  • 2000 ఆగస్టులో రష్యాకు చెందిన అణు జలాంతర్గామికి ‘కురుస్క్‌’ సముద్రంలో కూరుకుపోయిన విషయం వాంగ ముందే చెప్పారు


Also Read: 2022 ఈ నాలుగు రాశుల వారికి కొత్తకొత్తగా ఉంటుంది, చాలా సమస్యల నుంచి రిలీఫ్ పొందుతారు..
బాబా వంగ భవిష్యవాణిలో జరుగుతాయని చెప్పినవి ఇవే..



  • 5079లో ఈ విశ్వం అంతమవుతుంది

  • 3797 నాటికి భూమిపై మనిషనేవాడు ఉండడు

  • 2023లో భూమి కక్ష్య మారుతుంది. దీనివల్ల ధృవాల వద్ద మంచు కరిగి సముద్రాలు పొంగుతాయి.

  • సిరియాలో మొదలయ్యే ఇస్లామిక్‌ వార్‌ 2043లో రోమ్‌ను స్వాధీనం చేసుకోవడంతో ముగుస్తుంది. ఈ సందర్భంలో యూరప్ ప్రజలంతా మృత్యువాత పడతారు.

  • 2130లో నీటిలో నివసించేలా గ్రహాంతరవాసులు మనుషులకు సాయం చేస్తారు

  • 3005లో అంగారకుడిపై యుద్ధం జరుగుతుంది.

  • చంద్రుడిని తోకచుక్క ఢీకొంటుంది. భూమి చుట్టూ రాళ్లు, బూడిద వలయం ఏర్పడుతుంది


వంగా బాబా 1996 ఆగస్టు 11న (84ఏళ్లప్పుడు) మరణించారు. అయితే వంగా బాబా చెప్పిన విషయాలేవీ రాతపూర్వకంగా లేకపోవడంతో అవన్నీ కల్పితాలే అనే ప్రచారం కూడా ఉంది. అయినా మంచి తీసుకోవడం, చెడుని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండడం మంచిదే కదా అంటారు మరికొందరు. 
Also Read: 2022 లో ఈ నాలుగు రాశుల వారు అన్నింటా విజయం సాధిస్తారు, ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం..
Also Read: 1 నుంచి 10వ తేదీ వరకూ పుట్టిన వారి ఆలోచనా విధానం ఇలా ఉంటుంది..
Also Read: 11 నుంచి 20వ తేదీ వరకూ పుట్టిన వారి ఆలోచనా విధానం ఇలా ఉంటుంది..
Also Read: 21 నుంచి 31వ తేదీల్లో పుట్టారా.. మీ వ్యక్తిత్వం ఎలా ఉంటుందో తెలుసుకోండి…
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి