బ్రహ్మదేవుని నుంచి వరం పొందిన మహిషాసురుడు దేవతలతో ఘోరమైన యుద్దం చేసి వారిని ఓడించి ఇంద్ర పదవి చేపట్టాడు. దేవేంద్రుడు త్రిమూర్తులతో మొర పెట్టుకోగా మహిషునిపై వారిలో రగిలిన క్రోధాగ్ని ప్రకాశవంతమైన తేజస్సుగా మారింది. త్రిమూర్తుల తేజమంతా కలసి స్త్రీరూపమై జన్మించింది. శివుని తేజస్సు ముఖంగా, విష్ణు తేజస్సు బాహువులుగా, బ్రహ్మ తేజస్సు పాదాలగా కలసిన మంగళమూర్తి 18 చేతులతో అవతరించింది. శివుడి శూలం, విష్ణువు చక్రం, ఇంద్రుడు వజ్రాయుధం, వరుణుడు పాశం, బ్రహ్మదేవుడు అక్షమాల, కమండలం.. హిమవంతుడు సింహాన్ని ఇచ్చారు. ఇలా సర్వదేవతల ఆయుధాలు అమ్మవారి చేతిలో కనిపిస్తాయి. మరి ఆ ఆయుధాల వెనకున్న ఆంతర్యం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.శంఖం: శంఖం ప్రణవానికి, ఓంకారానికి ప్రతీక. ఈ శబ్ద రూపంలో అమ్మవారు కొలువై ఉందని అర్ధం.ధనుర్భాణాలు: ఇవి శక్తి ని సూచిస్తాయి. ధనుర్భాణాలని ఒక చేతిలో ధరించిన దుర్గా మాత తాను స్థితి గతి శక్తులు రెండింటి మీదా అధికారం కలిగియున్నానని తెలియజేస్తున్నట్టు.ఈటె: అగ్నిదేవుడు దుర్గామాతకు సమర్పించిన ఈటె మండుతున్న శక్తి, శుభానికి చిహ్నంగా భావిస్తారు. చెడు, మంచి వ్యక్తుల మధ్య బేధానికి ప్రతీక.గొడ్డలి: విశ్వకర్మ మహాముని ఇచ్చిన గొడ్డలిని చెడుతో పోరాటానికి చిహ్నంగా పరిగణిస్తారు. ఎలాంటి పరిణామాలకు భయపడకూడదని సూచిస్తుంది.గద: ఆవిడ చేతిలో ఉండే చక్రం ధృడ సంకల్పానికి ప్రతీక. భక్తులు కూడా తమ నమ్మకాల పట్ల అంత ధృడం గా వ్యవహరించాలనీ, ఎలాంటి ఆపద ఎదురొచ్చినా మొక్కవోని ధైర్యం తో ఎదుర్కోవాలని అర్ధం.Also Read: ఆశ్వయుజ మాసం ఎందుకింత ప్రత్యేకం.. శరన్నవరాత్రుల్లో అమ్మవారి ఉపాసన వెనుక ఇంత పరమార్థం ఉందా...కమలం: దుర్గా మాత చేతిలో కమలం పూర్తిగా వికిసితమయ్యి ఉండదు. అంటే సఫలత అనివార్యమనీ కానీ అదే ఆఖరు మజిలీ కాదనీ అర్ధం. సంస్కృతంలో కమలాన్ని "పంకజం" అంటారు. అంటే బురద నుంచి పుట్టినది అని అర్ధం. బురదలో కమలం వికసించినట్లు దురాశ, కోరికల మధ్యలో జీవిస్తున్న భక్తులు కూడా ఆధ్యాత్మికతని వికసింపచేసుకోవాలని సూచన.
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్స్క్రైబ్ చేయండి