Ganesh Chaturthi 2024: విజ్ఞనాయకుడు గణేషుడు. కేవలం విజ్ఞాలు తొలగించే వాడు మాత్రమే కాదు గురుతుల్యుడు కూడా. ఏకదంతుడి కథలు పురాణాల్లో కూడా ప్రత్యేకం. ఈ కథల నుంచి జీవితపాఠాలు నేర్చుకోవచ్చు.


కర్తవ్య పాలనే ముందు


శివుడు లేని సమయంలో స్నానానికి వాడే నలుగు పిండితో పార్వతి చేసిన పిండి బొమ్మ గణపతి. స్నానానికి వెళ్తు కాపలాగా ఉండాల్సిందిగా ఆదేశించింది. ఆమె స్నానం చేసి వచ్చే వరకు రక్షణ బాధ్యత ఆ బాలుడిదన్న మాట. తిరిగొచ్చిన శివుడిని సైతం లోపలికి రానివ్వకుండా అడ్డుకున్నాడు. శివుడు కోపగించుకుని ఇద్దరి మధ్య గొడవకు దారి తీసి ఆబాలుడి తల నరకడంతో ఈ గొడవ పూర్తవుతుంది. తర్వాత ఆబాలుడెవరో తెలుసుకుని ఏనుగు తల అతికిండంతో ఆ ఘట్టం పూర్తవుతంది. ప్రాణం పోయినా సరే విధినిర్వహణలో వెనుకకు తగ్గకూడదనే సందేశం ఈ కథ ద్వారా మనకు అందించాడు వినాయకుడు. కర్తవ్యపాలనను మించిన జీవిత లక్ష్యం లేదని మనం తెలుసుకోవాలి.


Also Read: ఏక సాలగ్రామ శిలపై చెక్కిన గణనాథుడు.. త్రిమూర్తులు ప్రతిష్టించిన విగ్రహం ఇది!


తల్లిదండ్రులను మించిన ముఖ్యమైన వారేవరూ లేరు


ఒకసారి శివపార్వతులు తమ కుమారులైన కార్తికేయుడు, గణేశుడి కి ఒక ఫలాన్ని అందించాలని అనుకున్నారు. అది తీసుకునే అర్హత మాత్రం ఎవరో ఒకరికే వస్తుంది. మూడు సార్లు ప్రపంచాన్ని ముందుగా ప్రదక్షిణ చేసి రావడాన్ని అర్హతగా నిర్ణయించారు. ఈ పోటిలో తానే గెలవాలనే ఆతృతతో కార్తికేయుడు నెమలిపై వేగంగా బయలుదేరాడు. కానీ గణేషుడి వాహనం ఎలుకను ఉపయోగించి ఈ పోటిలో ఎలా పాల్గొంటాడు విజయం తనదే అని కూడా అనుకున్నాడు. కానీ తాను వెళ్లిన ప్రతిచోట తనకంటే ముందు గణేషుడిని ఆయన చూశాడు. ప్రదక్షిణ పూర్తి చేసుకుని వచ్చిన కార్తికేయుడికి తనకంటే ముందే కైలాసం చేరుకుని తల్లిదండ్రులకు ప్రదక్షిణ చేస్తూ కనిపించిన వినాయకుడిని చూసి ఆశ్చర్యపోయాడు. గణపతి కేవలం తల్లిదండ్రులనే ప్రపంచంగా భావించి వారి చుట్టూ చేసిన మూడు ప్రదక్షిణలు అతడికి భూప్రదక్షిణ చేసిన ఫలితాన్ని ఇచ్చింది. ఈ కథతో దేవుడికైనా తల్లిదండ్రులను మించిన లోకం లేదనే సందేశాన్ని అందిస్తున్నాడు గణేషుడు.


Also Read: పరిపూర్ణమైన జగత్తుకి సంకేతంగా చెప్పే వినాయకుడి రూపం వెనుకున్న పరమార్థం ఇదే!


క్షమాపణను మించిన ధర్మం లేదు


ఒకసారి కుబేరుడి విందుకు వెళ్లి కడుపునిండా తృప్తిగా తిని భుక్తాయాసంగా వస్తున్న గణపతి పొరపాటున తడబడి పడిపోయాడు. అది చూసిన చంద్రుడు ఎగతాళిగా నవ్వాడు. అవమానించిన చంద్రుని కోపగించుకుని ఆకాశం నుంచి శాశ్వతంగా మాయం కావల్సిందిగా శపించాడు. కానీ చంద్రుడు తప్పు తెలసుకుని తనని క్షమించాల్సిందిగా వేడుకున్నాడు. పెద్దమనసు కలిగిన గణపతి చంద్రుడిని క్షమించాడు కానీ గణపతి శాపం తప్పక ఫలించి తీరుతుందని దాన్ని పూర్తిగా ఉపసంహరించడం తనకు కూడా వీలు కాదు కనుక నెలలో ఒక రోజు పూర్తిగా అదృశ్యం కాక తప్పదని చెప్పాడు. కోపం కంటే క్షమ గొప్పదని, అవమాన పరిచిన వారిని సైతం క్షమించాలని ఈ కథ ద్వారా గణపతి మనకో జీవిత పాఠాన్ని చెబుతున్నాడు.


పని పూర్తిచేసే పట్టుదల ముఖ్యం


భారతం రాసేందుకు తనకు వ్రాయస కారుడిగా వ్యవహరించాల్సిందిగా గణేశుడిని అభ్యర్థించాడు. అందుకు ఒకటే షరతు విరామం లేకుండా   వ్యాసుడు శ్లోకాలు పఠించాలి. గణేశుడు విరామం లేకుండా రాయాలి. ఇలా ఒకబృహత్కార్యం మొదలైంది. వ్యాసుడు ఆపకుండా చెబుతూనే ఉన్నాడు, గణపతి రాస్తున్నాడు. కానీ మధ్యలో ఫాళీ విరిగిపోతుంది. అప్పుడు  పాళీగా వాడేందుకు తన దంతాలలో ఒకదాన్ని విరిచి ఉపయోగించాడట. అప్పటి నుంచి గణనాథుడు ఏకదంతుడయ్యాడు. తనకు తాను విధించుకున్న షరతును ఎట్టి పరిస్థితుల్లోనూ అధిగమించకూడదనే జీవిత పాఠాన్ని ఈ గణపతి కథ మనకు తెలియజేస్తుంది.


Also Read: వినాయక చవితి స్పెషల్ నైవేద్యాలు.. గారెలు, పెరుగువడలను ఇలా టేస్టీగా చేసి పెట్టేయండి