UP Municipal Polls: 'మమ్మల్ని గెలిపిస్తే మేరఠ్ నగరానికి గాడ్సే పేరు పెట్టేస్తాం'

ABP Desam Updated at: 23 Nov 2022 03:15 PM (IST)
Edited By: Murali Krishna

UP Municipal Polls: నగరపాలక సంస్థ ఎన్నికల్లో గెలిపిస్తే మేరఠ్ నగరం పేరును మారుస్తామని హిందూ మహాసభ హామీ ఇచ్చింది.

'మమ్మల్ని గెలిపిస్తే మేరఠ్ నగరానికి గాడ్సే పేరు పెట్టేస్తాం'

NEXT PREV

UP Municipal Polls:  ఉత్తర్‌ప్రదేశ్‌ నగరపాలక సంస్థ ఎన్నికల్లో పోటీ చేస్తోన్న హిందూ మహా సభ సంచలన హామీ ఇచ్చింది. నగరపాలక సంస్థ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థి మేయర్‌ అయితే మేరఠ్‌ నగరం పేరును నాథూరాం గాడ్సే నగర్‌గా మారుస్తామని ప్రకటించింది.



హిందూ మహాసభకు తగినన్ని కౌన్సిలర్‌ సీట్లు వచ్చి మా అభ్యర్థి మేయర్‌ అయితే నగరం పేరును నాథూరాం గాడ్సే నగర్‌గా మారుస్తాం.                  - పండిట్‌ అశోక్‌ శర్మ, హిందూ మహాసభ జాతీయ ఉపాధ్యక్షుడు


అంతేకాదు


మేరఠ్ మాత్రమే కాకుండా నగరంలో ఉన్న ముఖ్య ప్రదేశాల పేర్లకు కూడా హిందూ నేతల పేర్లను పెడతామని హిందూ మహా సభ వెల్లడించింది. త్వరలో జరగబోయే స్థానిక  సంస్థల ఎన్నికలకు సంబంధించి ఆ పార్టీ ఓ మేనిఫెస్టో  సైతం విడుదల చేసింది. దేశాన్ని హిందూ రాష్ట్రంగా మార్చడమే తమ లక్ష్యమని, గోమాతను కాపాడుకుంటామని మేనిఫెస్టోలో పేర్కొంది.


నగరపాలక సంస్థలో అన్ని వార్డులకూ పోటీ చేస్తున్నామని, దేశభక్తి కలిగిన వారికే అవకాశం ఇస్తామని హిందూ మహాసభ మేరఠ్‌ జిల్లా అధ్యక్షుడు అభిషేక్‌ అగర్వాల్‌ తెలిపారు. ఈ సందర్భంగా భాజపా, శివసేనపై విమర్శలు గుప్పించారు.



భాజపా హిందూ పార్టీ అయినప్పటికీ ఆ పార్టీలో ఇతర వర్గాలకు చెందిన వారి సంఖ్య పెరిగింది. శివసేన సైతం ఒక వర్గాన్ని సంతృప్తి పరిచేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఆ రెండు పార్టీలూ ఐడియాలజీకి దూరమవుతున్నాయి.                                     - అభిషేక్ అగర్వాల్, మేరఠ్ జిల్లా అధ్యక్షుడు


Also Read: US Walmart Store Shooting: అమెరికాలో కాల్పులు- 10 మంది మృతి, పలువురికి గాయాలు!

Published at: 23 Nov 2022 03:15 PM (IST)

- - - - - - - - - Advertisement - - - - - - - - -

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.