Ukraine Crisis: ఉక్రెయిన్ అధ్యక్షుడి కీలక ప్రకటన- దేశం విడిచి వెళ్లకుండా వారిపై బ్యాన్, ఇక ప్రజలే సైనికులు

ABP Desam Updated at: 25 Feb 2022 11:45 AM (IST)
Edited By: Murali Krishna

ఉక్రెయిన్‌లో ఉండే 18-60 ఏళ్ల పురుషులు దేశం విడిచి వెళ్లకుండా ఆ దేశ ప్రభుత్వం బ్యాన్ విధించింది.

ఉక్రెయిన్ కీలక నిర్ణయం

NEXT PREV

ఉక్రెయిన్‌పై రష్యా భీకర దాడులతో విరుచుకుపడుతోన్న వేళ ఆ దేశ అధ్యక్షుడు వొలొదిమిర్‌ జెలెన్‌స్కీ కీలక నిర్ణయం తీసుకున్నారు. రష్యా దాడిని తిప్పికొట్టేందుకు ప్రజలనే సైనికులుగా మార్చి ముప్పేట దాడి చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం కీలక ప్రకటన చేశారు.






ఉక్రెయిన్‌పై రష్యా సైనిక ఆపరేషన్‌ను ఎదుర్కొనేందుకు దేశ రక్షణ శాఖ పూర్తిగా సమాయత్తం కావాలి. ఉక్రెయిన్ సాయుధ బలగాలకు దేశ ప్రజల సాయం కావాలి. దేనికైనా సంసిద్ధంగా ఉండాలి.                                                             -  ఉక్రెయిన్ అధ్యక్షుడు


దేశం విడిచి వెళ్లొద్దు




18-60 ఏళ్ల మధ్య ఉన్న పురుషులు దేశం విడిచి వెళ్లకుండా ఉండేందుకు బ్యాన్ విధించినట్లు ఉక్రెయిన్ సరిహద్దు రక్షణ సర్వీస్ చీఫ్ డేనియల్ మెన్షికోవ్ ప్రకటించారు.


[quote author=డేనియల్ మెన్షికోవ్, ఉక్రెయిన్ సరిహద్దు రక్షణ సర్వీస్ చీఫ్]యుద్ధం కారణంగా ఉక్రెయిన్‌లో ఉండే 18-60 ఏళ్ల మధ్య పురుషులు దేశం విడిచి వెళ్లకుండా చూసేందుకు బ్యాన్ విధించాం. కంగారు పడొద్దు. అనుమతి లేకుండా సరిహద్దు దాటేందుకు ప్రయత్నించవద్దు.          





                 [/quote]


కీవ్ సమీపంలో




రష్యా చేస్తోన్న యుద్ధంపై అధ్యక్షుడు జెలెన్‌స్కీ శుక్రవారం కీలక వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్ రాజధాని కీవ్ నగరంలోకి రష్యా సేనలు చొరబడ్డాయని పేర్కొన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, కర్ఫ్యూ నిబంధనలకు లోబడి ఉండాలన్నారు. ఇప్పటికే ఉక్రెయిన్ వ్యాప్తంగా ఎమర్జెన్సీ అమలులో ఉంది.


Also Read: Russia Ukraine Crisis: ఒంటరిని చేశారంటూ ఉక్రెయిన్ అధ్యక్షుడు భావోద్వేగం, ఆర్మీ డ్రెస్సులో యుద్ధభూమిలోకి జెలెన్‌స్కీ


Also Read: Russia Ukraine Crisis: పుతిన్‌తో మాట్లాడిన ప్రధాని మోదీ, రెండు దేశాల మధ్య హింసను తక్షణమే ఆపాలని విజ్ఞప్తి




Published at: 25 Feb 2022 11:40 AM (IST)

- - - - - - - - - Advertisement - - - - - - - - -

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.