Telugu News Today: వైసీపీ వారియర్స్‌ వీళ్లే - జిల్లాల వారీగా అభ్యర్థుల జాబితా ఇదే!
వైనాట్ అంటూ ఎన్నికల ప్రచారాన్ని మొదలు పెట్టిన వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల్లో పోటీ చేసే వారియర్స్‌ను ప్రకటించారు. భారీ మార్పులు చేర్పుల తర్వాత సీఎం జగన్ మోహన్ రెడ్డి వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు. కడపలోని ఇడుపులపాయలో ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాను, పార్లమెంట్‌ ఎన్నికల్లో పోటీ చేసే ఎంపీ అభ్యర్థుల జాబితాను జగన్ మోహన్ రెడ్డి విడుదల చేశారు. 175 అసెంబ్లీ నియోజకవర్గాలు, 25 పార్లమెంట్ నియోజకవర్గాల అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి


'తెలంగాణ ప్రజల కలలను బీఆర్ఎస్, కాంగ్రెస్ ధ్వంసం చేశాయి' - రాష్ట్ర అభివృద్ధికి ఎన్డీఏ ప్రభుత్వం కృషి చేసిందన్న ప్రధాని మోదీ
గత పదేళ్లుగా తెలంగాణ ప్రజల కలలను బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ధ్వంసం చేశాయని ప్రధాని మోదీ (PM Modi) అన్నారు. నాగర్ కర్నూల్ (Nagar Kurnool)లో నిర్వహించిన బీజేపీ (Bjp) బహిరంగ సభలో శనివారం ఆయన మాట్లాడారు. 'బీఆర్ఎస్, కాంగ్రెస్ అనే రెండు విసుర్రాళ్ల మధ్య తెలంగాణ నలిగిపోయింది. ఇన్నేళ్లు బీఆర్ఎస్ అవినీతికి పాల్పడితే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు తమ వంతు వచ్చినట్లుగా భావిస్తోంది. మల్కాజిగిరిలో ప్రజల అద్భుత స్పందన చూశాను. కాంగ్రెస్, బీజేపీ రెండూ అభివృద్ధికి అడ్డంకిగా మారాయి. బీఆర్ఎస్ ప్రభుత్వం భారీగా అవినీతికి పాల్పడింది.  పూర్తి వివరాలకు క్లిక్ చేయండి 


బీఎస్పీకి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రాజీనామా - బీఆర్ఎస్‌లో చేరికకు నిర్ణయం !
 బీఎస్పీ తెలంగాణ అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పార్టీకి రాజీనామా చేశారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు హఠాత్తుగా ప్రవీణ్ కుమార్ ఈ నిర్ణయం తీసుకోవడంతో రాజకీయవర్గాల్లో ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. ఆయన బీఆర్ఎస్ పార్టీలో చేరి.. నాగర్ కర్నూలు నుంచి ఎంపీగా పోటీ  చేసే అవకాశం ఉంది.  పూర్తి వివరాలకు క్లిక్ చేయండి 


చంద్రబాబు కంటే బాగా చెప్పలేను- కవిత అరెస్టుపై కేటీఆర్‌ ట్వీట్
లిక్కర్‌ స్కామ్‌లో జరిగిన ఆర్థిక లావాదేవీల కేసులో మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె కవితను ఈడీ అరెస్టు చేసింది. ఇది తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. శుక్రవారం ఆమె ఇంట్లో సోదాలు చేసిన ఈడీ అధికారులు.. సాయంత్రానికి అరెస్టు చేసి ఢిల్లీకి తరలించారు. కవిత అరెస్టుపై బీఆర్‌ఎస్‌ వర్గాలు మండిపడుతున్నాయి. ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా ధర్నాలు నిరసన చేపడుతున్నాయి. ఇది రాజకీయ కక్ష సాధింపు చర్యగా హరీష్‌, కేటీఆర్‌ కామెంట్స్ చేస్తున్నారు.  పూర్తి వివరాలకు క్లిక్ చేయండి


లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేస్తున్న ఈసీ, పూర్తి వివరాలివే
లోక్‌సభ ఎన్నికల నోటిఫికేషన్‌ని కేంద్ర ఎన్నికల సంఘం అధికారికంగా విడుదల చేస్తోంది. మరి కాసేపట్లో పోలింగ్ వివరాలు వెల్లడించనుంది. సీఈసీ రాజీవ్ కుమార్ పూర్తి షెడ్యూల్‌ని వెలువరించనున్నారు. లోక్‌సభతో పాటు నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తేదీలు విడుదల చేయనున్నారు.  పూర్తి వివరాలకు క్లిక్ చేయండి