Andhra Pradesh Telugu News - 6 నెలల్లో రేవంత్ సర్కార్ చేసింది జీరో - రైతుల్ని ఆదుకోవాలి - బీఆర్ఎస్ డిమాండ్
ఆరు నెలల్లో తెలంగాణ ప్రభుత్వం చేసిందేమీ లేదని బీఆర్ఎస్ సీనియర్ నేత బోయినపల్లి వినోద్ కుమార్ మండిపడ్డారు. తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడిన ఆయన రేవంత్ సర్కార్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.  రేవంత్ ప్రభుత్వం ఆరో మాసం లోకి ప్రవేశించిందని..   ఎవరికైనా గ్రేడింగ్ ఇవ్వాలంటే మొదటి ఆర్ నెలలు ముఖ్యమైనవన్నారు.  రేవంత్ రెడ్డి ఈ ఆరునెలల్లో తన ఫ్లాగ్ షిప్ ప్రోగ్రాం అని చెప్పుకోవడానికి ఏమీ లేదని విమర్శించారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి


అనంతపురం జిల్లాలో హోరాహోరీ - పోలింగ్ సరళితో రాని స్పష్టత - జోరుగా బెట్టింగులు
అనంతపురం జిల్లాలో నిన్న మొన్నటి వరకు అభ్యర్థుల ప్రచారాల హో.. అభ్యర్థుల ఇళ్ల వద్ద నాయకులు,కార్యకర్తలు, ఓటర్లు హంగామా. ఇప్పుడు పోలింగ్ అయిపోయింది టెన్షన్ తేరింది అనుకున్నారు. కానీ ఇప్పుడు పోటీ చేసిన అభ్యర్థుల్లో కొత్త టెన్షన్ మొదలైంది. గెలుపు లెక్కలతో ఎవరికి వారు టెన్షన్లు పెంచుకుంటూ పోతున్నారు. టికెట్ రానంత వరకు టికెట్ రాదేమో అని భయపడిన నేతలు టికెట్ వచ్చి బరిలో నిలిచిన అనంతరం గెలుస్తామో లేదో అన్న భయం వెంటాడుతుంది.  పూర్తి వివరాలకు క్లిక్ చేయండి


పోలింగ్ అనంతర హింసపై సిట్‌ దర్యాప్తు ప్రారంభం- నాలుగు ప్రాంతాల్లో నాలుగు బృందాల పర్యటన
ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ, లోక్‌సభ పోలింగ్ అనంతరం జరిగిన హింసాత్మక ఘటనలపై సిట్ దర్యాప్తు ప్రక్రియ ప్రారంభమైంది. వినీత్‌ బ్రిజ్‌లాల్‌ నేతృత్వంలో ఏర్పాటైన 13 మంది సభ్యులతో కూడిన సిట్‌ ఇవాళ తొలిసారిగా ఆన్‌లైన్‌లో సమావేశమైంది. సిట్‌కు బాధ్యత వహిస్తున్న బ్రిజ్‌లాల్‌ శుక్రవారం రాత్రే డీజీపీతో సమావేశమయ్యారు. అన్ని వివరాలు అడిగి తెలుసుకున్నారు. రెండు రోజుల్లో నివేదిక ఇవ్వాల్సి ఉన్నందున ఉదయాన్నే పని ప్రారంభించారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి


సీఎం జగన్ టూర్‌లో ఎన్‌ఆర్‌ఐ కలకలం- అదుపులోకి తీసుకున్న పోలీసులు
సీఎం జగన్ మోహన్ రెడ్డి లండన్ వెళ్తున్న టైంలో ఓ వ్యక్తి కలకలం రేపాడు. గన్నవరం ఏయిర్‌పోర్టులో జగన్ ఉండగానే అనుమానాస్పద స్థితిలో ఓ ఆ వ్యక్తి తిరుగుతూ కనిపించాడు. అతన్ని అదుపులోకి తీసుకొని విచారిస్తే చాలా విషయాలు వెలుగులోకి వచ్చాయి. జగన్ మోహన్ రెడ్డి తన ఫ్యామిలీతో లండన్ టూర్‌ వెళ్లారు. ఈ ఉదయం గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో లండన్ వెళ్లారు.  పూర్తి వివరాలకు క్లిక్ చేయండి


స్థలం కబ్జా చేస్తున్నారని ఆరోపణ - మాజీ మంత్రి మల్లారెడ్డి, ఇతరులకు భూ వివాదం
మేడ్చల్ (Medchal) జిల్లా జీడిమెట్ల పరిధిలోని పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉద్రిక్తత నెలకొంది. సుచిత్ర పరిధిలోని సర్వే నెంబర్ 82లో నెలకొన్న భూ వివాదంలో మాజీ మంత్రి మల్లారెడ్డికి, ఇతరులకు మధ్య వాగ్వాదం జరిగింది. 1.15 ఎకరాల భూమి తాము కొన్నామని అది తమదేనని ఓ వర్గానికి చెందిన 15 మంది చెబుతుండగా.. తమ భూమిని కబ్జా చేస్తున్నారంటూ మల్లారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. భూమి చుట్టూ అక్రమంగా ఫెన్సింగ్ వేశారని.. దాన్ని తొలగించాలని తన అనుచరులను ఆదేశించారు.  పూర్తి వివరాలకు క్లిక్ చేయండి