Delhi Air Pollution: దిల్లీ సర్కార్‌కు సుప్రీం డెడ్‌లైన్.. రేపటి నుంచి పాఠశాలలు బంద్

ABP Desam Updated at: 02 Dec 2021 01:51 PM (IST)
Edited By: Murali Krishna

దిల్లీ వాయు కాలుష్యంపై చర్యలు చేపట్టడం లేదని ప్రభుత్వంపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. 24 గంటల డెడ్‌లైన్ విధించింది.

దిల్లీ సర్కార్‌కు సుప్రీం డెడ్‌లైన్

NEXT PREV

దేశ రాజధాని దిల్లీలో వాయు కాలుష్యంపై సుప్రీం కోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు 'సీరియస్ ప్లాన్‌'తో రావాలని దిల్లీ సర్కార్, కేంద్ర ప్రభుత్వానికి 24 గంటల డెడ్‌లైన్ విధించింది.








వాయు కాలుష్యం రోజురోజుకు పెరుగుతోంది.. తగ్గించడానికి మీరు చర్యలు చేపట్టినట్లు మాకు అయితే కనిపించడం లేదు. పారిశ్రామిక, వాహనాల కాలుష్యంపై దృష్టి పెట్టాలి. మేం చెబితే మీరు పనిచేస్తారా? మీరు చర్యలు తీసుకోవాలి కదా? పాఠశాలలు ఎందుకు తెరిచారు?                                   -  సుప్రీం కోర్టు


వాయు కాలుష్యం కట్టడి కోసం వివిధ చర్యలు చేపట్టామని చెబుతూ దిల్లీ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది మను సింఘ్వీ అఫిడవిట్ దాఖలు చేశారు. దీనిపై కూడా ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది.



ఇది కాలుష్యానికి మరో కారణం, రోజూ ఎన్నో అఫిడవిట్లు సమర్పిస్తున్నారు. రోడ్డు బ్యానర్లు పట్టుకుని ఎంత మంది నిల్చుంటున్నారో అఫిడవిట్​లో పేర్కొన్నారా?                                   -  సుప్రీం కోర్టు


కాలుష్యాన్ని తగ్గించేందుకు ప్రభుత్వాలు చర్యలు చేపట్టకపోతే తామే ఆదేశాలిస్తామని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. విచారణను శుక్రవారం ఉదయం 10 గంటలకు వాయిదా వేసింది.


రియాక్షన్..






సుప్రీం ఆగ్రహం వ్యక్తం చేయడంతో దిల్లీ సర్కార్ తక్షణ చర్యలు చేపట్టింది. తదుపరి ఆదేశాలు ఇచ్చేవరకు రేపటి నుంచి దిల్లీలో పాఠశాలలు నిరవధికంగా మూసినవేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. 


Also Read: Corona Cases: దేశంలో కొత్తగా 9,765 కరోనా కేసులు నమోదు, 477 మంది మృతి


Also Read: ఈ మొక్క ఆకులు పంచదార కన్నా వందరెట్లు తీపి... చక్కెర బదులు దీన్ని వాడితే బెటర్


Also Read:  ఈ ఆరు లక్షణాలు ఉన్న వ్యక్తిని పెళ్లి చేసుకోకండి... జీవితం నరకమైపోతుంది


Also Read: టమోటో సూప్‌ను ఇలా చేసుకుని తాగండి... క్యాన్సర్‌ను కూడా అడ్డుకుంటుంది


Also Read: ఎయిడ్స్ లక్షణాలు ఏంటి? ఆ రోగులు ఏం తినాలి? ఏం తినకూడదు?


Also Read: ఓమ్రికాన్ వేరియంట్ వేళ...ఈ బ్లడ్ గ్రూపుల వాళ్లకే హై రిస్క్, చెబుతున్న ఇండియన్ అధ్యయనం


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at: 02 Dec 2021 01:49 PM (IST)

- - - - - - - - - Advertisement - - - - - - - - -

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.