Rahul Gandhi on Gandhi Jayanti: మహాత్ముడి జయంతి సందర్భంగా రాహుల్ గాంధీ శపథం!

ABP Desam Updated at: 02 Oct 2022 01:39 PM (IST)
Edited By: Murali Krishna

Rahul Gandhi on Gandhi Jayanti: భారత్‌ జోడో యాత్రలో ఉన్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ.. మహ్మాతుడికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఓ ప్రతిజ్ఞ చేశారు.

(Image Source: PTI)

NEXT PREV

Rahul Gandhi on Gandhi Jayanti: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ.. మహాత్మా గాంధీకి నివాళులర్పించారు. భారత్ జోడో యాత్రలో ఉన్న రాహుల్ గాంధీ.. కర్ణాటక బందనవోలులోని ఖాదీ గ్రామోద్యోగ్ వద్ద మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాహుల్ ఓ ప్రతిజ్ఞ చేశారు.


ఏకం చేస్తాం! 


మహాత్ముడు అన్యాయానికి వ్యతిరేకంగా దేశాన్ని ఏకతాటిపైకి తీసుకొచ్చారని, అదేవిధంగా తాము కూడా దేశాన్ని ఏకం చేస్తామని రాహుల్ గాాంధీ ప్రతిజ్ఞ చేశారు. భారత్ జోడో యాత్రతో ఇది సాధ్యమవుతుందని రాహుల్ అన్నారు. 







సత్యం, అహింస మార్గంలో నడవడాన్ని మనకు బాపూజీ నేర్పించారు. ప్రేమ, కరుణ, సద్భావం, మానవత్వం అర్థాలను వివరించారు. గాంధీ జయంతి సందర్భంగా ఓ ప్రతిజ్ఞ చేస్తున్నాం. బాపూజీ ఏ విధంగా అయితే అన్యాయానికి వ్యతిరేకంగా దేశాన్ని ఏకతాటిపైకి తీసుకొచ్చారో, అదే విధంగా ఇప్పుడు మేం భారత దేశాన్ని ఏకం చేస్తాం.                                                              - రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అగ్రనేత
 


కాంగ్రెస్ నేతలు


కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, ఆ పార్టీ నేత మల్లికార్జున ఖర్గేతో కలిసి రాజ్‌ఘాట్‌లో మహాత్మా గాంధీకి నివాళులర్పించారు. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ కూడా మహాత్ముడికి నివాళులర్పించారు.



ఆయన దార్శనికత, ఆయన సిద్ధాంతాలు, ఆయన ఆదర్శాలు భారత దేశానికి పునాదులు వేశాయి. గాంధీ జయంతిని జరుపుకుంటున్న సందర్భంగా శాంతి, అహింసల కోసం అంకితమవుతామని ప్రతిజ్ఞ చేద్దాం.                                                                - కాంగ్రెస్


Also Read: Gandhi Jayanti 2022: మహాత్మా గాంధీ, శాస్త్రిలకు రాష్ట్రపతి, ప్రధాని సహా ప్రముఖుల నివాళులు


Also Read: Gandhi Jayanti 2022: మృత్యువు వచ్చినా వెనక్కి తగ్గేదేలే! ఆయన జగత్ ప్రేమికుడు!

Published at: 02 Oct 2022 01:28 PM (IST)

- - - - - - - - - Advertisement - - - - - - - - -

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.