Rahul Gandhi In Lok Sabha: 'ఆ రైతు కుటుంబాలకు పరిహారమే కాదు ఉద్యోగాలు కూడా ఇవ్వాలి'

Advertisement
ABP Desam   |  Edited By: Murali Krishna Updated at: 07 Dec 2021 05:18 PM (IST)

సాగు చట్టాల ఉద్యమంలో చనిపోయిన రైతులకు పరిహారం చెల్లించాల్సిందేనని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు.

'ఆ రైతు కుటుంబాలకు పరిహారమే కాదు ఉద్యోగాలు కూడా ఇవ్వాలి'

NEXT PREV

సాగు చట్టాలపై రైతులు చేసిన ఆందోళనల్లో మరణించిన అన్నదాతలకు పరిహారం చెల్లించాలని పార్లమెంటులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. ప్రధాని మోదీ తాను తప్పు చేసినట్లు ఒప్పుకున్నారని కనుక పరిహారం చెల్లించాలన్నారు. లోక్​సభ జీరో అవర్​లో రైతు మరణాల అంశాన్ని ప్రస్తావించారు రాహుల్​.

Continues below advertisement



సాగు చట్టాల నిరసనల్లో 700 మంది రైతులు ప్రాణాలు కోల్పోయారు. దేశానికి, రైతులకు ప్రధాని స్వయంగా క్షమాపణలు చెప్పారు. తప్పుచేశానని ఆయనే అంగీకరించారు. కానీ రైతుల మరణాలపై తమ వద్ద డేటా లేదని ప్రభుత్వం చెబుతోంది. మృతి చెందిన 400 మంది రైతులకు పంజాబ్​ ప్రభుత్వం రూ.5 లక్షలు చొప్పున పరిహారం ఇచ్చింది. 152 మందికి ఉద్యోగాలు ఇచ్చింది. నా దగ్గర జాబితా ఉంది. ప్రభుత్వం మాత్రం డేటా లేదు అంటోంది.                                    -  రాహుల్​ గాంధీ, కాంగ్రెస్​ సీనియర్​ నేత


దీనిపై ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేస్తూ లోక్‌సభ నుంచి కాంగ్రెస్, ఎన్‌సీపీ, డీఎంకే నేతలు వాకౌట్ చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.


డేటా లేదు..


సాగు చట్టాల నిరసనలో చనిపోయిన రైతులకు ప్రభుత్వం పరిహారం చెల్లిస్తుందా అని పార్లమెంటులో సభ్యులు ఇటీవల అడిగిన ప్రశ్నకు సమాధానంగా వ్యవసాయశాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ఈ మేరకు స్పందించారు.



ఈ రైతు ఉద్యమంలో అన్నదాతలు చనిపోయినట్లు వ్యవసాయ మంత్రిత్వశాఖ వద్ద ఎలాంటి సమాచారం లేదు. కనుక పరిహారం అనే ప్రశ్నే లేదు.                                                         "
-నరేంద్ర సింగ్ తోమర్, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి



ఏడాది ఉద్యమం..


నూతన సాగు చట్టాలను రద్దు చేయాలని గత ఏడాది నవంబర్ 26 నుంచి రైతులు ఉద్యమం చేస్తున్నారు. ఎట్టకేలకు ఏడాది గడుస్తోన్న సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ.. ఈ సాగు చట్టాలను రద్దు చేస్తామని ప్రకటించారు. అయితే కనీస మద్దతు ధర (ఎమ్‌ఎస్‌పీ)పై చట్టం తీసుకురావాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. దీంతో పాటు ఉద్యమంలో చనిపోయిన రైతుల కుటుంబాలకు పరిహారం ప్రకటించాలని ప్రభుత్వాన్ని కోరారు.


Also Read: UAE New Weekend Days: వీకెండ్ ఆహా.. ఆ ఊహ ఎంత బాగుందో! ఇక వారంలో 2.5 రోజులు సెలవు!


Also Read: PM Modi on Parliament Attendance: ఎంపీలకు మోదీ వార్నింగ్.. 'మీరేం చిన్నపిల్లలు కాదు.. మారతారా లేక మార్చేయాలా'


Also Read: Muzaffarnagar: పాఠశాలలో పాడు పని.. ప్రాక్టికల్ ఎగ్జామ్ పేరుతో డ్రగ్స్ ఇచ్చి బాలికలపై లైంగిక దాడి!


Also Read: Asia Power Index: రష్యాను దాటిన భారత్.. అత్యంత శక్తిమంతమైన దేశాల జాబితాలో @4వ ర్యాంకు


Also Read: Corona Cases: తగ్గిన కరోనా విజృంభణ.. 554 రోజుల కనిష్ఠానికి యాక్టివ్ కేసులు


Also Read: క్యాన్సర్‌ను అడ్డుకునే ఆహార పదార్థాలివే... వారంలో ఓసారైనా తినండి


Also Read: నిద్ర సరిగా పట్టడం లేదా... ఈ విటమిన్ల లోపం ఉందేమో చెక్ చేసుకోండి


Also Read: అబార్షన్ చేయించుకున్నాక ఎలా ఉంటుందో తెలుసా? ఈ బాధలన్నీ భరించాల్సిందే


Also Read: ఒక సరస్వతి మొక్కను పెంచుకోండి, ఆ ఆకుల రసంతో ఎన్నో ఆరోగ్యసమస్యలు తొలగిపోతాయి


Also Read: ఈ కూరల్లో కొలెస్ట్రాల్ తక్కువ, బరువు తగ్గాలనుకునే వాళ్లకి ప్రత్యేకం


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at: 07 Dec 2021 05:15 PM (IST)
Continues below advertisement
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.