డిసెంబర్ 4న జరిగిన నాగాలాండ్ కాల్పుల ఘటనపై దర్యాప్తు చేస్తోన్న బృందానికి ఆర్మీ మొదటి రోజు నుంచి సహకరిస్తోంది. దర్యాప్తునకు సంబంధించి వారికి ఎలాంటి మద్దతు కావాల్సిన ఇచ్చేందుకు మేం సిద్ధంగా ఉన్నాం. అంతేకాకుండా ఆ ఘటనకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు ఎవరిదగ్గరైనా ఉన్నా దర్యాప్తు బృందానికి సమర్పించాలని ప్రజలను కూడా కోరాం. ఆ రోజు జరిగిన ఘటనపై ఆర్మీ తీవ్ర సంతాపం వ్యక్తం చేసింది. అలా జరిగి ఉండాల్సింది కాదు.                                            - భారత ఆర్మీ