Kisan Naya rally: మోదీజీ.. ఆ రైతు కుటుంబాల కన్నీళ్లు తుడవడానికి ఖాళీ లేదా?: ప్రియాంక

ABP Desam Updated at: 06 Jan 2022 08:42 PM (IST)
Edited By: Murali Krishna

లఖింపుర్ ఖేరీ ఘటనపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ విమర్శనాస్త్రాలు సంధించారు. ఉత్తర్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు.

లఖింపుర్ ఖేరీ ఘటనపై ప్రియాంక విమర్శలు

NEXT PREV

2022 ఉత్తర్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ ప్రచారశంఖారావం పూరించింది. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ బహిరంగ సభలో భాజపాపై తీవ్ర విమర్శలు గుప్పించారు. లఖింపుర్ ఘటనపై ప్రశ్నల వర్షం కురిపించారు. కాశీ విశ్వనాథుని క్షేత్రం, దుర్గా ఆలయంలో ఈ సభకు ముందు పూజలు చేశారు. 


ముందుగా ఈ ర్యాలీకి 'ప్రతిజ్ఞ' అని పేరుపెట్టినప్పటికీ అనంతరం 'కిసాన్ న్యాయ ర్యాలీ'గా మార్చారు. దుర్గా మాత శ్లోకంతో తన ప్రసంగాన్ని ఆరంభించారు ప్రియాంక. భాజపా పాలనలో న్యాయం జరుగుతుందని ప్రజలు అనుకోవడం లేదన్నారు. 







ఇక్కడ న్యాయం అడిగిన వాళ్లని అణిచివేయాలని చూస్తారు. హథ్రాస్, ఉన్నావ్, లఖింపుర్ ఖేరీ.. ఇలా ఘటన ఏదైనా న్యాయం అడిగితే ఇదే పరిస్థితి. న్యాయం చేయడంలో భాజపా పూర్తిగా విఫలమైంది. ప్రధాని మోదీ స్వాతంత్య్ర దినోత్వాన్ని జరుపుతున్నారు. కానీ ఆ స్వాతంత్య్రం ఇచ్చింది ఎవరు? రైతులు ఈ స్వాతంత్య్రం ఇచ్చారు. కానీ ఆ రైతులను వారు కలవాలనుకోవడం లేదు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కుమారుడు ఆరుగురు రైతులను తన వాహనంతో తొక్కించేశాడు. మాకు న్యాయం కావాలి పరిహారం కాదని వారి కుటుంబాలు అడుగుతున్నాయి. కానీ ఈ ప్రభుత్వంలో న్యాయం చేసే నాథుడే లేడు. -                                  ప్రియాంక గాంధీ, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి



లఖింపుర్ ఘటనకు కారకుడైన ఆ వ్యక్తి తండ్రిని (కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి) పక్కన కూర్చొబెట్టుకున్నారు ముఖ్యంత్రి యోగి ఆదిత్యనాథ్. ప్రధాని మోదీ.. లఖ్‌నవూ వస్తారు.. కానీ 2 గంటలు ప్రయాణం చేసి లఖింపుర్ రారు. వాళ్ల కన్నీళ్లు మాత్రం తుడవరు?                                      - ప్రియాంక గాంధీ, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి


రాష్ట్రపతి అపాయింట్‌మెంట్..


లఖింపుర్ ఖేరి ఘటనపై రాష్ట్రపతి రామ్​నాథ్ కోవింద్‌కు 'మెమొరాండం ఆఫ్ ఫ్యాక్ట్స్' పేరిట ఓ వినతిపత్రం సమర్పించనుంది కాంగ్రెస్. ఈ మేరకు రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీలతో కూడిన ఏడుగురు సభ్యుల బృందానికి అపాయింట్‌మెంట్ ఇవ్వాల్సిందిగా అక్టోబర్ 9న రాష్ట్రపతికి ఓ లేఖ రాసింది. ఈ బృందంలో రాహుల్, ప్రియాంక, ఏకే ఆంటోనీ, మల్లికార్జున్ ఖర్గే, గులాం నబీ ఆజాద్, అధిర్ రంజన్ చౌదరి, పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్​ ఉన్నట్లు తెలుస్తోంది.


Chocolates in AC Coaches: తొలిసారి ఏసీ కోచ్‌లలో చాక్లెట్లు తరలింపు.. ఎన్ని టన్నులో తెలుసా?


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at: 10 Oct 2021 05:14 PM (IST)

- - - - - - - - - Advertisement - - - - - - - - -

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.