Allahabad High Court:


అలహాబాద్ హైకోర్టు వ్యాఖ్యలు..


అలహాబాద్‌ హైకోర్టు ( Allahabad High Court) సోషల్ మీడియా పోస్ట్‌లపై కీలక వ్యాఖ్యలు చేసింది. సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్ట్‌లను లైక్‌ చేయడం నేరం కాదని, కానీ వాటిని షేర్ చేయడం లేదా రీ పోస్ట్ చేయడం మాత్రం నేరంగానే పరిగణించాల్సి వస్తుందని తేల్చి చెప్పింది. అలాంటి పోస్ట్‌లు పెడితే Information Technology (IT) Act సెక్షన్ 67 ప్రకారం అభ్యంతరకరమైన కంటెంట్‌ని అందరికీ సర్క్యులేట్ చేసినట్టే అవుతుందని స్పష్టం చేసింది. దీన్ని కచ్చితంగా శిక్షార్హమైన నేరంగా పరిగణిస్తామని తెలిపింది. సోషల్ మీడియాలో ఓ వ్యక్తి అభ్యంతరకరమైన పోస్ట్‌కి లైక్‌ కొట్టినందుకు కోర్టులో పిటిషన్‌ దాఖలైంది. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన జస్టిస్ అరుణ్ కుమార్ సింగ్...ఆ వ్యక్తి చేసింది నేరంగా పరిగణించాలన్న వాదనను కొట్టి పారేశారు. ఆ పిటిషన్‌ని తిరస్కరించారు. 


"ఆ వ్యక్తి పోస్ట్ చేసిన కంటెంట్‌ అభ్యంతరకరంగా ఏమీ అనిపించలేదు. ఫేస్‌బుక్‌లో కానీ వాట్సాప్‌లో కానీ ఎలాంటి అసభ్యకరమైన కంటెంట్‌ కనిపించలేదు. అలాంటప్పుడు నేరంగా పరిగణించలేం. ఎలాంటి చర్యలు తీసుకోలేం. ప్రస్తుత కేసులో నిందితుడిగా భావిస్తున్న వ్యక్తి ఓ అభ్యంతకరమైన పోస్ట్‌కి లైక్ మాత్రమే కొట్టాడు. కానీ దాన్ని రీపోస్ట్ చేయలేదు. పోస్ట్‌ లైక్ చేసినంత మాత్రాన నేరంగా పరిగణించలేం. ఐటీ యాక్ట్ సెక్షన్ 67 కింద ఈ కేసుని చేర్చలేం"


- అలహాబాద్ హైకోర్టు



సప్తపది వేడుక, ఇతర ఆచారాలు లేకుండా హిందూ వివాహం చెల్లుబాటు కాదని అలహాబాద్ హైకోర్టు వ్యాఖ్యానించింది. తన నుంచి విడిపోయిన భార్య తనకు విడాకులు ఇవ్వకుండానే రెండవ వివాహం చేసుకుందని ఆరోపించిన ఒక వ్యక్తి పిటిషన్‌ను తిరష్కరిస్తూ కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. తాను రెండో పెళ్లి చేసుకున్నట్టు ఆరోపిస్తూ భర్త ఫ్యామిలీ కోర్టులో వేసిన పిటీషన్‌ను భార్య అలహాబాద్ హైకోర్టులో సవాల్ చేసింది. దీనిని విచారణకు స్వీకరించిన జస్టిస్ సంజయ్ కుమార్ సింగ్.. ‘వివాహానికి సంబంధించి సరైన వేడుకలు, సరైన ఆచారాలతో వివాహాన్ని జరుపుకోవడం అని అర్థం. సంప్రదాయాలు, ఆచారాలను పాటించి వివాహం జరుపుకోకపోతే లేదా నిర్వహించకపోతే అది పెళ్లి అని చెప్పలేం’ అని వ్యాఖ్యానించారు. వివాహానికి సంబంధించి ఖచ్చితంగా చేయాల్సిన క్రతువుల్లో సప్తపది ఒకటని అభిప్రాయపడ్డారు. సంస్కృతి, సాంప్రదాయాలు లేకుండా వివాహం జరిగితే అది శాస్త్రీయంగా జరిగిందని భావించలేమని చట్టం దృష్టిలో అది వివాహం కాదన్నారు. వివాహం చెల్లుబాటు అయ్యే వివాహం కాకపోతే, పార్టీలకు వర్తించే చట్టం ప్రకారం, చట్టం దృష్టిలో అది వివాహం కాదని అభిప్రాయపడింది. హిందూ చట్టం ప్రకారం పెళ్లిలో 'సప్తపది' క‌ృతువు పెళ్లి చెల్లుబాటు అయ్యే వాటిలో ఒకటి అని పేర్కొంది. అయితే ప్రస్తుత కేసులో పేర్కొన్న సాక్ష్యాలు లేవని కోర్టు ఇటీవలి ఉత్తర్వుల్లో పేర్కొంది. హిందూ వివాహ చట్టం, 1955లోని సెక్షన్ మేరకు.. ఇది హిందూ వివాహాన్ని వారి సంప్రదాయాలు, ఆచారాలకు అనుగుణంగా జరుపుకోవచ్చని పేర్కొంది. 


Also Read: పాలస్తీనా వ్యవహారంలో భారత్‌ కన్‌ఫ్యూజ్ అవుతోంది - శరద్ పవార్ చురకలు