పార్లమెంట్ వరకు నిర్వహించ తలపెట్టిన ట్రాక్టర్ మార్చ్ను వాయిదా వేస్తున్నట్టు రైతులు ప్రకటించారు. ఈరోజు జరిగిన సంయుక్త కిసాన్ మోర్చా (SKM) సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టడానికి 2 రోజుల ముందు రైతులు పెద్ద నిర్ణయం తీసుకున్నారు. ప్రతిపాదిత ట్రాక్టర్ మార్చ్ను పార్లమెంటు వరకు వాయిదా వేయాలని సంయుక్త కిసాన్ మోర్చా (SKM)నిర్ణయించింది.
3 వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించిన నేపథ్యంలో రైతు సంఘాలు ఈ నిర్ణయం తీసుకున్నాయి. ఈరోజు జరిగిన సంయుక్త కిసాన్ మోర్చా (SKM) సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
మరింత వ్యూహరచన చేసేందుకు డిసెంబర్ 4న సమావేశం ఏర్పాటు చేసినట్లు ఎస్కేఎం తెలిపింది. ఈ సమావేశంలో పలు ఇతర అంశాలు కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది.
సింగు సరిహద్దులో సంయుక్త కిసాన్ మోర్చా నాయకులు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మరిన్ని వ్యూహాలపై చర్చించారు. ఈ సందర్భంగా రైతులు నిర్వహించ తలపెట్టిన పార్లమెంట్ మార్చ్ను వాయిదా వేస్తున్నారని సంయుక్త కిసాన్ మోర్చా(SKM) వెల్లడించింది.
రైతులు నిరసనను విరమించాలని, ప్రజలంతా తమ తమ ఇళ్లకు వెళ్లాలని వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ఈరోజు రైతులకు విజ్ఞప్తి చేశారు. దీనిపై కూడా ఈ భేటీలో చర్చించారు. మరోవైపు వ్యవసాయ చట్టాలకు సంబంధించి మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేసే బిల్లును శీతాకాల సమావేశాల తొలిరోజే లోక్సభలో ప్రవేశపెడతామని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ రైతులకు తెలిపారు.
పంటల వైవిధ్యం, జీరో బడ్జెట్ వ్యవసాయం, ఎంఎస్పీ విధానాన్ని మరింత పారదర్శకంగా అమలు చేసేందుకు దాంతోపాటు ఇతర వ్యవసాయ సమస్యలు సమీక్షించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ఒక కమిటీని ఏర్పాటు చేస్తారని చెప్పారు తోమర్ గుర్తు చేశారు.
Also Read : మరోసారి బిహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్కు అస్వస్థత... ఢిల్లీ ఎయిమ్స్లో చికిత్స
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్స్క్రైబ్ చేయండి