Gujarat Drugs Seized: భారీ డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టు.. వీటి విలువ రూ. 600 కోట్ల పైమాటే!

ABP Desam   |  Murali Krishna   |  15 Nov 2021 01:28 PM (IST)

గుజరాత్‌లో 120 కిలోల డ్రగ్స్‌ను ఉగ్రవాద నిరోధక దళం స్వాధీనం చేసుకుంది. వీటి విలువ దాదాపు రూ. 600 కోట్లు.

భారీ డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టు

గుజరాత్​లో భారీ డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టు అయింది. భారీ ఎత్తున మత్తు పదార్థాలను ఆ రాష్ట్ర ఉగ్రవాద నిరోధక దళం (ఏటీఎస్) పట్టుకుంది. ద్వారకాలోని మోర్బిలో 120 కేజీల డ్రగ్స్​ను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఈ డ్రగ్స్ విలువ సుమారు రూ.600 కోట్లు ఉంటుందన్నారు.

రాష్ట్ర పోలీసులు, ఏటీఎస్‌పై గుజరాత్ హోంమంత్రి హర్ష సంఘవి ప్రశంసలు కురిపించారు. 

గుజరాత్ పోలీసులు మరో విజయం సాధించారు. డ్రగ్స్‌ను ఎలిమినేట్ చేయడానికి ముందుండి పోరాడుతున్నారు. గుజరాత్ ఏటీఎస్ 120 కేజీల మత్తుపదార్థాలను స్వాధీనం చేసుకుంది.                                                - హర్ష సంఘవి, గుజరాత్ హోంమంత్రి

నవ్​లఖి నౌకాశ్రయానికి దగ్గరలోని జిన్​జుడా గ్రామంలో మత్తుపదార్థాల ముఠా ఉందనే ముందస్తు సమాచారంతో ఆదివారం రాత్రి ఏటీఎస్​ తనిఖీలు నిర్వహించింది. ఈ సోదాల్లో 120 కేజీల మాదకద్రవ్యాలను పట్టుకున్నారు.

మత్తు పదార్థాల ముఠాకు చెందిన నలుగురు నిందితులను అరెస్టు చేశారు. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు. సెప్టెంబర్​లో ముంద్రా పోర్టు నుంచి సుమారు రూ.21 వేల కోట్ల విలువైన 3 వేల కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

Also Read: Delhi Air Pollution: లాక్‌డౌన్ బాటలో దేశ రాజధాని.. కరోనా కోసం కాదు అంతకుమించి!

Also Read: Corona Cases: క్రమంగా తగ్గుతోన్న కరోనా ఉద్ధృతి.. కొత్తగా 10,229 కేసులు

Also read: తన గేదెపైనే కంప్లయింట్ ఇచ్చిన అమాయకపు రైతు... గేదె చేసిన తప్పు అదే

Also read: మద్యం అతిగా తాగుతున్నారా... మీ చర్మం చెప్పేస్తుంది మీ తాగుడు గురించి...

Published at: 15 Nov 2021 01:28 PM (IST)
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.