సిటీని స్తంభింపజేస్తాం, గణేషులను మండపాల్లోనే వదిలేస్తాం - గణేష్ ఉత్సవ సమితి వార్నింగ్
ట్యాంక్ బండ్ పై వినాయక నిమజ్జనం లేదంటూ పోలీసులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను, బారీకేడ్లను భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి నేతలు తొలగించారు. అంతేకాక, ట్యాంక్ బండ్ రెయిలింగ్‌కు ఏర్పాటు చేసిన జాలీలను తొలగించి వినాయకుడ్ని నిమజ్జనం చేశారు. ఎవరైనా అక్కడ గణేష్ నిమజ్జనాన్ని చేసుకోవచ్చని ఉత్సవ సమితి నేతలు పిలుపు ఇచ్చారు. అనేక సంవత్సరాలుగా ట్యాంక్ బండ్ పై వినాయక నిమజ్జనం జరుగుతుందని అన్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి


కూటమి సర్కారుకు సిగ్గుచేటు, చంద్రబాబు నోరు విప్పాల్సిందే - షర్మిల డిమాండ్
ఏపీలో కొత్త వైద్య కళాశాలలను ప్రైవేట్ పరం చేసి, వైద్య విద్యను ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టాలని చూస్తున్నారా? అని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రశ్నించారు. ఇప్పటికే అందని ద్రాక్షలా మారిన వైద్య విద్యను మార్చారని.. పేద విద్యార్థులకు మరింత దూరం చేసే ప్రణాళికలు ఏమైనా ఉన్నాయా? అని నిలదీశారు. సోషల్ మీడియా వేదికగా షర్మిల స్పందించారు. గుజరాత్ పీపీపీ విధానంపై ఎందుకు అధ్యాయనం చేయాలని అనుకున్నారని షర్మిల అడిగారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి


ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ ఇంటి వద్ద భారీగా పోలీసులు - ఇంటివైపు రాకపోకలు పూర్తిగా బంద్
శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ ఇంటి వద్ద ఆదివారం పోలీసులు భారీగా మోహరించారు. దాదాపు 200 మంది పోలీసులు ఆయన ఇంటి చుట్టూ పహారా కాస్తున్నారు. బీఆర్ఎస్  కార్యకర్తలు ఆయన ఇంటికి వచ్చే అవకాశం ఉందన్న సమాచారంతో అప్రమత్తమైన పోలీసులు చర్యలు చేపట్టారు. ఎక్కడికక్కడ బారికేడ్లు ఏర్పాటు చేసిన సిబ్బంది.. గాంధీ ఇంటివైపు రాకపోకలు నిలిపేశారు. దీంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవల ఎమ్మెల్యే అరికెపూడి గాంధీని పీఏసీ ఛైర్మన్‌గా నియమించగా.. బీఆర్ఎస్ నేతలు తీవ్ర విమర్శలు చేశారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి


వరదలు నేర్పిన గుణపాఠం - పునరావృతం కాకుండా సన్నద్ధత ఎలా!, నిపుణులు ఏం చెబుతున్నారంటే?
భారీ వర్షాలు, వరదలకు అతలాకుతలమైన విజయవాడ నగరం ఇప్పుడిప్పుడే తేరుకుంటోంది. బుడమేరు, కృష్ణా నదికి వచ్చిన వరద ఉద్ధృతి లక్షలాది మంది జీవితాలపై ప్రభావం చూపింది. ఈ క్రమంలో భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పాయి. శరవేగంగా విస్తరిస్తోన్న విజయవాడ నగరం.. అటు, రాజధాని అమరావతి నగరాలకు భవిష్యత్తులో ముంపు సమస్య అనేదే లేకుండా పటిష్ట రక్షణ చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి


అతి తెలివి మంత్రిగారూ.. మీ చిట్టినాయుడు టీడీపీలోనే ఉన్నాడా? కాంగ్రెస్‌లోనా? - కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మంత్రి శ్రీధర్ బాబు చేసిన వ్యాఖ్యలపై ఎద్దేవా చేశారు. శ్రీధర్ బాబు శనివారం ఓ మీటింగ్‌లో అరెకపూడి గాంధీ, కౌశిక్ రెడ్డి గొడవపై మాట్లాడుతూ.. వారిద్దరూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అని అన్నారు. ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కొట్టుకుంటుంటే.. అందులో కాంగ్రెస్‌ పార్టీని జోక్యం చేస్తున్నారు.. ఇది న్యాయమా అని శ్రీధర్ బాబు ప్రశ్నించారు. అరెకపూడి గాంధీ బీఆర్ఎస్ లోనే ఉన్నానని చెబుతున్నారని.. అలాంటి ఇద్దరు ఎమ్మెల్యేలు కొట్టుకుంటున్నారని అన్నారు. అయితే, కొద్ది రోజుల క్రితం అరెకపూడి గాంధీ కాంగ్రెస్ లో చేరిన సంగతి తెలిసిందే. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి