జమ్ముకశ్మీర్ రాజౌరీ జిల్లాలో ఎన్‌కౌంటర్ జరిగింది. భద్రతా దళాలు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో  ఓ జూనియర్ కమిషన్‌డ్ ఆఫీసర్ (జేసీఓ) సహా నలుగురు సైనికులు ప్రాణాలు కోల్పోయారు. పిర్ పంజల్ రేంజ్ వద్ద జరిపిన కౌంటర్‌ టెర్రరిస్ట్ ఆపరేషన్‌లో ఈ ఘటన జరిగింది.






ఏం జరిగింది?


జమ్ముకశ్మీర్ పూంఛ్ ప్రాంతంలో ముగ్గురు ముష్కరులు ఉన్నారనే సమాచారం భారత్ ఆర్మీకి వచ్చింది. వారిని పట్టుకునేందుకు భారత సైన్యం గాలింపు చేపట్టారు. బలగాలను చూసిన ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఆ కాల్పుల్లో మొత్తం ఐదుగురు జవాన్లు వీరమరణం పొందారు.


ఇద్దరు ఉగ్రవాదులు హతం..


మరవైపు అనంత్​నాగ్ జిల్లా ఖాగుండ్​లో జరిగిన ఎన్​కౌంటర్​లో ఓ గుర్తుతెలియని ఉగ్రవాదిని భద్రతా బలగాలు ఉదయం మట్టుబెట్టాయి. ఈ ఘటనలో పలువురు పోలీసు సిబ్బందికి గాయాలయ్యాయి. ఈ మేరకు కశ్మీర్ జోన్ పోలీసులు ట్విట్టర్​లో తెలిపారు. బందిపొరా హాజిన్​లో సోమవారం తెల్లవారు జామున జరిగిన ఎన్​కౌంటర్​లో మరో ఉగ్రవాది హతమయ్యాడు. 


కాల్పుల కలకలం..


జమ్ముకశ్మీర్​లో పౌరులపై ఇటీవల ఉగ్రవాదుల కాల్పులు ఎక్కువయ్యాయి. జమ్ముకశ్మీర్ శ్రీనగర్​లోని ప్రభుత్వ పాఠశాలలో ఇటీవల కాల్పులు కలకలం సృష్టించాయి. ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు ఉపాధ్యాయులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్లో ఓ మహిళ ఉన్నారు. ఈ ఘటనతో జమ్ముకశ్మీర్‌లో ప్రజలు ఉలిక్కిపడ్డారు. 


దీంతో పోలీసులు ఉగ్ర ఏరివేత చర్యలు చేపట్టారు. బందిపొరాలో లష్కర్ ఏ తోయిబా(ఎల్​ఈటీ) ఉగ్ర స్థావరాన్ని పోలీసులు ఛేదించారు. నైద్​ఖాయ్​కు చెందిన మహమ్మద్ షఫీ లోనే అలియాస్​ సోను అనే వ్యక్తి హత్య కుట్రలో భాగమైన నలుగురు ఉగ్ర అనుచరులను అరెస్టు చేశారు.


Also Read: Corona Update: మరోసారి 20 వేలకు దిగువనే.. కొత్తగా 18,132 కరోనా కేసులు నమోదు


Also Read: కలెక్టర్ ఇంట్లో దొంగతనం.. లేఖ వదిలి వెళ్లిన దొంగలు, రాసింది చూసి విస్తుపోయిన అధికారి


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి