Center has directed the civil service officers to join the cadre of the allotted states : రాష్ట్ర విబజన తర్వాత తెలంగాణ, ఏపీల మధ్య క్యాడర్ కేటాయింపులపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ న్యాయపోరాటం చేసిన ఐఏఎస్,ఐపీఎస్ అధికారులకు చివరికి నిరాశే ఎదురయింది. అభ్యంతరాలన్నింటినీ పక్కన పెట్టిన కేద్ర తక్షణం కేటాయించిన రాష్ట్రాల్లో రిపోర్టు చేయాలని ఆదేశించింది. తెలంగాణ నుంచి మొత్తం ఐదుగురు ఐఏఎస్‌లు, ముగ్గురు ఐపీఎస్‌లు.. ఏపీ నుంచి ఐదుగురు ఐఏఎస్‌లు ఇలా రిలీవ్ అవనున్నారు. 


ఏపీకీ మాజీ డీజీపీ అంజనీకుమార్ 


విభజనలో భాగంగా ఏపీకి కేటాయించినా తెలంగాణలోనే పని చేస్తున్న ఐపీఎస్ అధికారులు అంజనీకుమార్, అభిలాష్ బిస్త్, అభిషేక్ మహంతిలను రిలీవ్ చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. వారిని ఏపీ క్యాడర్ లో చేరాలని స్పష్టం చేసింది. వీరిలో అంజనీకుమార్ బీఆర్ఎస్ హయాంలో తెలంగాణ డీజీపీగా పని  చేశారు. అభిషేక్ మహంతి 2019 ఎన్నికల సమయంలో కడప జిల్లా ఎస్పీగా పని చేశారు. తర్వాత తెలంగాణకు వెళ్లారు.                             


ఐఏఎస్ అమ్రపాలి కాటకు భారీ షాక్ - ఏపీ క్యాడర్‌కు వెళ్లాలని కేంద్రం ఆదేశాలు !


అమ్రపాలి సహా ఐదుగురు ఐఏఎస్‌లు


ఐపీఎస్‌లతో పాటు ఐదుగురు ఐఏఎస్‌లను కూడా ఏపీ క్యాడర్ కు వెళ్లాలని కేంద్రం స్పష్టం చేశారు.  రోనాల్డ్ రాస్ , ప్రశాంతి , వాకాటి కరుణ ,  వాణి ప్రసాద్  ఈ జాబితాలో ఉన్నారు. 


ఏపీ నుంచి తెలంగాణకు ఐదుగురు ఐఎస్‌లు 


ఏపీ నుంచి  ఐదుగురు ఐఏఎస్లను కేంద్రం  రిలీవ్ చేసింది.  ఎస్ ఎస్ రావత్, అనంత్రామ్, సృజన, శివశంకర్, హరికిరణ్ ను రిలీవ్ చేసింది. ఈ ఐదుగురు  ఈ నెల16లోగా తెలంగాణలో రిపోర్టు చేయాల్సి ఉంది.                                                                  


ఇద్దరు గుంటూరు బీజేపీ నేతల నీలి పనులు - రేపోమాపో పార్టీ నుంచి సస్పెండ్ ?


కేటాయించిన రాష్ట్రాలను వద్దనుకున్న అధికారులు


రాష్ట్ర విభజన జరిగినప్పుడు సివిల్ సర్వీస్ అధికారుల్ని విభజించడానికి ఖండేకర్ కమిటీ ని నియమించి విధి విధానాలు ఖరారు చేశారు. ఆ విధి విధానాల ప్రకారం ప్రత్యూష్ సిన్హా కమిటీ అధికారుల్ని విభజించింది. అయితే తమను ఆయా రాష్ట్రాలకు కేటాయించడంపై పలువురు క్యాట్‌తో పాటు కోర్టుల్లో న్యాయపోరాటం చేశారు. చివరికి కోర్టుల్లోనూ వారికి అనుకూల ఫలితం రాలేదు. గతంలోనే సోమేష్ కుమార్ ను ఏపీకి కేటాయిస్తే తెలంగాణలో పని చేశారు. ఆయన ఏపీకి వెళ్లాల్సిందేనని కోర్టు ఆదేశించండతో వెళ్లక తప్పలేదు. ఆయన వీఆర్ఎస్ తీసుకున్నారు. కానీ ఇప్పుడు ఆదేశాలు అందుకున్నవారంతా వారికి కేటాయించిన  రాష్ట్రాలకు వెళ్లాల్సిందే.