అసలు నువ్వేనా.. కాదో తేల్చాల్సి ఉంది. కోర్టు ఎదుట హాజరై నిరూపించుకో అని ఓ ఆలయంలో దేవుడి విగ్రహానికి ఓ కోర్టు న్యాయమూర్తి ఆదేశాలు ఇచ్చారు. ఇప్పుడీ అంశం హాట్ టాపిక్ అయింది. చివరికి హైకోర్టుకు చేరింది. ముందూ వెనుకా చూసుకోకుండా అలా ఎలా సమన్లు ఇస్తారని హైకోర్టు సీరియస్ అయింది. అసలేం జరిగిందంటే .?


Also Read: హెయిర్ స్టైలిష్ హబీబ్‌పై ఎఫ్ఐఆర్.. మహిళ తలపై ఉమ్మేసి హెయిర్ స్టైలింగ్


తమిళనాడులోని  తిరుపూరు జిల్లా శివిరిపలయంలోని పరమశివన్​ స్వామి ఆలయంలో దొంగలు పడ్డారు.  సర్వం తీసుకెళ్లారు. చివరికి విగ్రహాన్ని కూడా దోచుకెళ్లారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టి దొంగల్ని పట్టుకుని విగ్రహాన్ని రికవరీ చేశారు.  ప్రత్యేక కోర్టుకు అనుమతితో విగ్రహాన్ని ఆలయ యాజమాన్యానికి అప్పగించారు. అయితే ఆ విగ్రహం వర్జినలా.. లేక నకిలీలా అనే డౌట్ అధికారులకు వచ్చింది. వెంటనే ఈ విగ్రహాన్ని పరీక్షించేందుకు కోర్టులో హాజరుపరచాలని అధికారి ఆదేశాలు జారీ చేశారు. అధికారి ఆదేశాలను సమర్థిస్తూ కుంభకోణం కోర్టు సమన్లు జారీ చేసింది.


Also Read: DigiLocker: యూనివర్సిటీలకు UGC కీలక ఆదేశాలు.. ఇక ఆ సర్టిఫికెట్లకు చెల్లుబాటు


కుంభకోణం కోర్టు సమన్లను సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దిగువ న్యాయస్థానం చర్యపై ఆగ్రహం వ్యక్తం చేసిన మద్రాస్​ హైకోర్టు కుంభకోణం కోర్టు ఇచ్చిన ఆదేశాలను రద్దు చేసింది. విచారణకు విగ్రహాన్ని కోర్టులో ప్రవేశపెట్టాల్సిన అవసరం లేదని 0లయానికి వెళ్లి విగ్రహాన్ని పరీక్షించవచ్చని తెలిపింది.  భక్తుల మనోభావాలను దృష్టిలో పెట్టుకోవాలని న్యాయస్థానం సూచించింది. 


Also Read: రేపటి నుంచి బూస్టర్ డోస్ ఆన్ లైన్ అపాయింట్ మెంట్ ... జనవరి 10 నుంచి వ్యాక్సినేషన్... కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటన


ఇక్కడ విశేషం ఏమిటంటే దిగువ కోర్టు నేరుగా గర్భగుడిలోని విగ్రహానికే సమన్లు జారీ చేయడం. సబంధిత అధికారి ఆ విగ్రహాన్ని తీసుకొచ్చి కోర్టులో ప్రవేశ పెట్టాలని చెప్పడం  వివాదాస్పదమయింది. చివరికి హైకోర్టు ఈ వివాదానికి తెర దించింది. 



Also Read: Covid Updates: తెలంగాణలో పెరుగుతున్న కరోనా ఉద్ధృతి... ఒక్క రోజులో 2 వేలకు పైగా కేసులు, ముగ్గురు మృతి


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి