తెలంగాణలో కరోనా మళ్లీ విజృంభిస్తోంది. గత మూడు రోజులుగా భారీగా కేసులు వస్తున్నాయి. తాజాగా కోవిడ్ కేసులు 2 వేల మార్కును దాటాయి. గడిచిన 24 గంటల్లో 64,474 కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు. వీటిల్లో కొత్తగా 2,295 పాజిటివ్‌ కేసులు వచ్చాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 6,89,751కి చేరింది. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ తాజా బులిటెన్‌ లో ఈ గణాంకాలు వెల్లడించింది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కరోనాతో ముగ్గురు మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 4,039కి చేరింది. కరోనా నుంచి మరో 278 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 9,861 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని  వైద్య, ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఒక్కరోజు వ్యవధిలో నమోదైన మొత్తం కేసుల్లో 1,452 కేసులు జీహెచ్‌ఎంసీ పరిధిలోనే నమోదు అయ్యాయి. 


Also Read: దేశంలో కరోనా డేంజర్ బెల్స్.. ఒక్కరోజులో అక్షరాల లక్ష కేసులు


ఏపీలో కరోనా కేసులు


ఏపీలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. రాష్ట్రంలో గడచిన 24 గంటల వ్యవధిలో 37,849 కోవిడ్ నిర్థారణ పరీక్షలు నిర్వహించారు. వీటిల్లో 840 మందికి కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. గడచిన 24 గంటల్లో కోవిడ్ తో ఒకరు మృతి చెందారు. రాష్ట్రంలో కోవిడ్‌ బారినపడి చనిపోయిన వారి సంఖ్య 14,501కి చేరింది. ఒక్కరోజు వ్యవధిలో రాష్ట్రంలో 133 మంది కోలుకున్నారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు 20,62,290 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. ఏపీలో 2972 యాక్టివ్‌ కేసులున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.


Also Read: వ్యాక్సినేషన్‌లో భారత్ మరో రికార్డ్.. 150 కోట్లు దాటిన డోసుల పంపిణీ


దేశంలో లక్షకు పైగా కరోనా కేసులు


దేశంలో కరోనా విలయతాండవం చేస్తోంది. రోజురోజుకు కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఒక్కరోజులో కొత్తగా లక్షకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. కొత్తగా 1,17,100 కేసులు నమోదైనట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది. 302 మంది కరోనా వల్ల ప్రాణాలు కోల్పోయారు. 30,836 మంది కరోనా నుంచి కోలుకున్నారు. 


Also Read: ఇటలీ నుంచి వచ్చిన మరో 173 మందికి కరోనా.. 15 మంది జంప్!


Also Read: మార్చిలో పదో తరగతి పరీక్షలు... 7 సబ్జెక్టులతో పరీక్షల నిర్వహణ... విద్యాశాఖ మంత్రి సురేశ్ ప్రకటన


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి