Vaccination Milestone: వ్యాక్సినేషన్‌లో భారత్ మరో రికార్డ్.. 150 కోట్లు దాటిన డోసుల పంపిణీ

ABP Desam   |  Murali Krishna   |  08 Jan 2022 09:37 AM (IST)

దేశంలో 150 కోట్లకు పైగా కరోనా వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేసినట్లు ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు.

వ్యాక్సినేషన్‌లో భారత్ మరో రికార్డ్.. 150 కోట్లు దాటిన డోసుల పంపిణీ

కరోనా వ్యాక్సినేషన్‌లో భారత్‌ మరో కీలక మైలురాయిని చేరింది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 150 కోట్లకు పైగా వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేసినట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. కోల్​కతాలోని చిత్తరంజన్ నేషనల్ కేన్సర్​ ఇన్స్​స్టిట్యూట్​ రెండో క్యాపస్​ను వర్చువల్​ విధానంలో మోదీ ప్రారంభించారు. ఈ సందర్బంగా వ్యాక్సినేషన్‌పై మాట్లాడారు.

నేడు భారత్ మరో మైలురాయిని అందుకుంది. దేశంలో 150 కోట్లకు పైగా కరోనా వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేశాం. అర్హులైన వారిలో 90 శాతానికి పైగా ప్రజలు తొలి డోసు వ్యాక్సిన్ అందుకున్నారు. 15-18 ఏళ్ల వయసు వారికి కూడా టీకా పంపిణీ వేగంగా సాగుతోంది. తొలి 5 రోజుల్లోనే 1.5 కోట్లకు పైగా పిల్లలు తొలి డోసు తీసుకున్నారు. త్వరలోనే దేశ ప్రజలందరికీ టీకా అందిస్తాం. ఆత్మ నిర్భర్ భారత్‌కు ఇది నిదర్శనం.                              - ప్రధాని నరేంద్ర మోదీ

దేశంలో అండర్ గ్రాడ్యుయేట్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ కోసం ఉన్న 90 వేల మెడికల్ సీట్లకు అదనంగా మరో 60 వేల సీట్లను 2014 నుంచి పెంచినట్లు ప్రధాని మోదీ అన్నారు.

పెరుగుతోన్న కేసులు..

ఒక్కరోజులో కొత్తగా లక్షకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. కొత్తగా 1,17,100 కేసులు నమోదైనట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది. 302 మంది కరోనా వల్ల ప్రాణాలు కోల్పోయారు. 30,836 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దేశంలో ఒమిక్రాన్ కేసులు కూడా పెరుగుతున్నాయి. మొత్తం కేసుల సంఖ్య 3007కు చేరింది. 

Also Read: DigiLocker: యూనివర్సిటీలకు UGC కీలక ఆదేశాలు.. ఇక ఆ సర్టిఫికెట్లకు చెల్లుబాటు

Also Read: Covid Cases Today: దేశంలో కరోనా డేంజర్ బెల్స్.. ఒక్కరోజులో అక్షరాల లక్ష కేసులు

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at: 07 Jan 2022 05:40 PM (IST)
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.