= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై తీర్పు రిజర్వ్ చేసిన హైకోర్టు చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై వాదనలు ముగిశాయి. ఇరుపక్షాల వాదనలు విన్నాక హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. రెండు రోజుల్లో తీర్పు వెల్లడించనున్న హైకోర్టు. చంద్రబాబు రిమాండ్ స్కాష్ పిటిషన్ పై తీర్పు ఈ నెల 21 కి వాయిదా.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
రాజ్యసభ రేపటికి వాయిదా రాజ్యసభ వాయిదా పడింది. రాజ్యసభ బుధవారం ఉదయం 11 గంటలకు వాయిదా వేశారు. మహిళా రిజర్వేషన్ బిల్లును 2010లోనే రాజ్యసభ ఆమోదించిందని, ఈ బిల్లులో తమకు క్రెడిట్ దక్కుతుందన్నారు మల్లికార్జున ఖర్గే.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
పార్లమెంటులో మహిళా రిజర్వేషన్ బిల్లు కేంద్ర మంత్రి అర్జున్ మేఘ్వాల్ మహిళా రిజర్వేషన్ బిల్లును లోక్ సభలో ప్రవేశపెట్టారు. ప్రధాని మోదీ ఈ బిల్లుకు నారీ శక్తి చట్టం అని నామకరణం చేశారు. అదే సమయంలో లోక్ సభలో కాంగ్రెస్, ప్రతిపక్ష నేతలు గందరగోళం సృష్టించారు.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
'మహిళా రిజర్వేషన్ బిల్లును చాలాసార్లు ప్రవేశపెట్టారు, కానీ దేవుడు మమ్మల్ని ఎంచుకున్నాడు'
కొత్త పార్లమెంటులో తన మొదటి ప్రసంగంలో ప్రధాని మోడీ మాట్లాడుతూ, "మహిళలు చరిత్ర సృష్టించాల్సిన సమయం ఇది. మహిళా రిజర్వేషన్లపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది. మహిళా రిజర్వేషన్ బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ రోజు మన ప్రభుత్వం రాజ్యాంగ సవరణ బిల్లును ప్రవేశపెట్టబోతోంది. లోక్ సభ, విధానసభల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పిస్తామన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లును చాలాసార్లు ప్రవేశపెట్టారని, కానీ దేవుడు నన్ను అనేక పవిత్ర పనులకు ఎంపిక చేశాడని అన్నారు.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
మహిళలకు రిజర్వేషన్ కల్పించే భాగ్యం దేవుడు నాకు ఇచ్చాడు: మోదీ మహిళా సాధికారతపై ఉపన్యాసాలు ఇస్తే సరిపోదున్నారు ప్రధానమంత్రి మోదీ. ఎన్నో ఏళ్లుగా పెండింగ్ ఉన్న మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదించే భాగ్యం తనకు వచ్చినందుకు దేవుడికి మోదీ కృతజ్ఞత తెలిపారు.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
పండిట్ నెహ్రూ పేరును ప్రస్తావించిన ప్రధాని మోదీ
'కార్మికులకు, ఇంజనీర్లకు మనమందరి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వారు నిర్మించిన ఈ భవనం ఎంతో స్ఫూర్తినిస్తుంది. దీని కోసం 30 వేల మందికిపైగా కార్మికులు కష్టపడ్డారు. స్వేచ్ఛకు మొదటి కిరణమైన పవిత్ర సెంగోల్కు ఇక్కడ కొలువుదీరింది. భారత తొలి ప్రధాని పండిట్ నెహ్రూ చేపట్టిన సెంగోల్ ఇది. ఈ సెంగల్ మనల్ని గతంతో కలుపుతుంది."
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
కొత్త పార్లమెంట్లో ప్రధాని మోదీ తొలి ప్రసంగం కొత్త పార్లమెంట్ భవనంలో లోక్ సభ కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. కొత్త పార్లమెంటు భవనంలో తన మొదటి ప్రసంగంలో ప్రధాని మోడీ మాట్లాడుతూ, "చంద్రయాన్ -3 విజయం పట్ల భారతదేశం గర్విస్తోంది. కొత్త తీర్మానంతో కొత్త పార్లమెంట్ భవనానికి వచ్చాం. చేదును మరచి ముందుకు సాగాలి. ఈ భవనం కొత్తగా ఉంది. ఏర్పాట్లన్నీ కొత్తగా ఉన్నాయి.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
సీమ కష్టాలు తెలుసు- 253 కోట్లు ఖర్చు పెట్టి హంద్రీనీవా ప్రాజెక్టు పూర్తి చేశాం: జగన్ హంద్రీనీవా సుజల స్రవంతి ప్రాజెక్టును జాతికి అంకితం చేశారు సీఎం జగన్. ఈసందర్భంగా హంద్రీనీవా ప్రధాన కాలువ ద్వారా నీటిని విడుదల చేశారు. అనంతరం డోన్ సభలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. రాయలసీమ నీటి కష్టాలు తనకు తెలుసు అన్నారు. ఇక్కడ వర్షపు నీటితోనే పంటలు పడుతున్నాయని వేరే ఆధారం లేదన్నారు. ఈ ప్రాంత ప్రజల కష్టాలు తెలిసిన వ్యక్తిగా సాగునీటి కోసం చర్యలు చేపట్టామన్నారు. గతంలో డోన్లో ఒక్క ఎకరం కూడా ప్రత్యేక ఇరిగేషన్ ప్రాజెక్టుల ద్వారా పండే పరిస్థితి లేకుండేదన్నారు.
గత ప్రభుత్వం ఈ ప్రాంత ప్రజల కష్టాలను పట్టించుకోలేదని విమర్శించారు. ఎన్నికలకు 4 నెలల ముందు చంద్రబాబు జీవోలు, శంకుస్థాపనలతో హడావుడి చేశారే తప్ప చిత్తశుద్ధితో పని చేయలేదని ఆరోపించారు. హంద్రీనీవా సుజల స్రవంతి ప్రాజెక్టు వల్ల డోన్, పత్తికొండ నియోజకవర్గాల్లో ప్రజలకు మేలు జరుగుతుందని అభిప్రాయపడ్డారు. గత ప్రభుత్వం కనీసం భూసేకరణ కూడా చేయకుండా వదిలేసిన ఈ ప్రాజెక్టు కోసం తమ ప్రభుత్వం రూ. 253 కోట్లు ఖర్చు పెట్టి పూర్తి చేసిందని వివరించారు. నీటి విలువ, సీమ కష్టాలు తెలిసిన ప్రభుత్వంగా చిత్తశుద్ధితో ప్రాజెక్టు జాతికి అంకితం చేశామన్నారు.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
హైదరాబాద్లో నకిలీ స్టాంప్స్, సర్టిఫికెట్ల ముఠా అరెస్టు- భారీగా ఫేక్ డాక్యుమెంట్లు స్వాధీనం హైదరాబాద్ భారీ నకిలీ స్టాంప్స్, సర్టిఫికెట్ ముఠాను పోలీసులు పట్టుకున్నారు. జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, రెవెన్యూ డిపార్ట్మెంట్లకు సంబంధించిన నకిలీ రబ్బర్ స్టాంప్స్, సర్టిఫికెట్లను ఈ ముఠా తయారు చేసి విక్రయిస్తోంది. ఈ కేసులో ఇప్పటివరకు 18 నిందితులను అరెస్ట్ చేశారు.
18 మందిని అరెస్టు చేసిన పోలీసులు 1687 ఫేక్ రబ్బర్ స్టాంప్స్, 1180 నకిలీ సర్టిఫికెట్లు,సిపియు, మానిటర్, ల్యాప్టాప్ సీజ్ చేశారు. ఈ ఎక్యూప్మెంట్తో వివిధ రకాల డిపార్ట్మెంట్లకు చెందిన నకిలీ సర్టిఫికెట్లను తయారు చేస్తున్నారు.
జిహెచ్ఎంసి ఆనుమతులతోపాటు ల్యాండ్ డాక్యుమెంట్లను కూడా నకిలీవి తయారు చేస్తున్నారు. బ్యాంకు ద్వారా రుణాలు పొందడానికి ఈ నకిలీ సర్టిఫికెట్లు ఉపయోగించుకుంటున్నారు.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
ఇన్నర్ రింగ్రోడ్ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా
అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలని టీడీపీ అధినేత చంద్రబాబు పిటిషన్ వేశారు. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు ఎల్లుండికి వాయిదా వేసింది.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
ఈ సెంట్రల్ హాల్ అనేక చారిత్రాత్మక సంఘటనలకు సాక్ష్యం: ప్రధాని మోదీ ప్రసంగం పాత భవనాన్ని వదిలి కొత్త భవనంలోకి అడుగు పెట్టడం అందర్ని భావోద్వేగానికి గురిచేస్తుందన్నారు ప్రధానమంత్రి మోదీ. పాత పార్లమెంట్ భవనంలో ఫొటో సెషన్ తర్వాత మాట్లాడిన ఆయన... పాత పార్లమెంట్ భవనం మన కర్తవ్యానికి స్ఫూర్తినిస్తుందని అభిప్రాయపడ్డారు. ఇక్కడే 1947లో బ్రిటిష్ ప్రభుత్వం అధికారాన్ని అప్పగించిదని గుర్తు చేశారు. ఈ సెంట్రల్ హాల్ దీనికి సాక్ష్యంగా నిలిచిందన్నారు. ఈ సెంట్రల్ హాల్ మా భావోద్వేగాలతో నిండి ఉందని వివరించారు.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
దేశం విడిచి వెళ్లండి- కెనడా సీనియర్ దౌత్యవేత్తకు భారత్ ఆదేశం ఖలిస్థాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ ను భారత్ హతమార్చిందని ఆరోపిస్తూ భారత దౌత్యవేత్తను దేశం విడిచి వెళ్లాలని కెనడా ఆదేశించింది. అదే సమయంలో రాళ్లతో కూడిన ఘటన స్పందించిన భారత్ కొన్ని గంటల తర్వాత కెనడా సీనియర్ దౌత్యవేత్తను దేశం విడిచి వెళ్లాలని ఆదేశించింది. ఈ మేరకు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తరఫున ఒక ప్రకటన విడుదల చేసింది. దౌత్యవేత్త 5 రోజుల్లోగా భారత్ విడిచి వెళ్లాలని ఆదేశించింది
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
రాజ్ ఘాట్ వద్ద నారాలోకేష్ మౌనదీక్ష- పాల్గొన్న టీడీపీ ఎంపీలు, సీనియర్ నేతలు రాజ్ ఘాట్ ను సందర్శించి మహాత్మా గాంధీ సమాధి వద్ద నివాళులర్పించిన టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, టిడిపి ఎంపీలు, మాజీ ఎంపీలు. చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా రాజ్ ఘాట్ వద్ద నల్ల బ్యాడ్జీలు ధరించి మౌన దీక్ష చేపట్టారు.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
కర్నూలు జిల్లాలో సిపిఐ నేతల ముందస్తు అరెస్టులను ఖండించిన రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ కర్నూలు జిల్లాలో సీఎం జగన్ పర్యటన వేళ సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పి రామచంద్రయ్య, కర్నూలు నంద్యాల జిల్లాల కార్యదర్శులు బి గిడ్డయ్య, ఎన్ రంగనాయుడు తదితరులను ముందస్తుగా అరెస్టు చేశారు. దీన్ని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ ఖండించారు. ఇలా ముందస్తు అరెస్టు దుర్మార్గమన్నారు. అధికార పార్టీకి పోలీసులు వత్తాసు పలుకుతూ, అతిగా ప్రవర్తించటం మంచిదికాదని హితవు పలికారు. ప్రజాస్వామ్యంలో ఉన్నామా? లేక నిరంకుశ రాచరిక పాలనలో ఉన్నామా? అనే ప్రశ్న తలెత్తుతోందన్నారు. అరెస్టు చేసిన వారిని తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రజాతంత్ర వాదులంతా రాష్ట్ర ప్రభుత్వ, పోలీసు విపరీత చర్యలను ఖండించాలని కోరారు రామకృష్ణ.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
కర్నూలు జిల్లాలో సిపిఐ నేతల ముందస్తు అరెస్టులను ఖండించిన రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ కర్నూలు జిల్లాలో సీఎం జగన్ పర్యటన వేళ సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పి రామచంద్రయ్య, కర్నూలు నంద్యాల జిల్లాల కార్యదర్శులు బి గిడ్డయ్య, ఎన్ రంగనాయుడు తదితరులను ముందస్తుగా అరెస్టు చేశారు. దీన్ని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ ఖండించారు. ఇలా ముందస్తు అరెస్టు దుర్మార్గమన్నారు. అధికార పార్టీకి పోలీసులు వత్తాసు పలుకుతూ, అతిగా ప్రవర్తించటం మంచిదికాదని హితవు పలికారు. ప్రజాస్వామ్యంలో ఉన్నామా? లేక నిరంకుశ రాచరిక పాలనలో ఉన్నామా? అనే ప్రశ్న తలెత్తుతోందన్నారు. అరెస్టు చేసిన వారిని తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రజాతంత్ర వాదులంతా రాష్ట్ర ప్రభుత్వ, పోలీసు విపరీత చర్యలను ఖండించాలని కోరారు రామకృష్ణ.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
పార్లమెంట్ హౌస్ ఆఫ్ ఇండియా- కొత్త పార్లమెంట్ భవనానికి నామకరణం కొత్తగా నిర్మించిన పార్లమెంట్ బిల్డింగ్కి "పార్లమెంట్ హౌస్ ఆఫ్ ఇండియా"గా నామకరణం చేసింది కేంద్రం. మంగళవారం నుంచి పార్లమెంట్ కొత్త భవనంలో సమావేశాలు జరుగుతాయని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
విజయవాడలో టీడీపీ నేతల హౌస్ అరెస్ట్లు- పాదయాత్రగా దుర్గగుడికి వెళ్లకుండా నిర్బంధం చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ ఆయన క్షేమంగా విడుదల కావాలని టీడీపీ నేతలు దుర్గగుడికి వెళ్లాలనున్నారు. పాదయాత్ర ద్వారా విజయవాడ దుర్గగుడికి వెళ్లేందుకు ప్లాన్ చేసుకున్నారు. అధికారులు మాత్రం ఆ కార్యక్రమానికి అనుమతి లేదని చెబుతున్నారు. అందుకే విజయవాడలోని కీలక నేతలను ముందస్తు అరెస్టు చేశారు. బొండా ఉమాతోపాటు చాలా మంది నేతలను నిర్బంధించారు. దీనిపై తెలుగుదేశం నేతలు మండిపడుతున్నారు.