Black Nose Disease : కరోనా వేరియంట్ మాదిరి.. చికెన్ గున్యా కూడా తన లక్షణాలు మార్చుకుని వివిధ పేర్లతో ఇబ్బందులు పెడుతుంది. తాజాగా చెన్నైలో ఓ అరుదైన వ్యాధి తెరపైకి వచ్చింది. ఓ  చిన్నారి Black Nose Diseaseతో బాధపడుతోంది. దీనినే చిక్ సైన్ అని కూడా అంటారు. చికెన్  గున్యాను వ్యాపించే దోమల ద్వారా ఈ వైరస్ సంక్రమించినట్లు వైద్యులు గుర్తించారు. అయితే ఈ బ్లాక్ నోస్ డీసీస్ వల్ల కలిగే ఇబ్బందులు ఏంటో? దీని లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. 


అరుదైన కేసు


చెన్నైలోని ఓ బేబి 15 రోజుల క్రితం పుట్టింది. ముందుగా పాప ఆరోగ్యంగా లేకపోవడం, జ్వరం, చిరాకుతో ఇబ్బందిపడుతున్నట్లు గుర్తించారు పేరెంట్స్. అనంతరం ఆమె ముక్కుపై నల్లటి మచ్చలు రావడంతో పేరెంట్స్ పాపను డెర్మటాలజిస్ట్ వద్దకు తీసుకెళ్లారు. ఈ లక్షణాలను చూసి ఇది బ్లాక్ నోస్ డీసీస్ అంటూ వైద్యులు తేల్చి.. ఇది అరుదైన కేసు అని తెలిపారు. ఈ నల్లదనాన్ని హైపర్ పిగ్మెంటేషన్​గా గుర్తించారు. 


ప్రసవానికి ముందే..


పాపకు చికెన్ గున్యా ఎలా వచ్చిందని ఆరా తీస్తే తల్లికి ప్రసవానికి ముందు చికెన్ గున్యా నిర్థారణ అయిందట. తల్లి నుంచే పాపకు ఇది వచ్చినట్లు వైద్యులు రక్తపరీక్ష గుర్తించారు. ప్రస్తుతం పాప జ్వరం, కీళ్లనొప్పుల లక్షణాలతో ఇబ్బంది పడుతుందని వైద్యులు తెలిపారు. అయితే బేబి పరిస్థితి స్టెబుల్​గానే ఉందని.. ప్రమాదం ఏమి లేదంటూ వైద్యులు భరోసా ఇస్తున్నారు. ప్రాథమిక చికిత్స మాత్రం కచ్చింతగా చేయించాలంటూ సూచించారు.


కారణాలు ఇవే 


బ్లాక్ నోస్ డిసీజ్ అనేది మాక్యూలర్, స్పెక్లెడ్ పిగ్మెంటేషన్ ద్వారా కలుగుతుంది. దీనినే మెలస్మా అంటారు. ఇది ముక్కును ప్రభావితం చేసినప్పుడు ముక్కుపై నల్లని మచ్చలు ఏర్పడతాయని వైద్యులు తెలిపారు. చికెన్ గున్యా ద్వారా జర్వం వచ్చిన కొన్ని వారాల పాటు ఈ నల్ల మచ్చలు కనిపిస్తాయంటున్నారు. ఈ పిగ్మెంటేషన్ దానంతట అదే వెళ్లిపోయినా.. పూర్తిగా వెళ్లడానికి ఆరు నెలలు సమయం పడుతుందట. అయితే ఈ మచ్చ ఎందుకు వస్తుందనేందుకు కారణాలు తెలియలేదట. అయితే చికున్ గున్యూ వైరస్ పోస్ట్ ఇన్​ఫ్లమేటరీ ఫలితమే ఈ హైపర్ పిగ్మెంటేషన్ అని చెప్తున్నారు. 



అప్పట్లో భయపెట్టేసింది.. 


కరోనాకు ముందు ఇండియాను భయపెట్టిన వాటిలో చికెన్ గున్యా కూడా ఉంది. ముఖ్యంగా 2005, 2010 మధ్యకాలంలో చికెన్ గున్యా తీవ్రంగా వ్యాపించింది. 1.25 మిలియన్ల అనుమానిత కేసులు అప్పట్లో నమోదయ్యాయి. 2016లో కూడా ఇది ఇండియాలో బాగా వ్యాప్తి చెందింది. దేశవ్యాప్తంగా 64,057 కేసులు వచ్చాయి. దీనివల్ల అధిక జ్వరం, తీవ్రమైన కీళ్ల నొప్పులు, తలనొప్పి, కండరాల నొప్పులు, జ్వరం.. జ్వరం తగ్గిన తర్వాత దద్దుర్లు దీని లక్షణాలే. అరుదైన సందర్భాల్లో తీవ్రమైన ఇబ్బందులు ఎదురవుతాయి అంటున్నారు. 



Also Read : ప్రెగ్నెన్సీ సమయంలో ఈ పనులు అస్సలు చేయొద్దట.. మొదటి మూడు నెలల్లో ఇవి కచ్చితంగా ఫాలో అవ్వాలట


చికిత్స ఇదే


ప్రభావిత ప్రాంతం ముదురు రంగులోకి మారకుండా బ్రాడ్ స్పెక్ట్రమ్ సన్​స్క్రీన్​ను అప్లై చేయాలి. చర్మాన్ని హైడ్రేటెడ్​గా ఉంచడానికి మాయిశ్చరైజర్​లు ఉపయోగించాలి. దీనివల్ల త్వరగా పిగ్మెంటేషన్ పోయే అవకాశముంది. హైడ్రోక్వినాన్ లేదా కోజిక్ యాసిడ్ 4 శాతం ఉన్న ఉత్పత్తులు మెలనిన్ ఏర్పడకుండా నిరోధిస్తాయి. ఇవి పిగ్మెంటేషన్​ను తగ్గించడంలో కూడా హెల్ప్ చేస్తాయి. 


Also Read : ప్రపంచ ఊపిరితిత్తుల దినోత్సవం 2024 థీమ్ ఇదే.. మిలియన్లలో మరణాలకు కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే