తెలంగాణలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్) నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. పరీక్షల నిర్వహణ కోసం రాష్ట్రవ్యాప్తంగా 913 పరీక్ష కేంద్రాలను సిద్ధం చేశారు. అయితే టెట్ పరీక్ష జరగనున్న విద్యా సంస్థలకు ప్రభుత్వం సెప్టెంబరు 14, 15 తేదీల్లో సెలవు ప్రకటించింది. 


రాష్ట్రవ్యాప్తంగా 4 లక్షల 78 వేల 55 మంది అభ్యర్థుల కోసం 2,052 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. పేపర్-1కు 2,69,557 మంది దరఖాస్తు చేయగా.. 1139 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. పేపర్-2కు 2,08,498 రాయనుండగా.. ఈనెల 27న టెట్ ఫలితాలను ప్రకటించనున్నారు.


ఇదిలా ఉండగా.. జేఎన్‌టీయూ పరిధిలోని కాలేజీలకు కూడా సెప్టెంబరు 14, 15 తేదీల్లో సెలవు ఇచ్చారని ప్రచారం జరుగుతుండగా.. ఎలాంటి సెలవు ఇవ్వలేదని యూనివర్సిటీ యాజమాన్యం స్పష్టం చేసింది. గురు, శుక్రవారాల్లో తరగతులు యథావిధిగా జరుగుతాయని వెల్లడించింది. విద్యార్థులు ఈ విషయాన్ని గమనించాలని కోరింది.


టెట్ హాల్‌టికెట్ల కోసం క్లిక్ చేయండి..


ప్రకటించిన షెడ్యూలు ప్రకారం.. సెప్టెంబర్ 15న టెట్ పేపర్-1 పరీక్షను ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు, పేపర్-2 పరీక్షను మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 వరకు నిర్వహించనున్నారు. సెప్టెంబర్‌ 27న టెట్ ఫలితాలను విడుదల చేయనున్నారు. ప్రభుత్వ ఉపాధ్యాయులుగా నియమితులు కావాలంటే టెట్‌లో అర్హత సాధించడం తప్పనిసరి. వారే టీచర్స్‌ రిక్రూట్‌మెంట్‌ టెస్ట్‌(టీఆర్‌టీ) రాయడానికి అర్హులు.


టెట్ హాల్‌టికెట్ల కోసం క్లిక్ చేయండి..


పరీక్ష షెడ్యూలు..





Published at: 14 Sep 2023 12:04 AM (IST)

- - - - - - - - - Advertisement - - - - - - - - -

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.