దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 49కి పెరిగింది. దిల్లీలో కొత్తగా మరో నాలుగు ఒమిక్రాన్ కేసులు బయటపడ్డాయి. దీంతో దేశ రాజధానిలో కొత్త వేరియంట్ కేసుల సంఖ్య ఆరుకు చేరింది. ఇందులో ఒకరు డిశ్ఛార్జ్ అయినట్లు దిల్లీ ఆరోగ్య మంత్రి సత్యేంద్ర జైన్ తెలిపారు.










ప్రస్తుతం 35 మంది కొవిడ్ 19 బాధితులు, ముగ్గురు అనుమానాస్పద కరోనా రోగులు లోక్‌ నాయక్ జై ప్రకాశ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు సత్యేంద్ర జైన్ వెల్లడించారు. 


మొత్తం కేసులు..


ఈరోజు ఉదయానికి దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 41గా ఉండేది. మహారాష్ట్రలో అత్యధికంగా 20 కేసులు నమోదుకాగా రాజస్థాన్ (9), కర్ణాటక (3), గుజరాత్ (4), కేరళ (1), ఆంధ్రప్రదేశ్ (1), ఛండీగఢ్ (1), దిల్లీ (2) ఒమిక్రాన్ కేసులు వెలుగుచూశాయి. తాజా కేసులతో ఈ సంఖ్య 49కి పెరిగింది.


భారీగా తగ్గిన కేసులు..


దేశంలో కరోనా కేసులు భారీగా తగ్గాయి. కొత్తగా 5,784 కరోనా కేసులు నమోదయ్యాయి. గత 571 రోజుల్లో ఇదే అత్యల్పం. 252 మంది ప్రాణాలు కోల్పోయారు. 7,995 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసుల శాతం 0.26గా ఉంది. రికవరీ రేటు 98.37%గా ఉంది.


డిసెంబర్ 9 వరకు ఉన్న డేటా ప్రకారం మొత్తం 63 దేశాలకు ఒమిక్రాన్ వ్యాప్తి చెందినట్లు ప్రపంచ ఆరోగ్యశాఖ తెలిపింది. 


Also Read: Char Dham Road Project: చార్‌ధామ్ జాతీయ రహదారి ప్రాజెక్టుకు సుప్రీం గ్రీన్‌ సిగ్నల్


Also Read: PM Modi: కాశీ వీధుల్లో కాలినడకన ప్రధాని మోదీ.. అర్ధరాత్రి ఆకస్మిక తనిఖీలు


Also Read: Corona Cases: దేశంలో భారీగా తగ్గి కరోనా వ్యాప్తి.. పెరిగిన ఒమిక్రాన్ కేసులు


Also Read: Elon Musk: అద్దె ఇంట్లో అపర కుబేరుడు, టెస్లా అధినేత ఎలన్ మస్క్


Also Read: ఈ బ్యాంకు హోమ్‌ , కార్‌ లోన్లపై వడ్డీరేట్లు తగ్గించింది.. ఎంతో తెలుసా?


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి