దేశంలో కరోనా కేసుల వివరాలు స్వల్పంగా పెరిగాయి. కొత్తగా 9,419 కేసులు నమోదుకాగా 159 మంది మృతి చెందారు. యాక్టివ్ కేసుల సంఖ్య 94,742కు చేరింది. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసుల శాతం 0.27గా ఉంది.







  • మొత్తం కేసులు: 34,666,241

  • మొత్తం మరణాలు: 4,74,111

  • యాక్టివ్​ కేసులు: 94,742

  • మొత్తం కోలుకున్నవారు: 3,40,97,388


2020 మార్చి నుంచి ఇదే అత్యల్పం. మొత్తం మరణాల సంఖ్య 4,73,952కు పెరిగింది. మొత్తం రికవరీల సంఖ్య 3,40,97,388కి చేరింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.







రికవరీ రేటు 98.36 శాతంగా ఉంది. కరోనా సంక్షోభం మొదలైన నాటి నుంచి ఇదే అత్యధిక రికవరీ రేటు. 


వ్యాక్సినేషన్..


బుధవారం ఒక్కరోజే 80,86,910 కొవిడ్​ టీకా డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది. ఇప్పటివరకు 130.39 కోట్ల వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేసింది.


ఒమిక్రాన్ కేసులు..


భారత్‌లో కొత్త వేరియంట్ ఒమిక్రాన్‌ నెమ్మదిగా విస్తరిస్తోంది. మహారాష్ట్రలో ఇటీవల మరో రెండు ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. దీంతో మరింత కలవరం పెరిగింది. మహారాష్ట్రలో ఇప్పటికే ఎనిమిది ఒమిక్రాన్  కేసులు వెలుగుచూశాయి. తాజాగా ముంబయిలో వచ్చిన కేసులతో మొత్తం సంఖ్య 10కి చేరింది. ఇటీవల దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన 37 ఏళ్ల వ్యక్తితో పాటు అమెరికా నుంచి వచ్చిన మరో వ్యక్తి(36)కి ఒమిక్రాన్‌ పాజిటివ్ వచ్చినట్లు అధికారులు గుర్తించారు. దీంతో దేశవ్యాప్తంగా మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 23కి పెరిగింది.  


Also Read: వారానికోసారి బోన్ సూప్, పోషకాహార లోపాన్ని తీర్చేస్తుంది, ఎలా చేయాలంటే...


Also Read:  కడుపునొప్పిని నిర్లక్ష్యం చేయద్దు... లివర్ సమస్య కావచ్చు


Also Read: సముద్రపు నాచుతో కరోనాను నిరోధించే ఔషధం తయారీ... కొత్త అధ్యయనం వెల్లడి


Also Read: కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునే చూయింగ్ గమ్... తయారుచేసిన శాస్త్రవేత్తలు


Also Read: క్యాన్సర్‌ను అడ్డుకునే ఆహార పదార్థాలివే... వారంలో ఓసారైనా తినండి


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి