Naa Saami Ranga Promo: పండగ ఏదైనా సరే, స్పెషల్ షోలతో టీవీ ఛానళ్లు ప్రేక్షకులకు మస్తు వినోదాన్ని పంచుతాయి. వెరైటీ కాన్సెప్టులతో పండుగ సంతోషాన్ని నింపుతాయి. సంక్రాంతి సందర్భంగా స్టార్ మా అదిరిపోయే షోను రూపొందించింది. ‘నా సామిరంగ’ అనే పేరుతో స్పెషల్ షో చేసింది. ఇందులో స్టార్ హీరో అక్కినేని నాగార్జునతో పాటు ‘నా సామిరంగ’ టీమ్ పాల్గొన్నది. బిగ్ బాస్ కంటెస్టెంట్లతో పాటు స్టార్ మా సీరియల్ ఆర్టిస్టుల జాయినై ఓ రేంజిలో సందడి చేశారు. మాస్ డ్యాన్సులు, కడుపుబ్బా నవ్వించే కామెడీ స్కిట్స్ తో ఆకట్టుకున్నారు. తాజాగా ఈ షోకు సంబంధించిన ప్రోమోను స్టార్ మా విడుదల చేసింది.


పల్లవి ప్రశాంత్ కు శివాజీ ఫన్నీ పంచ్!


ప్రోమో ప్రారంభం కాగానే బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ తో పాటు శివాజీ, యావర్ టీమ్, అటు ప్రియాంక, శోభ, అమర్ దీప్ టీమ్ ఎంట్రీ ఇస్తారు. శివాజీ టీమ్ పేరు మొక్కాపురం కాగా, అమర్ దీప్ వాళ్లది చుక్కాపురం. పండుగకు ఏర్పాట్లు ఘనంగా చేస్తున్నావా? లేదా? అని ప్రశాంత్ ను శివాజీ అడుగుతారు. “ఈసారి అన్నపూర్ణ స్టూడియో గేటు ముందు పటాకులు పేర్చేసిన అన్నా” అంటాడు ప్రశాంత్. “అన్నపూర్ణ గేటు మర్చిపోరా, ఇప్పటికే ఇజ్జత్ మొత్తం పీకింది మనకి” అనడంతో అందరూ పడీపడీ నవ్వుతారు.  మా చుక్కాపురంలో పండగ ఉంటది చూడండి నా సామిరంగ అంటుంది శోభ.  ఆ తర్వాత మొక్కాపురం తరఫున కొందరు, చుక్కపురం తరపున కొందరు కంటెస్టెంట్లు, ఆర్టిస్టులు స్టేజి మీదికి ఎంట్రీ ఇస్తారు. మా చుక్కాపురానికి నాగార్జున రాబోతున్నారని అమర్ దీప్ చెప్తారు. మా ఊరికే వస్తా అన్నారు. ఈ విషయంలో తగ్గేదే లేదంటాడు ప్రశాంత్.


నాగార్జునతో సుమ ‘గీతాంజలి’ సీన్ రీక్రియేషన్


ఇక సుమ అదిరిపోయే డ్యాన్స్ తో స్టేజి మీదికి ఎంట్రీ ఇస్తుంది. పరిటాల నిరుపమ్ పంచ్ డైలాగులు, ముక్కు అవినాష్ నాగార్జున మిమిక్రీ, దానికి సుమ కౌంటర్ అదుర్స్ అనిపిస్తుంది. ఇక ‘నా సామిరంగ’ హీరోయిన్ అషికా రంగనాథ్, యంగ్ హీరోలు అల్లరి నరేష్, రాజ్ తరుణ్ ఎంట్రీ ఇస్తారు. ఆషిక , అల్లరి నరేష్ ‘నా సామిరంగ’ సినిమా డైలాగ్ చెప్పి అలరిస్తాయి. ఇక గాలిపటం వెనుక నుంచి నాగార్జున జోష్ ఫుల్ గా ఎంట్రీ ఇస్తారు. బుల్లితెర బ్యూటీ దీపిక నాగార్జున తో చేసిన కామెడీ ఓ రేంజిలో ఆకట్టుకుంటుంది.  ‘గీతాంజలి’ సినిమాలోని సీన్ ను దీపిక, మానస్ రీ క్రియేట్ చేసి ఆకట్టుకుంటారు. అదే సీన్ ను నాగార్జున, సుమ చేసి వారెవ్వా అనిపిస్తారు. ఈ మధ్య నా యాంకరింగ్ కంటే మీ యాంకరింగ్ బాగుంటుందని సుమ చెప్పండతో అందరూ పడీ పడీ నవ్వుతారు.


పల్లవి ప్రశాంత రైతుల కష్టాలను చూపిస్తూ చేసిన ఫర్ఫార్మెన్స్ అందరినీ ఆకట్టుకుంటుంది. శివాజీ ప్రోత్సాహంతోనే బిగ్ బాస్ విన్నర్ గా నిలిచినట్టు చెప్తాడు పల్లవి ప్రశాంత్. నాకు అన్న లేడు కానీ, నేను చనిపోయేంత వరకు ఆయనే నా అన్న అంటారు. పండుగ సందర్భంగా ఆయనకు పట్టు బట్టలు పెడతాడు. అటు నా బ్రదర్స, ఫాదర్, మదర్ మీరే అంటూ శివాజీకి బంగారు కడియాన్ని తొడుగుతాడు యావర్. ఈ సారి పండక్కి ‘నా సామిరంగ’ అని నాగార్జున చెప్పడంతో ప్రోమో కంప్లీట్ అవుతుంది. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.   


Also Read: ఓటీటీలోకి వచ్చేస్తున్న యాంకర్ సుమ కొడుకు సినిమా - ఎప్పుడంటే?