Nindu Noorella Saavasam Today Episode: ఎపిసోడ్ ప్రారంభంలో ఉంగరాన్ని చూసిన అరుంధతి ఉంగరం ఇక్కడే ఉంది కదా..అంటే గుప్తా గారు నాతో కామెడీ చేస్తున్నారు. ఆయన పని చెప్తాను అనుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.


చిత్రగుప్తుడు: ఇన్నాళ్లు అంగుళీకము పక్కనే పెట్టుకొని నాతో ముప్పతిప్పలు పెట్టించావు. ఇప్పుడు నా అంగుళీకము తీసుకుని నిన్ను కూడా నాతో పాటు మా లోకానికి తీసుకుపోయేదను అనుకుంటూ ఆ చెట్టు దగ్గరికి వెళ్తాడు. ఇంతలో రాథోడ్ వస్తాడు.


రాథోడ్: ఇక్కడ ఏం చేస్తున్నావు.


చిత్రగుప్తుడు: మొక్కలను చూడటానికి వచ్చాను.


రాథోడ్: అవును మరి నువ్వు లేకపోతే ఆ మొక్కలు బెంగ పెట్టుకున్నాయి అని వెటకారంగా అంటూ పదా కిందనే కొత్త మొక్కలు వచ్చాయి వాటిని నాటి నీళ్లు పెట్టాలి అంటాడు.


చిత్రగుప్తుడు : ఇప్పుడు ఇతనితో వాదించడం కంటే చెప్పిన పని చేసి తర్వాత అంగుళీకము తీసుకోవడం మంచిది అనుకొని అక్కడ నుంచి వెళ్ళిపోతాడు.


మరోవైపు అమర్ ఇంటికి పోలీసులు వస్తారు.


ఎస్ఐ: మేము మీ ఇంటిని మానిటర్ చేస్తున్నాము. రాత్రి మీ ఇంట్లో సస్పిసియస్ గా ఒక ఇన్సిడెంట్ జరిగింది అని చెప్తాడు.


అందరూ ఆశ్చర్యంగా ఎస్ఐ వైపు చూస్తారు.


ఎస్సై: అవును ఆ కిల్లర్ రాత్రి మీ ఇంటికి వచ్చాడు అంటూ సీసీ ఫుటేజ్ చూపిస్తాడు.


అరుంధతి: అవునండి ఆ విషయమే మీతో చెప్పటానికి రాత్రి మిమ్మల్ని నిద్ర లేపాను అంటుంది కానీ ఆమె మాటలు ఎవరికీ వినిపించవు.


సి సి ఫుటేజ్ చూస్తున్న ఎస్ఐ ఈ ఇంట్లో ఎవరినో కలవడానికి వచ్చాడు అని చెప్తాడు.


మిస్సమ్మ : చూస్తుంటే అతను ఎవరినో వెతుకుతున్నట్లుగా కనిపిస్తుంది అంటుంది.


మనోహరి : కంగారుపడుతూ ఈ ఇంట్లో అతడిని కలిసే వాళ్ళు ఎవరుంటారు ఆలోచించి మాట్లాడు అని కోప్పడుతుంది.


అమర్: మనోహరిని మందలిస్తూ ఆమె చెప్పింది నిజమే హంతకుడు ఇంట్లో ఎవరిని గాయపరచడానికి రాలేదు ఏదో పని మీద వచ్చినట్లుగా ఉన్నాడు అంటాడు.


ఎస్సై : ప్రతి రూమ్ లోకి వెళ్లి వెంటనే వచ్చేసాడు కానీ ఈ రూమ్ లోకి వెళ్లిన చాలా సేపటి తర్వాత బయటికి వచ్చాడు ఆ రూమ్ ఎవరిది అని అడుగుతాడు.


అందరూ మనోహరి వైపు చూస్తారు.


మనోహరి: కంగారుపడుతూ అందరూ నా వైపు చూస్తున్నారేంటి అంటుంది.


ఎస్సై : అతను మీ గదిలోకి వచ్చిన విషయం మీకు తెలియదా అని అడుగుతాడు.


మనోహరి : లేదు రాత్రి పడుకుంటే పొద్దున్నే లేచాను అని చెప్తుంది.


ఎస్సై అమర్తో నేను మీతో పర్సనల్ గా మాట్లాడాలి అని చెప్పి బయటకు తీసుకువెళ్తాడు. మీ ఇంట్లో వాళ్ళని పర్సనల్గా ఎంక్వయిరీ చేస్తాను అంటాడు.


అమర్: వద్దు, మీరు మనోహరిని అనుమానిస్తున్నట్లుగా ఉన్నారు కానీ ఆమె అరుంధతి ఫ్రెండ్ ఆమె చనిపోయినప్పుడు మేము ఎంత బాధ పడ్డామో మనోహరి కూడా అంతే బాధపడింది అని చెప్తాడు.


ఎస్సై: సరే కానీ నేను చెప్పిన దాని గురించి ఒకసారి ఆలోచించండి అని చెప్పి వెళ్ళిపోతాడు.


లోపల సీసీటీవీ చూస్తున్న మిస్సమ్మ మనోహరి గారు ఎందుకు తేడాగా ప్రవర్తిస్తున్నారు అని అనుమాన పడుతుంది.


మరోవైపు అంజు నీకు ఓటేయొద్దని చెప్తుంది అని అమ్ము దగ్గరికి వచ్చి చెప్తారు ఆకాష్ వాళ్ళు. అమ్ము కోప్పడుతుంది. కానీ రామ్మూర్తి ఆపి అంజలి పాపా ఓటేయ్యొద్దు అని ఎలా చెప్పింది అని అడుగుతాడు. జరిగిందంతా చెప్తాడు ఆకాష్.


రామ్మూర్తి : తను పెద్ద ప్లాన్ వేసింది మీరు అంజలి చెప్పినట్లు చేయండి అంటాడు.


సరే అంటూ అంజు దగ్గరికి వెళ్తారు మిగిలిన ముగ్గురు.


అక్కడ పిల్లలందరితో మాట్లాడుతున్న అంజు ఇప్పుడే వస్తాను అంటూ అమ్ము దగ్గరికి వస్తుంది. నేను పోటీ నుంచి తప్పుకుంటున్నానని చెప్పు అప్పుడు మ్యాజిక్ చూడు అంటుంది. అంజు చెప్పినట్లే పిల్లలందరితోను చెప్తుంది అమ్ము.


ఒక అమ్మాయి: నువ్వేమి తప్పుకో అక్కర్లేదు, మా ఓట్లన్నీ నీకే వేస్తాము. వేరే ఆప్షన్ లేక బంటికి వేస్తున్నాము. స్కూల్ అయిపోయిన తర్వాత దీని గురించి డిస్కస్ చేద్దాం అని చెప్పి వెళ్ళిపోతారు పిల్లలు.


అమ్ము: ఆనందంగా అంజు దగ్గరికి వచ్చి వాళ్లతో ఏం చెప్పావు అని అడుగుతుంది. నువ్వు చెప్పినట్లు కాకుండా ఏదైనా తేడాగా జరిగితే అప్పుడు నీకు ఉంటుంది అని సరదాగా హెచ్చరిస్తుంది. అక్కడితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.