గుప్పెడంతమనసు జూలై 12 ఎపిసోడ్ ప్రోమో (Guppedanta Manasu July 12th Written Update)


లేటెస్ట్ ప్రోమో లో ఏముందంటే
రిషి వాళ్లు పవర్ ఆఫ్ స్టడీస్ సెమినర్‌కి కావాల్సిన ఏర్పాట్లు చేస్తూ బిజీ ఉంటారు. ఇంతలో ప్రిన్సిపల్ వాళ్లు వచ్చి.. ‘రిషీ సార్ గెస్ట్‌లు వస్తున్నారట’ అని చెబుతారు. అంతా కలిసి బొకేలు పట్టుకుని కాలేజ్ ముందు గెస్ట్‌ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. ఇంతలో కారొచ్చి ఆగుతుంది. అందులోంచి మహేంద్ర-జగతి దిగుతారు. వాళ్లని చూసి రిషి షాక్ అవుతాడు. కారు దిగి రిషిని చూడగానే జగతిలో తల్లి ప్రేమ ఉప్పొంగుతుంది. మహేంద్ర అరుస్తున్నా వినకుండా పరిగెత్తుకుంటూ వెళ్లి రిషిని హగ్ చేసుకుని కన్నీళ్లు పెట్టుకుంటుంది. మనం తన కోసమే వచ్చామన్న విషయం రిషి తెలియకూడదు అని చెప్పినప్పటికీ జగతి అలా చేయడంతో ఏమీ అర్థంకాక తలపట్టుకుంటాడు మహేంద్ర. 
జగతి: ‘ఇప్పుడు నిన్ను చూశాక నా మనసు కుదుటపడింది నాన్నా.. మళ్లీ ఒక్కసారి నన్ను అమ్మా అని పిలుస్తావ్ కదూ?’ 
రిషి అయోమయంగా చూస్తుంటాడు. దూరం నుంచి ఇందతా చూసి  శైలేంద్ర షాక్ అవుతాడు. ఇక పాండ్యన్, లెక్చరర్స్, విశ్వనాథం, ప్రిన్సిపల్ అంతా షాక్‌లోనే ఉంటారు.


Also Read: అంత ప్రేమదాచుకుని ఈగో ఎందుకయ్యా - వసుని చూసేసిన శైలేంద్ర - ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్!



అయితే ఇది నిజంగా జరిగిందా లేదంటే జగతి అలా ఊహించుకుందా అన్నది జూలై 12 ఎపిసోడ్ లో తెలుస్తుంది. ఎందుకంటే మొదట్నుంచీ జగతి పాత్ర చాలా ఉన్నతంగా ఉంటుంది. ఆలోచించకుండా ఏ అడుగు వేయదు. అలాంటిది రిషిని చూడాగనే తల్లిప్రేమ పొంగిందా లేదంటే హగ్ చేసుకుని కొడుకుని మిస్సైన బాధ తీర్చేసుకోవాలని ఊహించుకుందా అన్నది క్లారిటీ రావాలంటే ఫుల్ ఎపిసోడ్ చూడాలి. 


Also Read: 'ఐలవ్యూ రిషి' అంటూ షాకిచ్చిన ఏంజెల్- మహేంద్రని చంపేస్తానని జగతిని బెదిరించిన శైలేంద్ర


జరిగిన కథ
జగతికి మాత్రమే చెప్పేసి ఆఖరి సారిగా అమ్మా అని పిలుస్తా అని చెప్పి ఇంట్లోంచి శాశ్వతంగా వచ్చేస్తాడు రిషి. రిషిపై తన అన్నయ్య శైలేంద్ర హత్యాప్రయత్నం చేయిస్తాడు. దిక్కులేని స్థితిలో హాస్పిటల్లో ఉన్న రిషి జేబులో తన ఫ్రెండ్ ఏంజెల్ విజిటింగ్ కార్డ్ చూసి కాల్ చేస్తారు డాక్టర్స్. అలా ఏంజెల్ ఇంటికి చేరిన రిషి తప్పనిపరిస్థితుల్లో కాలేజీ బాధ్యతలు చేపడతాడు. అదే కాలేజీలో మ్యాథ్స్ లెక్చరర్ గా వర్క్ చేస్తుంది వసుధార. మరోవైపు కొడుకుకోసం అల్లాడిపోతున్న జగతి-మహేంద్ర అదే కాలేజీకి గెస్టులుగా వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటారు. వాళ్లని ఫాలో అయిన శైలేంద్ర తనకు వ్యతిరేకంగా ఏదైనా కుట్ర జరిగితే పిన్ని బాబాయ్ ని చంపేయాలని అనుకుంటాడు. అలాంటి టైమ్ లో ఆ కాలేజీకి వెళ్లి వసుధారని చూసి షాక్ అవుతాడు. తాజాగా వచ్చిన ప్రోమోలో రిషిని కూడా చూశాడు.  


ఈ సీరియల్‌లో జగతి, రిషీలుగా తల్లికొడుకుల బంధం ఆడియన్స్‌కి బాగా కనెక్ట్ అయ్యింది. గతంలో రిషి.. అవమాన భారంతో అందరిని వదిలి వెళ్తున్న సమయంలో కూడా.. తల్లిని అమ్మా అని పిలిచే సీన్ ఎంతోగానో మనసుల్ని మెలిపెట్టింది. ‘కొడుకుగా కాపాడుకుంటున్నాను అని చెప్పి మనిషిగా చంపేశావ్ కదమ్మా’ అనే డైలాగ్.. ప్రతి ఒక్కరి కంటా కన్నీళ్లు పెట్టించింది. ఇప్పుడు ఈ సీన్ నిజమైతే సీరియల్ నెక్ట్స్ లెవెల్ అంతే..అంటున్నారు ప్రేక్షకులు...మరి ఈ సీన్ కలో నిజమో తెలియాలి.