‘వార్ 2’ షూటింగ్ అప్డేట్ - 100 రోజుల కాల్ షీట్స్ ఇస్తున్న హృతిక్, తారక్
ప్రస్తుతం బాలీవుడ్‌తో పాటు టాలీవుడ్ మూవీ లవర్స్ కూడా ఎదురుచూస్తున్న ఎన్నో సినిమాల్లో ‘వార్ 2’ కూడా ఒకటి. ఎందుకంటే ఈ చిత్రంతోనే జూనియర్ ఎన్‌టీఆర్.. బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్నాడు. ఇప్పటివరకు ఈ విషయాన్ని ఎన్‌టీఆర్ ప్రకటించకపోయినా.. హృతిక్ రోషన్ మాత్రం తనకు ఎన్‌టీఆర్‌తో కలిసి నటించడం ఎగ్జైటింగ్‌గా ఉందంటూ స్టేట్‌మెంట్ ఇచ్చేశాడు. దీంతో ‘వార్ 2’ షూటింగ్ ఎప్పుడెప్పుడు మొదలవుతుందా... మరిన్ని అప్డేట్స్ ఎప్పుడెప్పుడు వస్తాయా అని ఈ హీరోల ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇదే సమయంలో ‘వార్ 2’ షూటింగ్‌పై ఒక కీలకమైన అప్డేట్ బయటికొచ్చింది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)


గ్లింప్స్ వచ్చేస్తోంది- ఇమ్రాన్ హష్మీ చెప్పింది ‘ఓజీ’ గురించేనా?
పవన్ కల్యాణ్, సుజీత్ కాంబోలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం ‘ఓజీ’. ప్రస్తుతం నిర్మాణ పనులు కొనసాగుతున్న ఈ సినిమా సెప్టెంబర్ 27న విడుదలకు రెడీ అవుతోంది. ఇప్పటికే సగానికిపైగా షూటింగ్ జరుపుకున్నది. ఏపీ ఎన్నికల నేపథ్యంలో పవన్ షూటింగ్ కు బ్రేక్ తీసుకున్నారు. ఎన్నికలు పూర్తి కాగానే మళ్లీ సినిమా షూటింగ్ లో పాల్గొననున్నారు. ఇక ఈ సినిమాలో ఇమ్రాన్ హష్మీ కీలక పాత్ర పోషిస్తున్నారు. తాజాగా ఆయన ట్విట్టర్ వేదికగా చేసిన ఓ కామెంట్ ఆసక్తి కలిగిస్తోంది. ఇంతకీ ఆయన చెప్పిన విషయం ‘ఓజీ’ గురించేనా అని సినీ అభిమానులు చర్చించుకుంటున్నారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)


నా 53 ఏళ్ల కెరీర్‌లో అలాంటిది జరగలేదు - సందీప్ వంగాపై జావేద్ అఖ్తర్ ఫైర్
సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన ‘యానిమల్’ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చి మూడు నెలలు అయిపోయింది. ఈ మూవీ ఓటీటీలోకి కూడా వచ్చేసింది. థియేటర్లతో పాటు ఓటీటీలో కూడా ఈ సినిమాను చాలామంది ఎంజాయ్ చేశారు. కానీ ఇప్పటికీ దీనిపై వస్తున్న కాంట్రవర్సీలకు బ్రేక్ పడడం లేదు. బాలీవుడ్‌లోని పలువురు బడా స్టార్లు ఇప్పటికీ ‘యానిమల్’ గురించి ఓపెన్‌గా మాట్లాడుతూ విమర్శలు చేస్తున్నారు. అందులో జావేద్ అఖ్తర్ కూడా ఒకరు. ఇప్పటికే ఒక ఈవెంట్‌లో ‘యానిమల్’పై విమర్శలు చేసిన జావేద్.. మరోసారి ఓ ఇంటర్వ్యూలో సందీప్ రెడ్డి వంగాపై ఫైర్ అయ్యారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)


‘ఉస్తాద్ భగత్ సింగ్’ సర్‌ప్రైజ్ - పవర్‌స్టార్ డబ్బింగ్ టీజర్‌కేనా?
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల హడావిడి చూస్తుంటే ఇక పవర్ స్టార్ సినిమాలపై ఆశలు వదిలేసుకోవాలేమో అనుకున్నారు ఫ్యాన్స్. పవన్ కళ్యాణ్ చాలారోజులుగా ఆంధ్రప్రదేశ్‌లోనే పర్యటిస్తూ.. సభ్యలు ఏర్పాటు చేస్తూ.. పూర్తిగా తన పొలిటికల్ కెరీర్‌పై ఫోకస్ పెట్టారు. దీంతో తన అప్‌కమింగ్ సినిమాలకు బ్రేక్ పడినట్టే అనుకున్నారంతా. కానీ అనూహ్యంగా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ తెరపైకి వచ్చింది. ఒక్కసారిగా ఈ మూవీ నుండి అప్డేట్ ఇచ్చి అందరికీ సర్‌ప్రైజ్‌తో పాటు షాక్ ఇచ్చాడు దర్శకుడు హరీష్ శంకర్. అంతే కాకుండా తాజాగా పవన్ కళ్యాణ్ డబ్బింగ్ చెప్తున్న ఫోటోలను కూడా విడుదల చేసి మరో అప్డేట్ కోసం ఎదురుచూడమంటూ ఫ్యాన్స్‌లో జోష్ పెంచాడు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)


ఓటీటీలోకి వచ్చేసిన ‘హనుమాన్‌’ తెలుగు వెర్షన్‌ - స్ట్రీమింగ్ ఎక్కడంటే?
తేజ సజ్జ హీరోగా ప్రశాంత్‌ వర్మ దర్శకత్వంలో తెరకెక్కించిన పాన్ ఇండియా చిత్రం ‘హను-మాన్‌’. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సూపర్ హీరో మూవీ, బాక్సాఫీసు వద్ద సెన్సేషనల్ సక్సెస్ సాధించింది. తెలుగు చలనచిత్ర పరిశ్రమ చరిత్రలో ఎపిక్ బ్లాక్‌ బస్టర్‌లలో ఒకటిగా నిలిచింది. ఈ సినిమా ఓటీటీ రిలీజ్ కోసం సినీ అభిమానులు ఆసక్తిగా వేచి చూస్తున్నారు. నేటితో వారి ఎదురుచూపులకు ఫుల్‌ స్టాప్‌ పడింది. ఎట్టకేలకు హనుమంతుడు డిజిటల్ వేదికల మీదకు వచ్చేసారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)