'ఆదిపురుష్' కలెక్షన్స్ - హిందీలో అలా, తెలుగులో ఇలా!
‘ఆదిపురుష్‌’కి ఇప్పటివరకూ వచ్చిన హైప్‌ ద్వారా, బుకింగ్‌ల ద్వారా తొలి వారాంతంలో మంచి వసూళ్లు వచ్చాయి. కానీ ప్రస్తుతం పలు కారణాలతో సినిమా కలెక్షన్లు సగానికి పడిపోయాయి. ఈ మూవీ రిలీజైన మొదటి మూడు రోజులు మంచి కలెక్షన్సే వచ్చాయి. అయితే, సోమవారం (జూన్ 19) నుంచి కష్టాలు మొదలయ్యాయి. కలెక్షన్స్ ఒక్కసారిగా కుప్పకూలాయి. బాక్సాఫీస్ వద్ద 'ఆదిపురుష్' చిత్రం సాధించిన కలెక్షన్ల విషయానికొస్తే.. ఈ సినిమా ఐదవ రోజున రూ.10+ కోట్లకు వసూళ్లు రాబట్టింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రూ.395 కోట్లు వసూలు చేసిందని చిత్రయూనిట్ వెల్లడించింది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)


మీకు తెలుసా? చెర్రీ కంటే ఉపాసనే ధనవంతురాలు - ఆమె ఆస్తుల విలువ తెలిస్తే షాకవ్వడం ఖాయం!
మెగాస్టార్ చిరంజీవి ఇంట్లోకి మహాలక్ష్మి అడుగు పెట్టింది. నిన్న(మంగళవారం) తెల్లవారుజామున ఉపాసన పండంటి పాపకు జన్మినిచ్చింది. అమ్మాయి రాకతో మెగా స్టార్ ఇంట ఆనందాలు వెల్లువెత్తాయి. పలువురు సినీ ప్రముఖులు, మెగా అభిమానులు రామ్ చరణ్, ఉపాసన దంపతులకు శుభాకాంక్షలు చెప్పారు. మనవరాలి రాకతో తాత మెగాస్టార్ చిరంజీవి ఆనందంలో తేలియాడారు.  హాస్పిటల్ కు వెళ్లి ముద్దుల మనువరాలిని చూసి మురిసిపోయారు.  చెర్రీ దంపతులకు పాప పుట్టడం తమకు ఎంతో సంతోషాన్ని కలిగించిందన్నారు. తమ ఫ్యామిలీకి ఎంతో ఇష్టమైన రోజే మనవరాలు జన్మించడం చాలా ఆనందంగా ఉందన్నారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)


మహేష్ సినిమాను లైట్ తీసుకున్న పూజా హెగ్డే?
'గుంటూరు కారం'లో పూజా హెగ్డే (Pooja Hegde) లేరని ఓ స్పష్టత వచ్చింది. ఆ సినిమా నుంచి ఆమె ఎందుకు తప్పుకొన్నారు? అనే అంశంలో ఇంకా సస్పెన్స్ మైంటైన్ అవుతోంది. తప్పించారా? లేదంటే డేట్స్ అడ్జస్ట్ చేయడం కష్టమని ఆమె చెప్పేశారా? అనేది ఇంకా క్లారిటీ లేదు. రెండు మూడు రోజులుగా ఇటు తెలుగు, అటు హిందీ చిత్ర పరిశ్రమల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అయితే... ఈ విషయం మీద పూజా హెగ్డే మౌనం వహిస్తున్నారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)


కిచెన్‌లో తమన్నా రొమాన్స్, పెళ్లికి ముందు రొమాన్స్ టెస్ట్ డ్రైవ్ లాంటిదట - ‘లస్ట్ స్టోరీస్ 2’ ట్రైలర్
బాలీవుడ్ లో మోస్ట్ అవైటెడ్ సిరీస్ ‘లస్ట్ స్టోరీస్ 2’ నుంచి లేటెస్ట్ అప్డేట్ కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. 2018లో వచ్చిన ‘లస్ట్ స్టోరీస్’కు ఇది సీక్వెల్. ఇందులో తమన్నా, మృణాల్ ఠాకూర్, కాజోల్, నీనా గుప్తా, అమృత సుభాష్, అంగద్ బేడీ, విజయ్ వర్మ లు కనిపించనున్నారు. ఇక ఈ సిరీస్ కు అమిత్ రవీంద్రనాథ్ శర్మ, కొంకణా సేన్ శర్మ, ఆర్ బాల్కి, సుజోయ్ ఘోష్ లు దర్శకత్వం వహించారు. ఇప్పటికే విడుదల చేసిని ప్రచార చిత్రాలు ప్రేక్షకుల్లో భారీ అంచనాలను పెంచేశాయి. తాజాగా ఈ సిరీస్ కు సంబంధించిన ట్రెలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ప్రస్తుతం ఈ ట్రెలర్ నెట్టింట వైరల్ అవుతోంది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)


ఏపీ గవర్నమెంట్ టికెట్ రేట్స్ దెబ్బకు పవన్ కళ్యాణ్‌కు 30 కోట్లు లాస్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అధికార వైసీపీ ప్రభుత్వానికి, తెలుగు చిత్రసీమలో అగ్ర కథానాయకుడు జనసేనాని పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)కి మధ్య పరిస్థితి ఉప్పూ నిప్పు అన్నట్లు ఉంది. రెండు రాష్ట్రాల ప్రజలకు ఆ సంగతి తెలుసు. రాజకీయంగా మాత్రమే కాదు... సినిమాల పరంగానూ పవన్ కళ్యాణ్ మీద వైసీపీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. ''ఏపీలో అధికార పార్టీకి వ్యతిరేకమైన వారు ఎవరూ వ్యాపారం చేయకూడదనే పరిస్థితి ఉంది. పారిశ్రామిక వేత్తలకు వెయ్యి కోట్లు పోతే... నాకు రూ. 30 కోట్లు లేదంటే రూ. 40 కోట్లు పోతున్నాయి. 'వకీల్ సాబ్', 'భీమ్లా నాయక్' సినిమాల సమయంలో టికెట్స్ రేట్స్ తగ్గించారు. ఆ రెండు సినిమాలు పెద్ద హిట్. పది రూపాయలు టికెట్ పెడితే ఎప్పటికి పెట్టుబడి వస్తుంది? ఆ రెండు సినిమాలకు ఏపీ వరకు నష్టం వచ్చింది. ఆ భారం రూ. 30 కోట్లు నేనే భరించాను'' అని ఓ ప్రముఖ దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)