నేపాల్‌లో ‘ఆదిపురుష్’ మార్నింగ్ షోలు రద్దు, సీతమ్మే కారణం!


వాల్మీకి రాసిన రామాయణంలో అరణ్య కాండ, యుద్ధ కాండ ఆధారంగా రూపొందిన సినిమా 'ఆదిపురుష్' (Adipurush Movie). రాఘవునిగా ప్రభాస్ (Prabhas), జానకిగా కృతి సనన్, లంకేశుడిగా సైఫ్ అలీ ఖాన్ నటించారు. ఓం రౌత్ (Om Raut) దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఎలా ఉంది? (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి).


నేపాల్‌లో ‘ఆదిపురుష్’ మార్నింగ్ షోలు రద్దు, సీతమ్మే కారణం!


నేపాల్ రాజధాని ఖాట్మండులో మాత్రం ‘ఆదిపురుష్’ సినిమాకు ఆదిలోనే ఇబ్బందులు తలెత్తాయి. ఈ సినిమాలో ఉన్న ఓ డైలాగ్ పై అక్కడి ప్రజలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సీత గురించి చెప్పే ఆ డైలాగ్ ను వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు.  అంతేకాదు, ఖాట్మండు మెట్రోపాలిటన్ సిటీ మేయర్ బాలేంద్ర షా  నేపాల్ రాజధానిలో ‘ఆదిపురుష్’తో పాటు ఈ హిందీ చిత్రాలను ప్రదర్శించకుండా నిషేధిస్తున్నట్లు ప్రకటించారు. ఇతిహాసమైన రామాయణానికి సంబంధించిన ‘ఆదిపురుష్’ సినిమాలో సీత గురించి చెప్పే డైలాగ్ ను తొలగించే వరకు సినిమాల ప్రదర్శనను నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి).


అదేమీ పార్టీ కాదు, పెద్ద బాధ్యత - పెళ్లిపై తమన్నా ఆసక్తికర వ్యాఖ్యలు


గత కొద్ది రోజులుగా మిల్కీ బ్యూటీ తమన్నా నిత్యం వార్తల్లో నిలుస్తోంది. విజయ్ వర్మతో ప్రేమ వ్యవహారం బయటకు వచ్చిన తర్వాత, ఏదో ఒక అంశంతో హెడ్ లైన్ గా మారుతోంది. రీసెంట్ గా విజయ్ తో ప్రేమలో ఉన్నమాట వాస్తవం అని చెప్పిన  తమన్నా, తాజాగా పెళ్లి గురించి కీలక వ్యాఖ్యలు చేసింది. పెళ్లి అంటే ఓ బాధ్యత అని, ఇతరులు చేసుకుంటున్నారు కాబట్టి మనమూ చేసుకోవాలని భావించడం తప్పు అని చెప్పుకొచ్చింది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి).


'ఆదిపురుష్' ఎఫెక్ట్ - బాలీవుడ్‌లో మళ్లీ మొదలైన బాయ్ కాట్ ట్రెండ్, అక్కడ టాక్ ఎలా ఉంది?


యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన పౌరాణిక చిత్రం 'ఆదిపురుష్' ఈరోజు శుక్రవారం ప్రేక్షకుల ముందుకి వచ్చేసింది. ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా.. ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక స్క్రీన్లలో రిలీజ్ అయింది. రామాయణం ఇతిహాసంలోని కొన్ని ప్రధాన ఘట్టాల ఆధారంగా రూపొందిన ఈ చిత్రంపై విడుదలకు ముందే మంచి హైప్ క్రియేట్ అయ్యింది. అయితే ఈ మైథలాజికల్ డ్రామాకి తొలి రోజే మిశ్రమ స్పందన లభించింది. 'ఆదిపురుష్' ను బాయ్ కాట్ చేయాలంటూ నార్త్ ఆడియెన్స్ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోల్స్ చేస్తున్నారు.  (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి).


జూలైకి షిఫ్ట్ అయిన 'గుంటూరు కారం' షూటింగ్ - కారణం అదేనా!


సూపర్ స్టార్ మహేష్ బాబు - త్రివిక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న 'గుంటూరు కారం' సినిమా షూటింగ్ కు సంబంధించి చిత్ర యూనిట్ కి వరుస సమస్యలు తలెత్తుతున్నాయి. ఈ సినిమా ప్రారంభంలో స్క్రిప్ట్ లో కొన్ని మార్పులు చేర్పులు చేయడం వల్ల షూటింగ్ ఆలస్యమైంది. ఆ తర్వాత కొన్ని అనివార్య కారణాలవల్ల మరికొన్ని షెడ్యూల్స్ ని ఇటీవల  రద్దు చేయడం జరిగింది. ఇక ఇప్పుడు మరోసారి ఈ మూవీ షూటింగ్ వాయిదా పడ్డట్టు తెలుస్తోంది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి).