‘రామాయణం‘లో రకుల్ - క్యారెక్టర్ ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!
దర్శకుడు నితీష్ తివారీ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించబోతున్న చిత్రం ‘రామాయణం’. బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్, సౌత్ బ్యూటీ సాయి పల్లవి సీతారాముడిగా నటించబోతున్నఈ చిత్రం త్వరలో సెట్స్ మీదకు వెళ్లనుంది. వచ్చే ఏడాది(2025) దీపావళికి ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడమే లక్ష్యంగా మేకర్స్ శరవేగంగా నిర్మాణ పనులు కొనసాగిస్తున్నారు. ఈ సినిమాలో రావణ్‌గా కన్నడ స్టార్ హీరో యష్, హనుమంతుడిగా సన్నీ డియోల్‌ కనిపించబోతున్నారు. కైకేయి పాత్రలో లారా దత్తా, విభీషణ పాత్రలో విజయ్ సేతుపతి నటించబోతున్నారు. ఈ చిత్రంలో అత్యంత కీలకమైన శూర్పణఖ పాత్రకు స్టార్ హీరోయిన్ ను ఓకే చేసినట్లు తెలుస్తోంది. రావణుడి చెల్లి శూర్పణఖ పాత్రకు హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ సెట్ అవుతుందని నితీష్ తివారీ భావిస్తున్నారట. ఇప్పటికే చిత్రం బృందం రకుల్ తో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)


వివాదంలో 'బేబీ' సినిమా.. క‌థ నాదంటూ ద‌ర్శ‌క, నిర్మాత‌ల‌పై కేసు
'బేబీ'.. యూత్ కి క‌నెక్ట్ అయిన సినిమా. 2023 రిలీజైన ఈ సినిమా సూప‌ర్ హిట్ టాక్ తెచ్చుకుంది. క‌లెక్ష‌న్లు కూడా బాగానే వ‌చ్చాయి. అయితే, ఈ చిత్ర‌బృందం ఇప్పుడు చిక్కుల్లో ప‌డింది. బేబి సినిమా క‌థ త‌న‌దంటూ షార్ట్ ఫిలిమ్స్ డైరెక్ట‌ర్ శిరిన్ శ్రీ‌రామ్ కేసు న‌మోదు చేశారు. ఈ మేర‌కు రాయ‌దుర్గం పోలీసులు ద‌ర్శ‌క, నిర్మాత‌ల‌పై కేసు పెట్టారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)


మొయిద్దీన్ భాయ్ కి షాక్! రజనీ మూవీకి మరీ ఇంత తక్కువ ఓపెనింగ్సా?
‘జైలర్’ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న తర్వాత తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన చిత్రం ‘లాల్ సలామ్’. హిందూ, ముస్లిం ఐక్యత, క్రికెట్ కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమాకు, రజనీ కూతురు ఐశ్వర్య రజనీకాంత్ దర్వకత్వం వహించారు. ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సుభాస్కరన్ ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్నినిర్మించారు. భారీ అంచనాల ఫిబ్రవరి 9న నడుమ ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రజనీ సినిమా అంటే సినిమా అభిమానుల నుంచి ఓ రేంజిలో ఆదరణ ఉంటుంది. బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురుస్తుంది. కానీ, ‘లాల్ సలామ్’ విషయంలో చిత్రబృందానికి షాక్ తగిలింది. గత ఆరేళ్లలో సింగిల్ డిజిట్‌ కలెక్షన్ సాధించిన చిత్రంగా నిలిచింది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)


పరవాలేదనిపించిన ‘ఈగల్’ ఓపెనింగ్స్ - మొదటి రోజు కలెక్షన్స్ ఎంతంటే?
మాస్ మహారాజా రవితేజ.. గత కొంతకాలంగా హిట్స్ కోసం ఎదురుచూస్తున్నాడు. కమర్షియల్ సినిమాలతోనే మాస్ మహారాజాగా ఎదిగిన ఈ హీరో.. ఇప్పటికీ ఎక్కువగా కమర్షియల్ కథలనే ఎంచుకోవడానికి ఇష్టపడతాడు. అదే తరహాలో ‘ఈగల్’తో తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. రిలీజ్ డేట్‌ కోసం ఎన్నో ఇబ్బందులు ఎదుర్కున్న తర్వాత ఫైనల్‌గా ‘ఈగల్’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. థ్రిల్లర్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రంలో ఫైట్స్, క్లైమాక్స్ చాలా బాగున్నాయని ప్రేక్షకులు రివ్యూ ఇచ్చారు. ఇక ఓపెనింగ్ డే కలెక్షన్స్ విషయంలో కూడా ‘ఈగల్’ పరవాలేదనిపించింది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)


ఓటీటీలోకి 'నా సామిరంగ'- స్ట్రీమింగ్ ఎక్కడ? ఎప్పటి నుంచంటే..
టాలీవుడ్ స్టార్ హీరో  అక్కినేని నాగార్జున ప్రధాన పాత్రలో రూపొందిన రీసెంట్ మూవీ ‘నా సామిరంగ’. సంక్రాంతి కానుకగా జనవరి 14న ఈ సినిమా విడుదల అయ్యింది. ఈ చిత్రంతో పాటు 'హనుమాన్‌', 'గుంటూరు కారం', 'సైంధవ' సినిమాలు సైతం రిలీజ్ అయ్యాయి. అయినప్పటికీ ఈ మూవీ మంచి విజయాన్ని అందుకుంది. వసూళ్ల పరంగానూ సత్తా చాటింది. గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిన ఈ  యాక్షన్ ఎంటర్‌టైనర్‌ కు విజయ్ బిన్నీ దర్శకత్వం వహించారు. ఇప్పటికే ఈ మూవీ హక్కులను ఫ్యాన్సీ అమౌంట్ కు  డిస్నీ+ హాట్‍ స్టార్ సొంతం చేసుకుంది. తాజాగా ఈ సినిమాకు డిజిటల్ రిలీపై కీలక ప్రకటన చేసింది. ఫిబ్రవరి 17 నుంచి స్ట్రీమింగ్ అవుతుందని వెల్లడించింది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)