హీరోలూ మనుషులే! వాళ్లకూ ఎమోషన్స్ ఉంటాయి. వాళ్లూ ఇబ్బందులు, సమస్యలు ఉంటాయి. వాళ్లకూ కన్నీళ్లు వస్తాయి. చెన్నైలో గురువారం జరిగిన 'మానాడు' ప్రీ - రిలీజ్ ఈవెంట్ చూస్తే అది నిజమని మరోసారి అనిపిస్తుంది. శింబు హీరోగా వెంకట్ ప్రభు దర్శకత్వం వహించిన సినిమా 'మానాడు'. ఇందులో దర్శకుడు ఎస్.జె. సూర్య ప్రధాన పాత్రలో నటించారు. తమిళంతో పాటు తెలుగులో కూడా ఈ సినిమా విడుదల కానుంది. పాన్ ఇండియా రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. 





'మానాడు' ఈ నెల 25న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా చెన్నైలో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. అందులో ప్రస్తుతం తాను ఎదుర్కొంటున్న వివిధ సమస్యలను తలచుకుని స్టేజి మీద శింబు కన్నీళ్లు పెట్టుకున్నారు. తనకు ఎప్పుడూ సపోర్ట్ చేస్తున్నట్టు సపోర్ట్ చేయాలని అభిమానులను రిక్వెస్ట్ చేశారు. ఆ సమయంలో ఒక్కసారిగా ఆడిటోరియం నుంచి రోరింగ్ రెస్పాన్స్ లభించింది. "అన్నా... మేమెప్పుడూ నీతో ఉంటాం. వుయ్ లవ్యూ" అని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో రెస్పాండ్ అవుతున్నారు.
వెంకట్ ప్రభు దర్శకత్వం వహించిన 'సరోజ', 'గ్యాంబ్లర్', 'బిర్యానీ' సినిమాలు తెలుగులో కూడా విడుదలయ్యాయి. 'మానాడు' కూడా విడుదల కానుంది. చెన్నై ఈవెంట్ లో ఎస్.జె. సూర్య తెలుగు డైలాగు చెప్పినప్పుడు సూపర్ రెస్పాన్స్ లభించింది. ఈ సినిమా 'గ్యాంబ్లర్' రేంజ్ అని నిర్మాత ధనుంజయన్ చెప్పారు. సినిమా కథ నేరేట్ చేసిన తర్వాత వెంకట్ ప్రభును హగ్ చేసుకుని, దీనికి ఇంటెర్నేషల్ అప్పీల్ ఉందని చెప్పానని ఎస్.జె. సూర్య అన్నారు. ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు. 

Also Read: పెద్ద చిన్నా అని ఏమీ లేదు... మళ్లీ నా సినిమాలు థియేటర్లకు వస్తాయ్! - వెంకటేష్
Also Read: నయనతార... వచ్చింది... నటించింది... గెలిచింది! - సమంత
Also Read: కోతులకు అరటిపళ్లు తినిపిస్తున్న సల్మాన్ ఖాన్, ఆయన మేనల్లుడు... వీడియో చూశారా?
Also Read: స్టాఫ్‌కూ ఫైవ్ స్టార్ హోటల్ డిమాండ్ చేసిన హీరోయిన్? అందుకే సినిమా నుంచి తప్పించారా? లేదంటే...
Also Read: డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్న పెళ్లి చెల్లదన్నకోర్టు... హమ్మయ్య అనుకున్న హీరోయిన్ ఎంపీ !
Also Read: మెగాస్టార్ చిరును పొగిడేసిన పవన్ భక్తుడు... ఆ డయాగ్నోస్టిక్ సెంటర్లో సినిమా వారికి యాభై శాతం ఫీజు తగ్గింపు
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి