సూపర్ స్టార్ మహేష్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్నాడు.  పరశురామ్ దర్శకత్వంలో `సర్కార్ వారి పాట` మూవీ షూటింగ్ త్వరగా పూర్తిచేయాలని ప్లాన్ చేశారు. ఇప్పటికే సంక్రాంతి బరిలో రావాల్సిన ఈ సినిమా వాయిదా పడింది. దీంతో ఇంకా ఆలస్యం కాకుండా ఉండాలంటే శరవేగంగా షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ పూర్తిచేయాలన టార్గెట్ పెట్టుకున్నారు.  ఇంతలో మరోసారి ఈ మూవీ షూటింగ్ కి బ్రేక్ పడింది.





సూపర్‌స్టార్‌ మహేశ్‌ బాబు సర్జరీ కోసం అమెరికా వెళ్లనుండడమే కారణం అంటున్నారు.  గత కొన్నిరోజులుగా మోకాలికి సంబంధించిన సమస్యతో బాధపడుతున్న మహేశ్ బాబు శస్త్రచికిత్స కోసం  యూఎస్‌కి వెళ్లనున్నారని టాక్. దీంతో ప్రస్తుతం నటిస్తున్న సర్కారు వారి పాట షూటింగ్‌కు బ్రేక్‌ పడిందని తెలుస్తోంది. ఏకంగా రెండు నెలల పాటూ ఈ మూవీ షూటింగ్ వాయిదా పడనున్నట్టు సమాచారం. దీంతో అభిమానులు కలత చెందుతున్నారు. ఈ సందర్భంగా గెట్ వెల్ సూన్ అంటూ ట్వీట్లు చేస్తున్నారు. 






'సర్కారు వారి పాట' యాక్షన్ సీన్లు చేస్తున్నప్పుడు మహేశ్  మోకాలికి గాయం అయ్యింది. దానికి చిన్న సర్జరీ అవసరమని సోషల్ మీడియాలో ఇప్పటికే వార్తలొచ్చాయి.  వాస్తవానికి ఈ నెలలో సర్కార్ వారి పాట షూటింగ్ పూర్తి చేయాల్సి ఉండగా నొప్పి పెరగడం వల్లో ఏమో మళ్లీ బ్రేక్ తప్పలేదు.






'సర్కారువారి పాట' తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ తో  #SSMB28ని ప్రారంభించాల్సి ఉంది. ఈ లెక్కన ఈ మూవీ ప్రారంభోత్సవం కూడా లేట్ అయ్యే అవకాశాలున్నాయి. ఇప్పటికే 'సర్కార్ వారి పాట' రిలీజ్ ఏప్రిల్ కి వెళ్లింది . దీంతో సినిమాలు లేటైతే అయ్యాయి ఆరోగ్యం జాగ్రత్త,  గెట్ వెల్ సూన్ అంటూ అభిమానులు వరుస ట్వీట్లు చేస్తున్నారు. 
Also Read:  'పావుగంటకొక పెక్.. రాత్రికొక పెగ్'.. బ్రహ్మానందంతో బాలయ్య అల్లరి..


Also Read: 'ఫోకస్' టాస్క్ ఫన్నీ టాస్క్ గా మారిపోయిందే..



 


 

Also Read: థియేటర్లు దొరక్క... పదిహేను రోజులు వెనక్కి వెళ్లిన పూర్ణ సినిమా

 

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి