సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టీవ్‌గా ఉండే కాంగ్రెస్‌ సీనియర్‌ ఎంపీ శశిథరూర్.. బుధవారం తన ట్విట్టర్ ఫాలోవర్లకు ఊహించని సర్‌ప్రైజ్ ఇచ్చారు. ‘సర్కారు వారి పాట’ సినిమా సెట్‌కు వెళ్లి మహేష్ బాబును కలిశారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. మహేష్ బాబుతో మాట్లాడుతున్న వీడియోను ఆయన ట్వీట్ చేశారు. 


మహేష్ బాబు హీరోగా పరశురాం దర్శకత్వంలో ‘సర్కారు వారి పాట’ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసింది. బుధవారం హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో గల ఓ హోటల్‌లో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. ఆ సమయంలో శశిథరూర్ కూడా అదే హోటల్‌లో ఉన్నారు. ఈ విషయం తెలిసి.. ఆయన ఎంపీ గల్లా జయదేవ్‌తో కలిసి షూటింగ్ స్పాట్‌కు చేరుకున్నారు. అక్కడ కాసేపు మహేష్ బాబుతో మాట్లాడారు. 


ఈ విషయాన్ని ఆయన ట్వీట్ చేస్తూ.. ‘‘ఈ రోజు మదాపూర్‌లోని ట్రిడెంట్ హోటల్‌లో ‘సర్కారు వారి పాట’ మూవీ షూటింగ్ జరుగుతోందని తెలిసి.. సూపర్ స్టార్ మహేష్ బాబు బావ, నా సహచరుడు గల్లా జయదేవ్‌తో కలిసి వెళ్లాను. మహేష్‌బాబు చాలా గొప్ప వ్యక్తి’’ అని పేర్కొన్నారు. మరో ట్వీట్‌లో.. మహేష్ బాబు ఇప్పుడే తన సినిమాలో విలన్లను కొట్టి వచ్చారని, ఆ వెంటనే ఆయన్ని కలిశామని తెలిపారు. ఆయన్ని కలవడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు.  



 మైత్రీ మూవీ మేకర్స్‌, జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌, 14 ప్లస్‌ రీల్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని 2022లో విడుదల చేసేందుకు సన్నహాలు చేస్తున్నారు. సంక్రాంతి సందర్భంగా థియేటర్లలో విడుదల చేసే ప్లాన్‌లో నిర్మాతలు ఉన్నారు. ఈ సినిమాలో మహేష్ బాబు సరసన కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇటీవల మహేష్ బాబు పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేసిన వీడియో ఇప్పటికే ఈ చిత్రం మీద అంచనాలు పెంచేసింది. ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. 



Also Read: బిగ్ బాస్ హౌస్‌లో పిల్లి కోసం లొల్లి.. హమీదా వింత వ్యాఖ్యలు.. అడ్డంగా బుక్కైన జెస్సీ!


Also Read: బిగ్ బాస్‌ 5 స్మోకింగ్ బ్యాచ్.. లోబోతో కలిసి దమ్ముకొట్టిన సరయు, హమీద.. ప్రియా గురించి చర్చ 


Also Read: ముఖం పగిలిపోద్ది.. లోబోకి సిరి వార్నింగ్.. ఏడ్చేసిన ఆర్జే కాజల్.. 


Also Read: బిగ్ బాస్ హౌస్‌లో ‘పులిహోర’.. శ్రీరామ చంద్ర మొదలెట్టేశాడు.. ఆ మాటలకు హమీద ఫిదా!