మాస్ మహరాజ్ రవితేజ హీరోగా, వంశీ దర్శకత్వంలో రూపొందుతున్న ప్రతిష్టాత్మక పాన్ ఇండియన్ చిత్రం ‘టైగర్ నాగేశ్వరరావు’. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి భారీగా అంచనాలు నెలకొన్నాయి. దసరా కానుకగా అక్టోబర్ 20న ఈ సినిమా పలు భాషల్లో విడుదలకానుంది. మూవీ రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో చిత్రబృందం ప్రచార కార్యక్రమాలు ముమ్మరం చేసింది. అందులో భాగంగానే హీరో రవితేజ, హీరోయన్లు నుపుర్ సనన్, గాయత్రి భరద్వాజ్ బిగ్ బాస్ షోకు వెళ్లారు.


‘బిగ్ బాస్’ స్టేజిపై రవితేజ సందడి


రవితేజ ‘బిగ్ బాస్’ షో స్టేజి మీదకు రాగానే ప్రేక్షకులు ఓ రేంజిలో ఎంజాయ్ చేశారు. అదిరిపోయే ఎట్రీకి తోడు డ్యాన్స్ గర్ల్స్ సందడి అందరినీ అలరించింది. ఈ సాలిడ్ ఎపిసోడ్ లో రవితేజ్  ఎనర్జిటిక్ పెర్ఫామెన్స్ తో ఆకట్టుకున్నారు. తాజాగా ఆయన ఎంట్రీకి సంబంధించిన ప్రోమోను కూడా స్టార్ మా రిలీజ్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇక స్టేజి మీదకు రాక ముందు నాగార్జునతో కలిసి ఆయన సరగా ముచ్చటించారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. ‘బిగ్ బాస్ 2.0’ మొదలైందని చెప్తున్న నాగార్జున, ఇవాళ్టి ఎపిసోడ్ తో ప్రేక్షకులను మరింత ఎంటర్ టైన్ చేసే అవకాశం కనిపిస్తోంది.


అంచనాలు పెంచిన ‘టైగర్ నాగేశ్వరరావు’ ట్రైలర్   


గత కొద్ది రోజులుగా సినిమాలోని ప్రముఖ పాత్రలను  ఒక్కొక్కటిగా పరిచయం చేసిన మేకర్స్, మోస్ట్ వాంటెడ్ దొంగలకు స్థావరంగా ఉన్న స్టువర్టుపురాన్ని ప్రపంచానికి పరిచయం చేశారు. రీసెంట్ గా అదిరిపోయే ట్రైలర్ తో సినిమాపై మరిన్ని అంచనాలను పెంచారు. ‘టైగర్ నాగేశ్వరరావు’ యాక్షన్-ప్యాక్డ్  ట్రైలర్ రవితేజ చరిష్మాకు తగినట్లుగా అద్భుతమైన రీతిలో అలరించింది.  అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ టాప్ క్లాస్ ప్రొడక్షన్ డిజైన్, ప్రపంచ స్థాయి యాక్షన్ కొరియోగ్రఫీ, ఆర్ మదీ తీసిన విజువల్స్ టెర్రిఫిక్ గా ఉన్నాయి.  జివి ప్రకాష్ కుమార్ ఆర్ఆర్ హీరోయిజాన్ని బాగా ఎలివేట్ చేసింది. అవినాష్ కొల్లా ఆర్ట్ వర్క్, శ్రీకాంత్ విస్సా డైలాగ్స్ పవర్ ఫుల్ గా ఉన్నాయి. 



దసరా కానుకగా విడుదల


70వ దశకంలో స్టువర్టు​పురంలో పేరు మోసిన గజదొంగ టైగర్ నాగేశ్వరరావు నిజ జీవితం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు దర్శకుడు. ‘ది కాశ్మీర్ ఫైల్స్’, ‘కార్తికేయ 2’ వంటి బ్లాక్ బస్టర్ హిట్స్ అందించిన అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ ఈ మూవీని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రానికి తేజ్ నారాయణ్ అగర్వాల్ సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు.  దసరా కానుకగా అక్టోబర్ 20న తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో సినిమా గ్రాండ్​గా రిలీజ్ కానుంది.  నుపుర్ సనన్, గాయత్రి భరద్వాజ్, రేణు దేశాయ్, అనుపమ్ ఖేర్, నాజర్ సహా పలువురు ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు.


Read Also: 'జవాన్'కు 1000 కోట్లు, మున్ముందు 2, 3 వేల కోట్లు కొడతాం - అక్షయ్ కుమార్ సెన్సేషనల్ కామెంట్స్  



ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial