సినీ ఇండస్ట్రీలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై మాట్లాడినందుకు ఓ మంచి నటి పని కోలోపోయిందని, ఈ సమాజం రేపిస్టులను ప్రేమిస్తుందంటూ ప్రముఖ గాయని చిన్మయి శ్రీపాద వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మహిళా సమస్యలపై మాట్లాడేందుకు ఎప్పుడూ ముందుండే చిన్మయి.. ఈ సారి మలయాళం సినీ పరిశ్రమలో సంచలనం సృష్టించిన లైంగిక వేదింపుల ఘటనపై స్పందించింది. 


2017లో ఓ ప్రముఖ నటి కిడ్నాప్, అత్యాచార కేసులో నటుడు దిలీప్ కుమార్ ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో అరెస్టై జైలుకు వెళ్లిన దిలీప్ కుమార్.. ఆ తర్వాత బెయిల్‌పై బయటకు వచ్చాడు. ఇటీవల కేరళ హైకోర్టు.. దిలీప్‌ను ఈ నెల 18 వరకు అరెస్టు చేయొద్దని పోలీసులను ఆదేశించింది. అయితే, ఈ ఘటనపై అప్పట్లో పలువురు హీరోయిన్లు, ప్రముఖులు ఆ హీరోయిన్‌కు మద్దతుగా నిలిచారు. మలయాళ నటి పార్వతి తిరువోతు మహిళా సంఘాలతో కలిసి ఆందోళనలు చేశారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పార్వతి మాట్లాడుతూ.. ఆ పోరాటం వల్ల తాను సినిమా అవకాశాలను కోల్పోయానని తెలిపారు. అప్పట్లో ఆమెను, ఆ పోరాటంలో పాల్గొన్నవారిని ఎలా బెదిరించారనేది వివరించారు.


ఓ వెబ్‌సైట్‌లో వచ్చిన ఈ వార్తను చూసి చిన్మయి తన ఆగ్రహాన్ని ట్వీట్టర్ ద్వారా వెల్లడించారు. ‘‘నటి పార్వతి తన గళం వినిపించినందుకు మూల్యం చెల్లించుకోవల్సి వచ్చింది. నిజం ఏమిటంటే.. మంచి టాలెంట్ ఉన్న ఆ నటి పనిని కోల్పోయారు. కేరళలో లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్నవారి కోసం నిలబడమే ఇందుకు కారణం. చాలామంది మహిళలు మౌనంగా ఉన్నారు. ఈ సమాజం రేపిస్టులను ప్రేమిస్తోంది’’ అంటూ ఆమె ట్వీట్ చేశారు. 






‘బంగార్రాజు’ రివ్యూ: నాగ్ vs చైతు.. బంగార్రాజులు అదరగొట్టారా?


రౌడీ బాయ్స్ రివ్యూ: యూత్‌ని మెప్పించే రౌడీ బాయ్స్..


Also Read: మెగా ఫ్యాన్స్‌కు ఇది బ్యాడ్ న్యూసే... సంక్రాంతి రోజు అఫీషియ‌ల్‌గా చెప్పారుగా!
Also Read: 'హీరో' మూవీ రివ్యూ: మహేష్ బాబు మేనల్లుడి సినిమా ఎలా ఉందంటే...
Also Read: ఐదు రోజులుగా క్వారంటైన్‌లో... క‌రోనా బారిన మ‌రో సెల‌బ్రిటీ?





ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి