Rakul Preet, Jackky: గత కొద్దిరోజులుగా వైరల్‌ అవుతున్న ఇంట్రెస్టింగ్‌ వార్త.. హీరోయిన్‌ రకుల్‌ ప్రీత్‌సింగ్‌, ప్రముఖ నిర్మాత జాకీ భగ్నాని పెళ్లి. గత కొంతకాలంగా డేటింగ్‌లో ఉన్న ఈ ఇద్దరు ఫిబ్రవరి 22న పెళ్లి చేసుకోనున్నారనే వార్త వైరల్‌ అవుతున్న సంగతి తెలిసిందే. ఇరువర్గాల నుంచి దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. అయితే, ప్రస్తుతం వాళ్లు థాయ్‌లాండ్‌లో బ్యాచిలర్‌ పార్టీ చేసుకున్నారట. ఆ ఫొటోలు సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతున్నాయి. దీంతో ఇప్పుడు వాళ్ల పెళ్లి అఫీషియల్‌ అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఫ్యామిలీ, కొద్దిమంది ఫ్రెండ్స్‌తో ఈ బ్యాచిలర్‌ పార్టీ చేసుకోగా.. ఇద్దరు తెలుగు హీరోయిన్లు ఆ పార్టీకి హాజరయ్యారు.


మొదలైన పెళ్లి సందడి.. 


రకుల్ ప్రీత్‌సింగ్‌, జాకీ భగ్నాని ఇద్దరు గత కొంతకాలంగా ప్రేమలో ఉన్నారు. ఇక ఈ ఏడాది మొదటి నుంచి వీళ్ల పెళ్లి గురించి వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. బంధువులు, కొద్దిమంది సన్నిహితుల మధ్య.. గోవాలో వీళ్లు డెస్టినేషన్‌ వెడ్డింగ్‌ చేసుకోవాలని నిర్ణయించినట్లు తెలిసింది. ఇప్పుడు ఆ పెళ్లి హడావుడి మొదలైంది. బ్యాచిలర్‌ పార్టీని థాయ్‌లాండ్‌లో ఎంజాయ్‌ చేస్తోంది ఈ జంట. రకుల్‌, జాకీ ఇద్దరు ఎంజాయ్‌ చేస్తున్న ఫొటోలు బయటికి వచ్చాయి. ఇక ఆ పార్టీకి తెలుగు హీరోయిన్లు మంచు లక్ష్మీ, ప్రగ్యా జైస్వాల్‌, సీరత్‌ కపూర్‌ కూడా హాజరయ్యారు. వాళ్లంతా.. సముద్రంలో పడవపై వెళ్తూ దిగిన ఫొటో ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, ప్రగ్యాజైశ్వాల్‌, మంచు లక్ష్మీ ముగ్గురు చాలా క్లోజ్‌. చాలాసార్లు వీళ్లంతా కలిసి దిగిన ఫొటోలు, పార్టీలు చేసుకున్న సందర్భాలను మంచు లక్ష్మీ తన ఇన్‌స్టాలో పోస్ట్‌ చేశారు కూడా.  


లాస్ట్‌ మినిట్‌లో వేదిక మార్పు.. 


సెలబ్రిటీలు అంటే వాళ్ల పెళ్లి మాములుగా ప్లాన్‌ చేసుకోరు. జీవితాంతం, తరతరాలు మాట్లాడుకునేలా చేసుకోవాలని అనుకుంటారు. అందుకే, చాలామంది కపుల్స్‌ డెస్టినేషన్‌ వెడ్డింగ్స్‌ ప్లాన్‌ చేసుకుంటారు. ఫారెన్‌లో పెళ్లి చేసుకుంటారు. అయితే, రకుల్‌ ప్రీత్‌సింగ్‌ జంట కూడా మొదట్లో అలానే ప్లాన్‌ చేసుకుంది. మిడిల్‌ ఈస్ట్‌ కంట్రీలో పెళ్లి చేసుకోవాలని ఏర్పాటు చేసుకుంది. కానీ, చివరి నిమిషంలో ప్లాన్‌ మార్చుకుందట ఈ జంట. ఉన్నత కుటుంబాలు, సెలబ్రిటీలు తమ డెస్టినేషన్‌ వెడ్డింగ్‌ ఇండియాలోనే చేసుకోవాలని ప్రధాని మోడీ ఈ మధ్య ఇచ్చిన పిలుపు మేరకు ఈ జంట తమ పెళ్లి వేదికను గోవాకు మార్చుకున్నారట. 


బాలీవుడ్‌లో బిజీ బిజీగా.. 


హిందీలో కెరీర్‌ మొదలుపెట్టిన రకుల్‌ప్రీత్‌సింగ్‌ ఆ తర్వాత చాలా తెలుగు సినిమాలు చేశారు. అల్లుఅర్జున్‌, రామ్‌చరణ్‌ తదితర స్టార్‌ హీరోలతో ఆమె స్క్రీన్‌ షేర్‌ చేసుకున్నారు. అయితే, ఈ మధ్య ఆమె టాలీవుడ్‌లో ఎక్కువగా కనిపించడం లేదు. బాలీవుడ్‌లో బిజీబిజీగా గడుపుతున్నారు. ఇండియన్‌ - 2', 'అయాలన్‌' తదితర సినిమా షూటింగ్స్‌లో ఆమె బిజీ బిజీగా ఉన్నారు. త్వరలో 'జాక్కీ', 'బడే మియాన్‌ చోటే మియాన్‌' సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రానుంది రకుల్. 


Also Read: ఈవారం థియేటర్‌, ఓటీటీల్లో విడుదలయ్యే సినిమాలు ఇవే