పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా దర్శకుడు రాధాకృష్ణ కుమార్ రూపొందించిన సినిమా 'రాధేశ్యామ్'. ఎప్పుడో మూడేళ్ల క్రితం మొదలైన ఈ సినిమాను ఈ ఏడాది సంక్రాంతికి విడుదల చేయాలనుకున్నారు. కానీ ఇప్పుడు సడెన్ గా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. దీనికి కారణాలు చాలానే ఉన్నాయి. దేశంలో కోవిడ్, ఒమిక్రాన్ కేసులు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. దీంతో చాలా రాష్ట్రాల్లో నైట్ కర్ఫ్యూలు విధించారు. 


నార్త్ లో కొన్ని థియేటర్లను కూడా మూసేశారు. సౌత్ లో కూడా థియేటర్ల విషయంలో చాలా రెస్ట్రిక్షన్స్ వచ్చేశాయి. ఏపీలో టికెట్ రేట్ వివాదం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. అందుకే భారీ బడ్జెట్ సినిమాలన్నీ వాయిదా పడుతున్నాయి. 'రాధేశ్యామ్'ను కూడా పోస్ట్ పోన్ చేయక తప్పలేదు. అయితే కొత్త రిలీజ్ డేట్ ని మాత్రం ప్రకటించలేదు. ఎందుకంటే పరిస్థితులు ఎప్పుడు సెట్ అవుతాయో తెలియడం లేదు. 


ఇప్పుడు మళ్లీ కొత్త రిలీజ్ డేట్ ని ప్రకటించి ఆ టైంకి రిలీజ్ చేయకపోతే ఫ్యాన్స్ నుంచి ట్రోలింగ్ ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి రిలీజ్ కి 20 రోజుల ముందుగా డేట్ అనౌన్స్ చేయాలని అనుకుంటున్నారట. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. 'రాధేశ్యామ్' సినిమాను మార్చి నెలలో విడుదల చేయబోతున్నారని తెలుస్తోంది. 


మార్చి 18 'రాధేశ్యామ్' థియేటర్లలో రిలీజ్ అవుతుందని అంటున్నారు. అప్పుడు గనుక రిలీజ్ కాకపోతే ఇక సమ్మర్ వరకు ఎదురుచూడాల్సిందేనట. పూజాహెగ్డే హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ నిర్మించింది. యూర‌ప్ నేప‌థ్యంలో జ‌రిగే పీరియాడిక‌ల్ ల‌వ్‌స్టోరిగా ఈ సినిమాను రూపొందించారు. జస్టిన్ ప్రభాకరన్ మ్యూజిక్ కంపోజ్ చేయగా.. ఈ సినిమాకి తమన్ బీజియమ్ అందిస్తున్నారు.  


Also Read: పూల్‌లోకి దూకిన నటి.. పాపం మెడ విరిగింది


Also Read: బాలయ్య కోసం 'క్రాక్' లేడీ.. లక్ కలిసొస్తుందా..?


Also Read:ఫ్యాన్స్ కి షాకిచ్చిన ప్రభాస్.. 'ఆర్ఆర్ఆర్' రూట్ లోనే 'రాధేశ్యామ్'..


Also Read: హీరోగా ఎన్టీఆర్ బావమరిది.. డైరెక్టర్ ఎవరంటే..?


Also Read: 'ఇండస్ట్రీ పెద్ద దిక్కుగా ఉండాలనుకోవడం మూర్ఖత్వం.. ' స్పందించిన వర్మ..


Also Read: 'స్పిరిట్' సినిమాలో ప్రభాస్ రోల్ ఇదే.. రివీల్ చేసిన నిర్మాత..








ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి