మెగాస్టార్ చిరంజీవి అంటే ఓ బ్రాండ్. ఆయనకు ఎంతో మంది అభిమానులు ఉన్నారు. ఆయనకు మాత్రమే కాదు, ఆయన వేసే దోసెలకు కూడా ఫ్యాన్స్ ఉన్నారు. చిరంజీవి దోసెలు చాలా స్పెషల్. అటువంటి చిరంజీవి... వరుణ్ తేజ్ వేసిన దోసె చూసి కుళ్లుకున్నారు. ఎందుకో తెలుసా? అయితే... ఈ మేటర్ ఓసారి చూడండి. భోగి సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో కుటుంబ సభ్యులు అందరూ కలిశారు. ఉదయం అందరికీ చిరంజీవి దోసెలు వేసి పెట్టారు.





చిరంజీవితో పాటు వరుణ్ తేజ్ కూడా దోసెలు వేసే ప్రయత్నం చేశారు. అప్పుడు చిరు దోసె కంటే వరుణ్ వేసిన దోసె బాగా వచ్చింది. దాంతో ఆ దోసెను చిరంజీవి చెడగొట్టారు. 'నాది సరిగా రాలేదు. నాకు కుళ్లు వచ్చింది' అంటూ వరుణ్ వేసిన దోసెను 'ఉప్మా ఉప్మా' అంటూ చిరంజీవి నవ్వుతూ ఉన్నారు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. దాన్ని మీరూ చూడండి. రోడ్డు ప్రమాదం నుంచి కోలుకున్న సాయి ధరమ్ తేజ్ కూడా ఈ భోగి వేడుకలో కనిపించాడు. 





 





 


Also Read: రావణాసుర... ఎంతమంది హీరోయిన్లు ఉన్నారో చూశారా?
Also Read: 'బంగార్రాజు' మూవీ రివ్యూ: నాగ్ vs చైతు.. బంగార్రాజులు అదరగొట్టారా?
Also Read: అయ్యప్ప దీక్షలో అజయ్‌ దేవగన్.. శబరిమలైలో ప్రత్యక్షమైన RRR స్టార్
Also Read: 'సూప‌ర్ మ‌చ్చి' రివ్యూ: సూప‌ర్ అనేలా ఉందా? లేదా?
Also Read: రౌడీ బాయ్స్ రివ్యూ: యూత్‌ని మెప్పించే రౌడీ బాయ్స్..
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి