Vijay Sethupathi Says He is A Big Fan Of Balakrishna: విజయ్ సేతుపతి.. త‌మిళ హీరో అయిన‌ప్ప‌టికీ తెలుగులో కూడా ఎంతోమంది అభిమానుల‌ను సంపాదించుకున్నారు ఆయ‌న‌. చేసింది కొన్ని సినిమాలే అయినా చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ తెచ్చుకున్నారు. అయితే, ఆయ‌న మాత్రం నంద‌మూరి బాల‌కృష్ణ ఫ్యాన్ అంట‌. బాల‌కృష్ణ అంటే చాలా అభిమానం అని, ఆయ‌న చాలా ఇంప్రెస్ చేశార‌ని చెప్పారు విజ‌య్ సేతుప‌తి. ఆయ‌న న‌టించిన సినిమా 'మ‌హారాజా' త‌మిళంతో పాటు తెలుగులో కూడా రిలీజ్ అవుతున్న నేప‌థ్యంలో ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ నిర్వ‌హించారు. ఈసంద‌ర్భంగా ఆయ‌న బాల‌కృష్ణ గురించి మాట్లాడారు? 


హ్యాపీ బ‌ర్త్ డే సార్.. 


నంద‌మూరి బాల‌కృష్ణ పుట్టిన రోజు ఈరోజు. దేశ‌వ్యాప్తంగా ఆయ‌న ఫ్యాన్స్ సంబ‌రాలు చేస్తున్నారు. కాగా.. "ఈ రోజు బాల‌కృష్ణ పుట్టిన రోజు. మీరు చిరంజీవి గారితో క‌లిసి న‌టించారు? మ‌రి బాల‌కృష్ణ‌తో క‌లిసి చేస్తారా?" అని అడిగిన ప్ర‌శ్న‌కి విజ‌య్ సేతుప‌తి ఈ స‌మాధానం చెప్పారు. "సార్ హ్యాపీ బ‌ర్త్ డే సార్. నేను బాల‌కృష్ణ గారికి పెద్ద ఫ్యాన్. చాలా ట్రోల్స్, వీడియోలు ఉంటాయి. కానీ ఆయ‌న న‌న్ను చాలా ఇంప్రెస్ చేస్తారు. ఆయ‌న కెమెరా ముందు నిల‌బ‌డే విధానం, ఆయ‌న హ్యాండిల్ చేసే విధానం చాలా బాగుంటుంది. నేను ఆయ‌న్ను చెన్నైలో ఒక‌సారి క‌లిశాను. నేను ఆయ‌న్ను కౌగిలించుకున్నాను. ఆయ‌న‌కు అది గుర్తుందో లేదో నాకు తెలియ‌దు. 100 ఏళ్ల సినిమా సంబ‌రాల‌కు వ‌చ్చిన‌ప్పుడు క‌లిశాను. ఆయ‌న్ను హ‌యాత్ లో క‌లిశాను" అని చెప్పారు విజ‌య్. 


ప‌వ‌న్ విజ‌యంపై.. 


ఇక ఇదే ప్రెస్ మీట్ లో విజ‌య్ సేతుప‌తి ప‌వ‌న్ క‌ల్యాన్ గురించి కూడా మాట్లాడారు. ఇటీవ‌ల ఏపీ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఆయ‌న భారీ మెజారిటీతో గెల‌వ‌డంపై ఆయ‌న స్పందించారు. ప‌వ‌న్ క‌ల్యాణ్ చాలా క‌ష్ట‌ప‌డ్డార‌ని అన్నారు విజ‌య్. నిజానికి ప‌వ‌న్ గురించి త‌న‌కు తెలియ‌ద‌ని, త‌న కాంటాక్ట్స్ లో కొంత‌మంది తెలుగు వాళ్లు ప‌వ‌న్ క‌ల్యాణ్ స్టేట‌స్ లు పెడితే చూశాన‌ని అన్నారు. ఆయ‌న మాస్ హీరో అంటూ కొనియాడారు. ఆయ‌న‌పై చాలా ట్రోల్స్ వ‌చ్చినా క‌ష్ట‌ప‌డి, నిల‌బ‌డి విజ‌యం సాధించార‌ని చెప్పారు. ‘‘పవన్ కళ్యాణ్ అన్నీ ఎదుర్కొని ఇప్పుడు ఆయనంటో అందరికీ చూపించారు’’ అని పవన్ కళ్యాణ్ గురించి గొప్పగా మాట్లాడారు విజయ్ సేతుపతి. ఇక పవన్ లాగానే తనను కూడా రాజకీయాల్లో చూసే అవకాశం ఉందా అని అడగగా.. ఆ ప్రశ్నను కట్ చేయమని నవ్వుతూ చెప్పారు.


జూన్ 14న ప్రేక్ష‌కుల ముందుకు.. 


విజ‌య్ సేత‌ప‌తి న‌టించిన ‘మహారాజా’ సినిమా జూన్ 14న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఆయన 50వ సినిమాగా వస్తున్న సినిమా 'మహారాజా'. ఈ సినిమాకి నిథిల‌న్ స్వామినాథ‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈ సినిమాకి సంబంధించి ట్రైల‌ర్ ఇప్ప‌టికే ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది. ఈ సినిమాలో మమతా మోహన్‌ దాస్‌, నట్టి కీలక పాత్రలు పోషిస్తున్నారు. 


Also Read: హీరో రామ్‌కు పెద్ద బిజినెస్ ఉండ‌దు, థియేటర్లు ఖాళీగా ఉన్న జనాలు బ్రహ్మాండంగా ఉన్నారని చెప్పేవాడిని: వైవీఎస్ చౌద‌రి