Usha Uthup Husband Died: ప్రముఖ గాయని పద్మభూషణ్ అవార్డ్ గ్రహిత ఉషా ఉతుప్ ఇంట విషాదం చోటుచేసుకుంది. ఆమె భర్త జానీ చాకో.. సోమవారం గుండెపోటుతో మరణించారు. ఉషా అభిమానులు, మ్యూజిక్, సినీ ఇండస్ట్రీ పెద్దలు జానీ చాకో మరణానికి సంతాపం తెలియజేస్తున్నారు. అయితే, ఉషాకు జానీ రెండో భర్త. ఇద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. జానీ తన ప్రేమను నేరుగా ఆమె మొదటి భర్త దగ్గరే వ్యక్తం చేయడం విశేషం. ఈ విషయాన్ని ఉష ఉతుప్ తన బయోగ్రాఫీలో వెల్లడించారు.


బయోగ్రాఫీలో లవ్ స్టోరీ..


ఉషా ఉతుప్.. తన కెరీర్‌లో ఎన్నో స్టేజ్ పర్ఫార్మెన్స్‌లు ఇచ్చారు. అలాగే 1969లో కోలకత్తాలోని ట్రింకాస్ అనే నైట్ క్లబ్‌లో ఒకరోజు ఉషా ఉతుప్ పర్ఫార్మ్ చేయడానికి వెళ్లారు. అక్కడే మొదటిసారి జానీ చాకోను చూశారు. అప్పటికే ఉషా ఉతుప్‌కు రాము అనే వ్యక్తితో పెళ్లయ్యింది. ఈ విషయాన్ని ఉషా ఉతుప్ బయోగ్రాఫీలో రాసుకున్నారు. 2022లో వికాస్ కుమార్ ఝా అనే రచయిత.. ‘ది బుక్ ఆఫ్ ఇండియన్ పాప్ - ది ఆథరైజ్డ్ బయోగ్రాఫీ ఆఫ్ ఉషా ఉతుప్’ అనే బయోగ్రాఫీని రాశారు. ఆ పుస్తకంలో ఈ పాపులర్ సింగర్ పర్సనల్ లైఫ్ గురించి ఫ్యాన్స్‌కు తెలియని ఎన్నో విషయాలు ఉన్నాయి. అందులో తన మొదటి భర్త గురించి ఉంది.


మొదటి భర్తతో స్నేహం..


1969లో ట్రింకాస్‌లో పర్ఫార్మ్ చేయడం కోసం ఉషా ఉతుప్.. ఒక అగ్రిమెంట్ చేసుకున్నారు. దీంతో వరుసగా పర్ఫార్మెన్స్ చేయాల్సిన పరిస్థితి ఉండడంతో తన మొదటి భర్త రాము కూడా తనతో పాటు కోలకత్తా వచ్చారు. అక్కడ పర్ఫార్మెన్స్ ఇస్తున్న సమయంలోనే ఆమె జానీని మొదటిసారి చూశారు. అప్పుడే రాము, జానీ ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం గమనించారు. కోలకత్తాలో రాముకు కంపెనీ దొరికిందని ఉషా సంతోషించారు. ఆ తర్వాత రోజు తమ ఇంటికి భోజనానికి రమ్మని జానీని ఆహ్వానించారు రాము. ఆ మరుసటి రోజు ట్రింకాస్‌లో ఉషా ఉతుప్ పర్ఫార్మ్ చేస్తున్నప్పుడు జానీ అక్కడే ఉన్నారు. కానీ ఎక్కడ చూసినా ఆమెకు రాము మాత్రం కనిపించలేదు. అందుకే పర్ఫార్మెన్స్ అయిపోయిన తర్వాత ఉషాను ఇంటి దగ్గర డ్రాప్ చేస్తానని చెప్పారు జానీ. కానీ ఆ జర్నీలో వారు ఏమీ మాట్లాడుకోలేదు.


మీ భార్యను ప్రేమిస్తున్నాను..


ఉషా ఉతుప్ ఆటోబయోగ్రాఫీలో రాసినదాని ప్రకారం ఆరోజు ఇంటికి చేరుకోగానే ఏం జరిగిందంటే.. ఉషాతో వచ్చిన జానీని చూసి రాము మొహం మాడిపోయింది. ఉషా లోపలికి వచ్చారు. వెంటనే జానీని అక్కడినుంచి వెళ్లిపోమన్నారు రాము. మామూలుగా చాలా సైలెంట్‌గా ఉండే తన భర్తకు ఏమైందా అని అనుకున్నారు ఉషా. వెంటనే రాము తలుపు వేసేశారు. ఆ తర్వాత అసలు జానీ నాకు రెస్టారెంట్‌లో ఏం చెప్పాడో తెలుసా అని ఉషాతో చెప్పుకొచ్చారు. నాకు ఉషా గురించి తెలియదు. కానీ నేను నీ భార్యతో ప్రేమలో పడిపోయాను అన్నారు. నీకు కూడా జానీ అంటే ఇష్టమా అని అడగగా అవును అని ఉషా చెప్పారు అని పుస్తకంలో ఉంది. ఆ తర్వాత వారి మధ్య దూరం పెరిగి విడిపోయారని, ఆపై ఉషా.. జానీని పెళ్లి చేసుకున్నారు.


Also Read: అలా చేయడం మంచిదేనంటూ ప్రశాంత్ వర్మ ట్వీట్ - రణవీర్ కోసమేనా? అంటూ నెటిజన్లు సందేహం