నవరస రాయ డా. నరేష్ విజయకృష్ణ (Naresh Vijaya Krishna) కథానాయకుడిగా రూపొందిన సినిమా 'మళ్ళీ పెళ్లి' (Malli Pelli Movie 2023). ఇందులో ఆయనకు జోడీగా, కథానాయికగా ప్రముఖ నటి పవిత్రా లోకేష్ (Pavitra Lokesh) నటించారు. సినిమాలో తొలి పాట 'ఉరిమే కాలమా...'ను ఈ రోజు విడుదల చేశారు.


లేటు వయసులో ప్రేమలో పడితే...
Urime Kaalama Song : 'ఉరిమే కాలమా...' పాటకు అనంత శ్రీరామ్ (Anantha Sriram) సాహిత్యం అందించారు. అనురాగ్ కులకర్ణి ఆలపించారు. ప్రేమకు వయసుతో సంబంధం లేదు. ఎప్పుడు ఎవరిలో ఎలా ప్రేమ కలుగుతుందో ఎవరూ చెప్పలేరు. అయితే... లేటు వయసులో ప్రేమలో పడిన ఓ జంట పరిస్థితిని ఈ పాటలో ఆవిష్కరించే ప్రయత్నం చేశారు. ఈ పాటకు సురేష్ బొబ్బిలి అందించిన బాణీ అందించారు. 


Also Read : రామ్ చరణ్ సినిమా కోడి రామ్మూర్తి బయోపిక్ కాదు!






కొన్ని రోజుల క్రితం 'మళ్ళీ పెళ్లి' టీజర్ విడుదల చేశారు. అది చూస్తే... నిజంగా సినిమా టీజరా? లేదంటే నరేష్, పవిత్ర జీవితంలో జరిగిన సంఘటనలను రీ క్రియేట్ చేశారా? రియల్ స్టోరీని సినిమాగా తీశారా? అనే సందేహం కలుగుతుంది. అంతలా టీజర్ కట్ చేశారు. 


సినిమా కాదు... జీవితంలో జరిగినవే!
Naresh and Pavitra relationship : నరేష్, పవిత్రా లోకేష్ మధ్య సంబంధం ఏంటి? తెలుసుకోవాలని తెలుగు ప్రజలు, కన్నడ ప్రేక్షకులూ ఆసక్తి కనబరుస్తున్నారు. ఎందుకనేది అందరికీ తెలిసిందే. నరేష్, పవిత్ర సన్నిహితంగా మెలుగుతున్నారని తెలుగు  కూస్తోంది. ఆ ప్రచారానికి తోడు నరేష్ మూడో భార్య రమ్యా రఘుపతి ఆరోపణలు చేశారు. ఆమె ప్రెస్ మీట్ పెట్టడం, రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నానని హోటల్ కు వెళ్లడం... ఆ మధ్య బెంగళూరులో హై డ్రామా నడిచింది. తమకు మద్దతు ఇవ్వాలని పవిత్రా లోకేష్ ప్రేక్షకులను కోరారు.  'మళ్ళీ పెళ్లి' టీజర్ చూస్తే... అవన్నీ గుర్తుకు వస్తాయి. మరోసారి ప్రేక్షకుల కళ్ళ ముందు కదలాడతాయి. నరేష్, పవిత్రా లోకేష్ రియల్ లైఫ్ క్యారెక్టర్లు చూస్తే... రమ్యా రఘుపతి పాత్రలో నటి వనితా విజయ్ కుమార్ యాక్ట్ చేసినట్టు ఉంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే... ఇది సినిమా కాదు, నరేష్ - పవిత్ర బయోపిక్ అని సోషల్ మీడియాలో చాలా మంది కామెంట్ చేస్తున్నారు. 


Also Read 'సేవ్ ద టైగర్స్' రివ్యూ : భార్యల నుంచి భర్తలను కాపాడుకోక తప్పదా - సిరీస్ ఎలా ఉందంటే?



'మళ్ళీ పెళ్లి' సినిమాకు మెగా మూవీ మేకర్ ఎం.ఎస్. రాజు (MS Raju) దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగు, కన్నడ భాషల్లో రూపొందుతున్న ఈ ద్విభాషా చిత్రానికి నరేష్ నిర్మాత. దీంతో లెజెండరీ ప్రొడక్షన్ హౌస్ విజయ కృష్ణ మూవీస్‌ సంస్థను పున:ప్రారంభించారు. సకుటుంబ సమేతంగా చూడదగ్గ సినిమా 'మళ్ళీ పెళ్లి' అని, ఇది పూర్తి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ అని ఆయన తెలిపారు. వేసవిలో సినిమా విడుదల కానుంది.


జయసుధ, శరత్‌బాబు కీలక పాత్రలు పోషిస్తున్న 'మళ్ళీ పెళ్లి' సినిమాలో వనితా విజయ్ కుమార్, అనన్య నాగెళ్ల, రోషన్, రవివర్మ, అన్నపూర్ణ, భద్రం, యుక్త, ప్రవీణ్ యండమూరి, మధు తదితరులు ఇతర తారాగణం. ఈ చిత్రానికి సురేష్ బొబ్బిలి  స్వరాలు, అరుల్ దేవ్ నేపథ్య సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం : ఎంఎన్ బాల్ రెడ్డి.