యాంగ్రీ స్టార్ రాజశేఖర్ (Rajasekhar) కథానాయకుడిగా యువ దర్శకుడు పవన్ సాధినేని (Pavan Sadineni) ఓ సినిమా తెరకెక్కుతోంది. ఇది అనౌన్స్ చేసి చాలా రోజులు అయ్యింది. కానీ, ఇద్దరికీ ఉన్న కమిట్‌మెంట్స్ వల్ల ఇంకా సెట్స్ మీదకు వెళ్లలేదు. త్వరలో చిత్రీకరణ ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారు. అయితే, ఈ సినిమా టైటిల్ మారిందని విశ్వసనీయ వర్గాల సమాచారం.


'మాన్‌స్ట‌ర్‌' కాదు... 1990 సూపర్ హిట్ సినిమా టైటిల్!
రాజశేఖర్, పవన్ సాధినేని సినిమాకు 'మాన్‌స్ట‌ర్‌' ఖరారు చేసినట్టు ఆ మధ్య వార్తలు వినిపించాయి. ఆ టైటిల్ పరిశీలనలో ఉందని యూనిట్ సభ్యుల నుంచి సైతం వినిపించింది. కానీ, ఇప్పుడు టైటిల్ మారిందని టాక్.


రాజశేఖర్ సూపర్ హిట్ సినిమాల్లో 'మగాడు' ఒకటి. ఆయనకు యాంగ్రీ స్టార్ ఇమేజ్ తీసుకు వచ్చిన సినిమా అది. 1990లో విడుదల అయ్యింది. ఆ 'మగాడు' టైటిల్ తాజా సినిమాకు ఖరారు చేశారని విశ్వసనీయ వర్గాల సమాచారం.


Also Read: కమిటీ కుర్రోళ్ళు ఓటీటీ... ఆహా కాదండోయ్, మరో వేదికలో నిహారిక నిర్మించిన సినిమా



రాజశేఖర్ సినిమాలో రాజ్ తరుణ్ కీలక పాత్ర!?
రాజశేఖర్ సోలో హీరోగా తెరకెక్కిన 'పిఎస్వి గరుడ వేగ', 'కల్కి' సినిమాలు మంచి విజయాలు సాధించాయి. అయితే, ఆ తర్వాత నితిన్ 'ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్'లో కీలక పాత్ర చేశారు. యాక్షన్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతున్న ఈ సినిమాలో మరో యంగ్ హీరో కూడా ఉన్నారని తెలిసింది. రాజశేఖర్, పవన్ సాధినేని 'మగాడు' సినిమాలో యంగ్ హీరో రాజ్ తరుణ్ ఓ రోల్ చేస్తున్నారని టాక్. రాజశేఖర్ పెద్ద కుమార్తె శివాని, రాజ్ తరుణ్ జంటగా 'అహ నా పెళ్లంట' వెబ్ సిరీస్ చేసిన సంగతి వీక్షకులకు తెలిసిన విషయమే.


Also Readభయపడకు, నేనున్నాను... మహేష్ వాయిస్ ఓవర్‌తో 'ముఫాసా' తెలుగు ట్రైలర్ వచ్చేసిందోచ్!


ఓటీటీలకు ఆదరణ పెరిగిన తర్వాత దర్శకుడిగా పవన్ సాధినేనిలో కొత్త కోణం ప్రేక్షకులకు తెలిసింది. ఆహాలో స్ట్రీమింగ్ అవుతున్న 'సేనాపతి' సినిమా గానీ, డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీలో 'దయా' వెబ్ సిరీస్ గానీ, షో రన్నర్‌గా చేసిన జీ 5 వెబ్ సిరీస్ 'పరువు' గానీ విమర్శకుల ప్రశంసలతో పాటు ప్రేక్షకుల పొగడ్తలు లభించాయి.


పాన్ ఇండియా ప్రేక్షకులకు సుపరిచితుడైన మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ హీరోగా 'ఆకాశంలో ఒక తార' చేసే అవకాశం అందుకున్నారు. ఆ సినిమాను 'కల్కి 2898 ఏడీ'తో పాన్ ఇండియా విజయం అందుకున్న వైజయంతీ మూవీస్ సంస్థ నిర్మిస్తోంది. 'ఆకాశంలో ఒక తార' కంటే ముందు రాజశేఖర్ 'మగాడు' ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా చిత్రీకరణ దాదాపుగా పూర్తి  కావొచ్చిందని, ఈ ఏడాది డిసెంబర్ నెలలో ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడానికి సన్నాహాలు చేస్తున్నారని సమాచారం. ఈ చిత్రానికి మల్కాపురం శివకుమార్ నిర్మాత.


Also Readమైండ్ బ్లాక్ అయ్యే రేంజ్‌లో మహేష్ - రాజమౌళి సినిమా... ఇది మామూలు ప్లాన్ కాదయ్యా!