SS Rajamouli's ssmb29 update: సూపర్ స్టార్ మహేష్ బాబు సంక్రాంతికి 'గుంటూరు కారం'తో థియేటర్లలో సందడి చేశారు. ఆ తర్వాత ఆయన కొత్త సినిమా ఏది సెట్స్ మీదకు వెళ్లలేదు. అయితే, దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళితో సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. త్వరలో ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం కానుంది. ఈ విషయాన్ని రాజమౌళి స్వయంగా చెప్పారు.


స్క్రిప్ట్ వర్క్ పూర్తి అయింది...
ప్రస్తుతం డైరెక్షన్ టీం ఏం చేస్తుందంటే?
'ఆర్ఆర్ఆర్: రౌద్రం రణం రుధిరం' తర్వాత రాజమౌళి కూడా వేరే సినిమా ఏది ప్రారంభించలేదు. మహేష్ బాబు మూవీ స్క్రిప్ట్ మీద వర్క్ చేస్తూ ఉన్నారు. 'ఆర్ఆర్ఆర్' విడుదలై మార్చి 24కు రెండేళ్లు అవుతుంది. అప్పటి నుంచి ఇప్పటివరకు ఆయన ఏం చేశారు? అంటే... మహేష్ బాబు మూవీ స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేశారు.


'ఆర్ఆర్ఆర్' సినిమా జపాన్ ప్రేక్షకులకు సైతం విపరీతంగా నచ్చింది. అక్కడ ఇంకా సినిమా విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది. ఈ నెల 19న జరిగిన ఓ ప్రదర్శనకు రాజమౌళి హాజరయ్యారు. తన తదుపరి సినిమా గురించి అక్కడి ప్రేక్షకులతో ఆయన మాట్లాడుతూ.... ''నా నెక్స్ట్ సినిమా రైటింగ్ వర్క్ పూర్తి అయ్యింది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఉన్నాము. అందులో నటీనటులను ఇంకా ఎంపిక చేయలేదు. ఒక్క కథానాయకుడిని తప్ప! సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తారు. హి ఈజ్ తెలుగు యాక్టర్. జపాన్ ప్రేక్షకులు చాలా మందికి ఆయన తెలుసు. వెరీ హ్యాండ్సమ్. త్వరలో చిత్రీకరణ ప్రారంభిస్తాం. వీలైనంత త్వరగా సినిమా పూర్తి చేయాలని అనుకుంటున్నాం. ఆ సినిమా విడుదల కోసం మళ్లీ జపాన్ వస్తాను'' అని చెప్పారు.


Also Read'టిల్లు స్క్వేర్' రీ రికార్డింగ్ - బ్లాక్ బస్టర్ మ్యూజిక్ డైరెక్టర్ చేతిలో సినిమా






మహేష్ బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వం వహించనున్న పాన్ ఇండియా / వరల్డ్ సినిమాను కేఎల్ నారాయణ ప్రొడ్యూస్ చేస్తారు. కొన్నేళ్లుగా ఆయన చిత్ర నిర్మాణానికి దూరంగా ఉన్నారు. మహేష్, రాజమౌళి సినిమాతో మళ్లీ గ్రాండ్ రీ ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతున్నారు. ఈ మూవీ బడ్జెట్ 300 కోట్లకు పైమాటే అని ఫిలిం నగర్ వర్గాల సమాచారం. జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ట్రిపుల్ ఆర్ భారీ విజయం సాధించింది. తొలి ఆస్కార్ అందుకున్న భారతీయ సినిమాగా చరిత్రకు ఎక్కింది. రాజమౌళి పేరు అంతర్జాతీయ స్థాయిలో మార్మోగింది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని నిర్మాణం విషయంలో రాజీ పడకూడదని చిత్ర బృందం ఓ నిర్ణయానికి వచ్చింది.


Also Readమెడికల్ ఫీల్డులో పెద్ద పేరు, ఇంకా హాస్పిటల్స్ - వెంకటేష్ రెండో అల్లుడు, వియ్యంకుడి బ్యాగ్రౌండ్ తెలుసా?



హాలీవుడ్ స్టార్స్ ఎంత మంది ఉంటారు?
'ఆర్ఆర్ఆర్'లో హాలీవుడ్ స్టార్లు కనిపించారు. భారత స్వాతంత్య్రం నేపథ్యంలో కథ కనుక బ్రిటీషర్లుగా విదేశీయులను జక్కన్న తీసుకున్నారు. ఇప్పుడు మహేష్ బాబుతో చేయబోయే సినిమా గ్లోబ్ ట్రాంటింగ్ జానర్ మూవీ. ఇందులో ఇండోనేషియా నటి చెల్సియా ఎలిజబెత్ ఇస్లాన్ (chelsea elizabeth islan)ను కథానాయికగా తీసుకున్నారని సమాచారం. అయితే, ఆ విషయాన్ని ఇంకా వెల్లడించలేదు. రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ స్క్రిప్ట్ వర్క్, ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జోరుగా చేస్తున్నారు.