Allu Arjun: స్టార్ హీరోలకు స్టార్‌డమ్‌తో పాటు కాంట్రవర్సీలు కూడా క్రియేట్ అవ్వడం సహజం. అందుకే ఆఫ్ స్క్రీన్ వారు తీసుకునే ప్రతీ స్టెప్ విషయంలో, వారు మాట్లాడే ప్రతీ మాట విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. లేకపోతే ఆ కాంట్రవర్సీలు అనేవి రోజురోజుకీ పెరిగిపోతూ ఉంటాయి. ప్రస్తుతం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పరిస్థితి అదే అనిపిస్తోంది. పర్సనల్‌గా, ప్రొఫెషనల్‌గా.. ఇలా రెండు కోణాల్లోనే అల్లు అర్జున్ టైమ్ ఇప్పుడు బాగాలేదని అనిపిస్తోందని నెటిజన్లు అనుకుంటున్నారు. తాజాగా గీతా ఆర్ట్స్‌కు క్లోజ్ అయిన ఒక నిర్మాత కూడా ఈ విషయంపై స్పందించారు.


అల్లు అర్జున్ ఎక్కడ.?


వినోద్ కిషన్, అనూష కృష్ణ జంటగా నటిస్తున్న చిత్రమే ‘పేకమేడలు’. ఈ సినిమాను యంగ్ అండ్ అప్‌కమింగ్ హీరో రాకేశ్ వర్రే నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన స్పెషల్ ప్రెస్ మీట్‌కు నిర్మాత ధీరజ్ కూడా హాజరయ్యారు. అయితే అల్లు అరవింద్, గీతా ఆర్ట్స్‌కు ధీరజ్‌కు మంచి సాన్నిహిత్యం ఉంది. ఈ విషయం చాలామందికి తెలిసిందే. అందుకే అసలు అల్లు అర్జున్‌పై ప్రస్తుతం వినిపిస్తున్న రూమర్స్‌పై క్లారిటీ ఇవ్వమని ధీరజ్‌కు ప్రశ్న ఎదురయ్యింది. ‘‘అల్లు అర్జున్ గడ్డం తీసేసి యూరోప్ వెళ్లిపోయారు అని సోషల్ మీడియాలో హాట్ టాపిక్ నడుస్తోంది. సుకుమార్‌కు, ఆయనకు మధ్య ఏమైన మనస్పర్థలు వచ్చాయా’’ అని ధీరజ్‌ను ప్రశ్నించారు.


నేనేం వినట్లేదు..


ఆ ప్రశ్నకు సమాధానం చెప్పడం ఇష్టం లేని ధీరజ్.. ‘‘ఇది సందర్భం కాదు. ఇక్కడ మనం ఈ టాపిక్ మాట్లాడకూడదు. మనం డైవర్ట్ అయిపోతున్నాం. ‘పేకమేడలు’ సినిమా గురించి 100 ప్రశ్నలు అడగండి.. నేను రెడీగా ఉన్నాను. అసలు ఈ టాపిక్స్‌లోకి మనం వెళ్లొద్దు. మనకు అవి వద్దు. నాకు సంబంధం లేదు. నేను మీ ప్రశ్న వినడం లేదు’’ అని అన్నారు. దీంతో చాలామంది సందేహానికి సమాధానం దొరకలేదు. సుకుమార్, అల్లు అర్జున్ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘పుష్ప 2’ పలుమార్లు పోస్ట్‌పోన్ అవ్వడంతో సినిమాపై క్రియేట్ అయిన హైప్.. రోజురోజుకీ తగ్గిపోతూ వస్తోంది. ఈ సినిమా వల్లే సుకుమార్, అల్లు అర్జున్ మధ్య మనస్పర్థలు కూడా వచ్చాయని చాలాకాలంగా వార్తలు వైరల్ అవుతూనే ఉన్నాయి. పైగా ఈ విషయంపై మూవీ టీమ్ నుండి ఎలాంటి అప్డేట్ కూడా లేకపోవడం సందేహాలకు దారితీస్తోంది.


నిర్మాతగా మారాడు..


‘పేకమేడలు’ విషయానికొస్తే.. ‘బాహుబలి’లో సేతుపతి అనే క్యారెక్టర్‌లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు రాకేశ్ వర్రే. ‘ఎవరికీ చెప్పొద్దు’ లాంటి మూవీలో హీరోగా కూడా నటించాడు. అలాంటి అప్‌కమింగ్ హీరో.. ‘పేకమేడలు’ అనే కథ.. ఈ సినిమాను నిర్మించడానికి ముందుకొచ్చాడు. ఇందులో హీరోగా తనకంటే వినోద్ కిషన్ ఎక్కువగా సూట్ అవుతాడు అనే ఉద్దేశ్యంతో తను నిర్మాణం వరకే పరిమితమయ్యాడు. ‘నా పేరు శివ’లో విలన్‌గా నటించి మంచి పేరు తెచ్చుకున్న వినోద కిషన్.. మొదటిసారి తెలుగులో హీరోగా అలరించడానికి సిద్ధమయ్యాడు. ‘పేకమేడలు’ మూవీ జులై 19న థియేటర్లలో సందడి చేయనుంది.


Also Read: పేకమేడలు ట్రైలర్ రివ్యూ... భార్య భర్తల మధ్యలో ఎన్నారై లేడీ!