హీరో వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠి మధ్య సమ్‌థింగ్ సమ్‌థింగ్ అని ఎన్నో రోజుల నుంచి గాసిప్స్ వస్తున్న సంగతి తెలిసిందే. ఇది ఎంతవరకు నిజమో తెలీదుగానీ, తాజాగా లావణ్య త్రిపాఠి చేసిన ట్వీట్ చూస్తే మాత్రం అది నిజమే అనిపించక మానదు. 


గత కొన్నాళ్ల నుంచి వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిలేషన్‌లో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. దీనిపై వీరిద్దరు ఎప్పుడూ స్పందించలేదు. వీరి గురించి తెలిసిన కొందరు త్వరలోనే మెగా ఫ్యామిలీలో పెళ్లి భాజాలు మోగనున్నాయని, వరుణ్ - లావణ్య ఒక్కటి కానున్నారంటూ ప్రచారం చేశారు. ఈ పుకార్లతో మాకేంపని అనుకుందో ఏమో లావణ్య త్రిపాఠి.. తాజాగా వరుణ్ తేజ్ నటించిన ‘గని’ చిత్రం విడుదల నేపథ్యంలో ట్విట్టర్ ద్వారా విషెస్ తెలిపింది. 


Also Read: కోర్టు స్టే ఆర్డర్‌తో వర్మ భయపడ్డారా? లేదంటే థియేటర్ల నాన్ కోపరేషన్ కారణమా?




సింపుల్‌గా ‘ఆల్‌ ది బెస్ట్’ చెప్పకుండా.. కాస్త ఎక్కువగానే మేటర్ పెట్టడంతో ‘ఇది.. అదే’ అంటున్నారు ఫ్యాన్స్. ‘‘రేపు గనీ విడుదల సందర్భంగా వరుణ్ తేజ్, టీమ్‌కు శుభాకాంక్షలు. మీరు (వరుణ్) ఈ పాత్రకు 110 శాతం శ్రమించారు. మీకు, మీ బృందం పడిన కృషికి మా అద్భుతమైన ప్రేక్షకులు ప్రతిఫలమివ్వాలని నేను ప్రార్థిస్తున్నాను’’ అని ట్వీట్ చేసింది. దీంతో ఇన్నాళ్లు కేవలం రూమర్ మాత్రమే అనుకున్న అభిమానులు, నిజంగానే వీరి మధ్య ఏదో ఉందనే సందేహాన్ని వ్యక్తం చేస్తున్నారు. కొందరైతే ‘‘దొరికిపోయావ్ లావణ్య’’ అని అంటున్నారు. కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో తెరకెక్కిన ‘గని’లో వరుణ్ బాక్సర్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే. నిర్మాత అల్లు అరవింద్‌ సమర్పణలో అల్లు బాబీ, సిద్ధు ‘గని’ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా ఏప్రిల్ 8న (శుక్రవారం) విడుదల కానుంది.